Political News

మార్చిలోగా స్ధానిక ఎన్నికలు జరిగేది డౌటేనా ?

మొన్నటి మార్చిలో వాయిదాపడిన స్ధానికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనబడటం లేదు. జనవరి 15 నుండి మార్చి 15వ వరకు కరోనా వైరస్ మళ్ళీ విజృంభించబోతోందంటు ప్రపంచ ఆరోగ్య సంస్ధతో పాటు కేంద్రప్రభుత్వం కూడా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్ధితుల్లో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుకున్నట్లు ఫిబ్రవరిలో వాయిదాపడిన ఎన్నికలను నిర్వహించటం సాధ్యంకాదని ప్రభుత్వం హైకోర్టులో మంగళవారం ఓ అఫిడవిట్ దాఖలు చేసింది.

ఇఫ్పటికే ప్రభుత్వం కోర్టులో ఇదే విషయమై కేసు కూడా వేసిన కారణంగా ఎలక్షన్ కమీషన్ కు కౌంటర్ల వేయమని ఆదేశించింది. ఇదే సమయంలో ప్రభుత్వం తాజాగా అదనపు అఫిడవిట్ వేయటం గమనార్హం. జనవరి-ఫిబ్రవరి నెలల్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయటానికి ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లను చేస్తున్న విషయాన్ని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. జనాలందరికీ కరోనా వ్యాక్సిన్ వేసే విషయంలో పోలీసులు, రెవిన్యు సిబ్బంది సేవలు ప్రభుత్వానికి చాలా అవసరమన్న విషయాన్ని గుర్తుచేసింది.

ఫిబ్రవరిలో వాయిదాపడిన ఎన్నికలను నిర్వహించేందుకు నిమ్మగడ్డ చేస్తున్న ఏర్పాట్లను కూడా ప్రస్తావించింది. వ్యాక్సిన్ వేయటంలో యావత్ ప్రభుత్వ యంత్రాంగమంతా బిజీగా ఉంటారు కాబట్టి ఎన్నికల నిర్వహణలో పార్టిసిపేట్ చేయటం ఎవరికీ కుదరదని తేల్చి చెప్పేసింది. అదనపు అఫిడవిట్ వివరాలు తీసుకున్న కోర్టు ఇదే విషయాన్ని ఎన్నికల కమీషన్ కు చెప్పి అఫిడవిట్ దాఖలు చేయమని కోరింది. అలాగే తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మొత్తానికి తాను రిటైర్ అయ్యేలోగా ఎలాగైనా ఎన్నికలను పూర్తి చేయాలన్న నిమ్మగడ్డ పంతం నెరవేరేట్లు కనబటం లేదు.

This post was last modified on December 16, 2020 6:58 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

9 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

10 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

11 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

12 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

12 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

13 hours ago