Political News

టీడీపీ సీటుపై వైసీపీ గురిపెట్టిందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇక్కడ సీట్లంటే మొన్నటి అసెంబ్లీలో తెలుగుదేశంపార్టీ గెలుచుకున్న ఎంఎల్ఏ సీట్లు కాదులేండి. అప్పుడెప్పుడో టీడీపీ హయాంలో జరిగిన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పైన ఇఫుడు వైసీపీ గురిపెట్టిందట. 2017లో జరిగిన కాకినడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. 50 డివిజిన్లకు గాను 48 డివిజన్లలోనే ఎన్నికలు జరిగాయి. కోర్టు వివాదాల కారణంగా రెండు డివిజన్లలో ఎన్నికలు జరగలేదు.

జరిగిన ఎన్నికలో టీడీపీ 32 డివిజన్లలో గెలిచింది. వైసీపీ 10, బీజేపీ, ఇండిపెండెంట్లు చెరో మూడు డివిజన్లలో గెలిచారు. అత్యధిక డివిజన్లలో గెలిచిన కారణంగా టీడీపీ నేత సుంకరపావని మేయర్ అయ్యారు. వైసీపీ తరపున గెలిచిన 10 మంది కార్పొరేటర్లను పార్టీ మారేట్లుగా అప్పట్లోనే టీడీపీ ఓ రేంజిలో ఒత్తిడి తెచ్చింది. అయినా వాళ్ళెవరు టీడీపీ కండువాలు కప్పుకోవటానికి ఇష్టపడలేదు.

కాలం గిర్రున తిరిగి మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దాంతో కాకినాడ అధికారపార్టీ ఎంఎల్ఏ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చక్రం తిప్పటం మొదలుపెట్టారు. తమ పార్టీ అధికారంలోకి రావటంతో కార్పొరేటర్లది ఇపుడు పైచేయి అయ్యింది. దాంతో మేయర్+టీడీపీ కార్పొరేటర్లు డమ్మీలైపోయారట. ప్రభుత్వం మారిపోగానే ఇపుడు టీడీపీ మేయర్, కార్పొరేటర్లలో అభద్రత మొదలైనట్లు సమాచారం.

ఇంకా మూడున్నరేళ్ళు అధికారంలో ఉండబోయే వైసీపీతో గొడవలెందుకున్న ఉద్దేశ్యంతో చాలామంది పార్టీ మారిపోవటానికి రెడీ అయిపోయారని సమాచారం. టీడీపీ తరపున గెలిచిన 32 మందిలో ఓ 25 మంది కార్పొరేటర్లు వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయిపోయారట. ఇదే గనుక నిజంగా జరిగితే టీడీపీ 25 మంది కొర్పొరేటర్లు + అధికారపార్టీ 10 మంది కార్పొరేటర్లు కలుపుకుంటే మేయర్ పీఠం వైసీపీదే అవుతుంది. దీన్ని అడ్డుకునేందుకు టీడీపీ సీనియర్లు ప్రయత్నాలు మొదలుపెట్టారట.

అయితే అది సాధ్యమవుతుందా ? ఎందుకంటే పార్టీ ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి చాలామంది సీనియర్ నేతలు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. పైగా తాము అధికారంలో ఉన్నపుడు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు గురిచేసి వైసీపీ వాళ్ళని టీడీపీ లొంగదీసుకుంది. ఇపుడు అదే దారిలో వైసీపీ వెళుతోందంతే. కాబట్టి చూస్తుండటం కన్నా టీడీపీ చేయగలిగింది లేదు.

This post was last modified on December 17, 2020 10:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

37 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

1 hour ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

2 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago