Political News

మార్చిలోగా స్ధానిక ఎన్నికలు జరిగేది డౌటేనా ?

మొన్నటి మార్చిలో వాయిదాపడిన స్ధానికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనబడటం లేదు. జనవరి 15 నుండి మార్చి 15వ వరకు కరోనా వైరస్ మళ్ళీ విజృంభించబోతోందంటు ప్రపంచ ఆరోగ్య సంస్ధతో పాటు కేంద్రప్రభుత్వం కూడా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్ధితుల్లో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుకున్నట్లు ఫిబ్రవరిలో వాయిదాపడిన ఎన్నికలను నిర్వహించటం సాధ్యంకాదని ప్రభుత్వం హైకోర్టులో మంగళవారం ఓ అఫిడవిట్ దాఖలు చేసింది.

ఇఫ్పటికే ప్రభుత్వం కోర్టులో ఇదే విషయమై కేసు కూడా వేసిన కారణంగా ఎలక్షన్ కమీషన్ కు కౌంటర్ల వేయమని ఆదేశించింది. ఇదే సమయంలో ప్రభుత్వం తాజాగా అదనపు అఫిడవిట్ వేయటం గమనార్హం. జనవరి-ఫిబ్రవరి నెలల్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయటానికి ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లను చేస్తున్న విషయాన్ని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. జనాలందరికీ కరోనా వ్యాక్సిన్ వేసే విషయంలో పోలీసులు, రెవిన్యు సిబ్బంది సేవలు ప్రభుత్వానికి చాలా అవసరమన్న విషయాన్ని గుర్తుచేసింది.

ఫిబ్రవరిలో వాయిదాపడిన ఎన్నికలను నిర్వహించేందుకు నిమ్మగడ్డ చేస్తున్న ఏర్పాట్లను కూడా ప్రస్తావించింది. వ్యాక్సిన్ వేయటంలో యావత్ ప్రభుత్వ యంత్రాంగమంతా బిజీగా ఉంటారు కాబట్టి ఎన్నికల నిర్వహణలో పార్టిసిపేట్ చేయటం ఎవరికీ కుదరదని తేల్చి చెప్పేసింది. అదనపు అఫిడవిట్ వివరాలు తీసుకున్న కోర్టు ఇదే విషయాన్ని ఎన్నికల కమీషన్ కు చెప్పి అఫిడవిట్ దాఖలు చేయమని కోరింది. అలాగే తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మొత్తానికి తాను రిటైర్ అయ్యేలోగా ఎలాగైనా ఎన్నికలను పూర్తి చేయాలన్న నిమ్మగడ్డ పంతం నెరవేరేట్లు కనబటం లేదు.

This post was last modified on December 16, 2020 6:58 pm

Share

Recent Posts

ఆది నుంచీ.. `కొండా ఫ్యామిలీ` పార్టీల‌కు గుదిబండే!

ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్ర‌తిపార్టీలోనూ ఇబ్బందులు వ‌స్తే.. ప్ర‌తిపార్టీపైనా…

1 hour ago

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

4 hours ago

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

7 hours ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

7 hours ago

మ‌ళ్లీ కౌంటింగ్ చేపట్టాలి: ఓట‌మిపై కోర్టుకు స్టాలిన్‌

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌.. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ…

7 hours ago

అల్లరోడి వింటేజ్ కామెడీకి పెద్ద పరీక్ష

చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…

8 hours ago