క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇక్కడ సీట్లంటే మొన్నటి అసెంబ్లీలో తెలుగుదేశంపార్టీ గెలుచుకున్న ఎంఎల్ఏ సీట్లు కాదులేండి. అప్పుడెప్పుడో టీడీపీ హయాంలో జరిగిన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పైన ఇఫుడు వైసీపీ గురిపెట్టిందట. 2017లో జరిగిన కాకినడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. 50 డివిజిన్లకు గాను 48 డివిజన్లలోనే ఎన్నికలు జరిగాయి. కోర్టు వివాదాల కారణంగా రెండు డివిజన్లలో ఎన్నికలు జరగలేదు.
జరిగిన ఎన్నికలో టీడీపీ 32 డివిజన్లలో గెలిచింది. వైసీపీ 10, బీజేపీ, ఇండిపెండెంట్లు చెరో మూడు డివిజన్లలో గెలిచారు. అత్యధిక డివిజన్లలో గెలిచిన కారణంగా టీడీపీ నేత సుంకరపావని మేయర్ అయ్యారు. వైసీపీ తరపున గెలిచిన 10 మంది కార్పొరేటర్లను పార్టీ మారేట్లుగా అప్పట్లోనే టీడీపీ ఓ రేంజిలో ఒత్తిడి తెచ్చింది. అయినా వాళ్ళెవరు టీడీపీ కండువాలు కప్పుకోవటానికి ఇష్టపడలేదు.
కాలం గిర్రున తిరిగి మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దాంతో కాకినాడ అధికారపార్టీ ఎంఎల్ఏ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చక్రం తిప్పటం మొదలుపెట్టారు. తమ పార్టీ అధికారంలోకి రావటంతో కార్పొరేటర్లది ఇపుడు పైచేయి అయ్యింది. దాంతో మేయర్+టీడీపీ కార్పొరేటర్లు డమ్మీలైపోయారట. ప్రభుత్వం మారిపోగానే ఇపుడు టీడీపీ మేయర్, కార్పొరేటర్లలో అభద్రత మొదలైనట్లు సమాచారం.
ఇంకా మూడున్నరేళ్ళు అధికారంలో ఉండబోయే వైసీపీతో గొడవలెందుకున్న ఉద్దేశ్యంతో చాలామంది పార్టీ మారిపోవటానికి రెడీ అయిపోయారని సమాచారం. టీడీపీ తరపున గెలిచిన 32 మందిలో ఓ 25 మంది కార్పొరేటర్లు వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయిపోయారట. ఇదే గనుక నిజంగా జరిగితే టీడీపీ 25 మంది కొర్పొరేటర్లు + అధికారపార్టీ 10 మంది కార్పొరేటర్లు కలుపుకుంటే మేయర్ పీఠం వైసీపీదే అవుతుంది. దీన్ని అడ్డుకునేందుకు టీడీపీ సీనియర్లు ప్రయత్నాలు మొదలుపెట్టారట.
అయితే అది సాధ్యమవుతుందా ? ఎందుకంటే పార్టీ ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి చాలామంది సీనియర్ నేతలు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. పైగా తాము అధికారంలో ఉన్నపుడు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు గురిచేసి వైసీపీ వాళ్ళని టీడీపీ లొంగదీసుకుంది. ఇపుడు అదే దారిలో వైసీపీ వెళుతోందంతే. కాబట్టి చూస్తుండటం కన్నా టీడీపీ చేయగలిగింది లేదు.
This post was last modified on December 17, 2020 10:21 am
టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి.. పార్టీ నాయకులకు బాగా కలిసి వస్తోందన్నవాదన వినిపిస్తోంది. ఇప్పటికి రెండు సంవత్సరాలుగా చంద్రబాబు.. తమ్ముళ్లకు…
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఈ తరహా పరిస్థితులు కొత్తేమీ…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…