జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, అరవ శ్రీధర్ ను సదరు మహిళ పాతిక కోట్ల రూపాయలు డిమాండ్ చేసి బెదిరించిందని ఆరోపణలు వస్తున్నాయి.
ఓ మహిళ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేసినా అరవ శ్రీధర్ పై కేసు నమోదు చేయలేదని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎట్టకేలకు అరవ శ్రీధర్ పై కేసు నమోదైంది. తిరుపతి జిల్లా ఎస్పీకి ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు, అరవ శ్రీధర్ పై సదరు మహిళ చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు ముగ్గురు జనసేన నేతలతో జనసేన పార్టీ ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆ కమిటీ ముందు అరవ శ్రీధర్ విచారణకు హాజరయ్యారు. రైల్వేకోడూరులోని ఓ హోటల్ లో విచారణకు హాజరయ్యారు శ్రీధర్. ఆ ఆరోపణలకు సంబంధించిన వివరాలను కమిటీ సేకరించింది.
అయితే, విచారణ మధ్యలోనే శ్రీధర్ బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. విచారణ ముగిసిన తర్వాత మీడియాకు పూర్తి సమాచారం ఇస్తానని చెప్పిన శ్రీధర్..ఆ తర్వాత బయటకు వెళ్తూ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తనపై వచ్చిన ఆరోపణలపై తర్వాత వివరణ ఇస్తానని, తన వివరణను కమిటీకి వివరించానని మీడియాతో శ్రీధర్ అన్నారట.
This post was last modified on February 3, 2026 6:47 pm
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…
షాప్లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…
ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…
మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…