Political News

వైరల్ యాక్ట్- అమరావతిలో మట్టికి బాబు సాష్టాంగ నమస్కారం

టీడీపీ అధినేత.. ఏపీ విపక్ష నేత చంద్రబాబు తనకు లభించిన అవకాశాన్ని అస్సలు వదులుకోలేదు. ఏపీకి ఒక రాజధాని మాత్రమే ఉండాలంటూ అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళన ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో.. అక్కడ ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యేందుకు బాబు వెళ్లారు. ఈ సందర్భంగా పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అన్నింటికి మించి..అమరావతి భూమిపూజ జరిగిన చోట చంద్రబాబు వ్యవహరించిన తీరు ఇప్పుడు వైరల్ గా మారింది.

ఎందుకంటే.. భూమిపూజ జరిగిన ప్రాంతానికి వెళ్లి.. అక్కడ గుట్టగా పోసిన మట్టి మీద పడుకొని.. సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. ఇక..భూమిపూజ జరిగే ప్రాంతానికి వెళ్లేందుకు హైడ్రామా చోటు చేసుకుంది. తొలుత బెజవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్న ఆయన.. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని నినాదంతో చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికారు. దానికి అమ్మ ఆశీస్సులు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ప్రజా రాజధాని అమరావతి అన్నది అందరి కల అని చెప్పిన చంద్రబాబు.. దానిని విధ్వంసం చేస్తున్నారన్నారు.

ఎన్నో విధాలుగా దాడులు చేస్తున్నా.. ఏడాది కాలంగా అమరావతిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అమ్మవారి దర్శనం తర్వాత ఉద్దండరాయునిపాలానికి బయలుదేరిన బాబు.. కరకట్ట మీదుగా కాకుండా అమరావతి కోసం ఉద్యమం సాగిన గ్రామాల మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో.. ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో టీడీపీ నేతలు చర్చలు జరిపారు. చివరకు పరిమిత సంఖ్యలో వాహనాల్ని అనుమతిస్తామని చెప్పారు. అయితే.. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న వాహనాల్ని పోలీసులు అనుమతించకపోవటంతో గందరగోళం చోటు చేసుకుంది. హైడ్రామా నడుమ శంకుస్థాపన జరిగిన ప్రాంతానికి చేరుకున్న బాబు.. సాష్టాంగ నమస్కారం చేసి తన మార్కును చూపించే ప్రయత్నం చేశారు.

This post was last modified on December 17, 2020 6:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago