జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, అరవ శ్రీధర్ ను సదరు మహిళ పాతిక కోట్ల రూపాయలు డిమాండ్ చేసి బెదిరించిందని ఆరోపణలు వస్తున్నాయి.
ఓ మహిళ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేసినా అరవ శ్రీధర్ పై కేసు నమోదు చేయలేదని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎట్టకేలకు అరవ శ్రీధర్ పై కేసు నమోదైంది. తిరుపతి జిల్లా ఎస్పీకి ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు, అరవ శ్రీధర్ పై సదరు మహిళ చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు ముగ్గురు జనసేన నేతలతో జనసేన పార్టీ ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆ కమిటీ ముందు అరవ శ్రీధర్ విచారణకు హాజరయ్యారు. రైల్వేకోడూరులోని ఓ హోటల్ లో విచారణకు హాజరయ్యారు శ్రీధర్. ఆ ఆరోపణలకు సంబంధించిన వివరాలను కమిటీ సేకరించింది.
అయితే, విచారణ మధ్యలోనే శ్రీధర్ బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. విచారణ ముగిసిన తర్వాత మీడియాకు పూర్తి సమాచారం ఇస్తానని చెప్పిన శ్రీధర్..ఆ తర్వాత బయటకు వెళ్తూ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తనపై వచ్చిన ఆరోపణలపై తర్వాత వివరణ ఇస్తానని, తన వివరణను కమిటీకి వివరించానని మీడియాతో శ్రీధర్ అన్నారట.
This post was last modified on February 3, 2026 6:47 pm
ఈ రోజుల్లో పెద్ద స్టార్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం అన్నది దాదాపు అసాధ్యంగా మారిపోయింది. మిడ్ రేంజ్ హీరోలు…
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన జనసేన నాయకుడు, సీనియర్ నేత ఆరణి శ్రీనివాసులు రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర…
కొందరు నటనలోకి రావాలని ముందే ఒక లక్ష్యం పెట్టుకుని పని చేస్తారు. కొందరు అనుకోకుండా ఈ రంగంలోకి అడుగు పెడతారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి.. పార్టీ నాయకులకు బాగా కలిసి వస్తోందన్నవాదన వినిపిస్తోంది. ఇప్పటికి రెండు సంవత్సరాలుగా చంద్రబాబు.. తమ్ముళ్లకు…
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఈ తరహా పరిస్థితులు కొత్తేమీ…
ఈ వారం మంచి అంచనాల మధ్య రిలీజైన సినిమా.. చెన్నై లవ్ స్టోరీ. ఐతే ప్రి రిలీజ్ బజ్ ఎంత…