జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, అరవ శ్రీధర్ ను సదరు మహిళ పాతిక కోట్ల రూపాయలు డిమాండ్ చేసి బెదిరించిందని ఆరోపణలు వస్తున్నాయి.
ఓ మహిళ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేసినా అరవ శ్రీధర్ పై కేసు నమోదు చేయలేదని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎట్టకేలకు అరవ శ్రీధర్ పై కేసు నమోదైంది. తిరుపతి జిల్లా ఎస్పీకి ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు, అరవ శ్రీధర్ పై సదరు మహిళ చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు ముగ్గురు జనసేన నేతలతో జనసేన పార్టీ ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆ కమిటీ ముందు అరవ శ్రీధర్ విచారణకు హాజరయ్యారు. రైల్వేకోడూరులోని ఓ హోటల్ లో విచారణకు హాజరయ్యారు శ్రీధర్. ఆ ఆరోపణలకు సంబంధించిన వివరాలను కమిటీ సేకరించింది.
అయితే, విచారణ మధ్యలోనే శ్రీధర్ బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. విచారణ ముగిసిన తర్వాత మీడియాకు పూర్తి సమాచారం ఇస్తానని చెప్పిన శ్రీధర్..ఆ తర్వాత బయటకు వెళ్తూ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తనపై వచ్చిన ఆరోపణలపై తర్వాత వివరణ ఇస్తానని, తన వివరణను కమిటీకి వివరించానని మీడియాతో శ్రీధర్ అన్నారట.
This post was last modified on February 3, 2026 6:47 pm
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆనంద్ దేవరకొండని సక్సెస్ వరించడానికి టైం అయితే పట్టింది. బేబీ…
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై ఇప్పటికే సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ…
ఈ మధ్య కాలంలో థియేటర్లలో సుదీర్ఘ కాలం ఆడిన సినిమా.. ‘దురంధర్’. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటికీ…
మెటా (Meta) ప్రస్తుతం అందరికీ పరిచయం ఉన్న పేరు. వాట్సాప్ ఈ సంస్థకు చెందినదనే విషయం తెలిసిందే. అయితే భారత్లో…
ఏపీలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ల ఇళ్లపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు, తిరుపతి…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.…