ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం అక్కడి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 5,555 ఈ–సైకిళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసింది.
ఈ కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురంలోని తన నివాసం నుంచి తూంసీలో నిర్వహించిన ప్రజావేదిక వరకు అంటే దాదాపు 3 కిలోమీటర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లబ్ధిదారులతో కలిసి ఈ–సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి సైకిల్పై ముందుండి నడిపిన ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది.
ఇ–మోటరాడ్ సంస్థ తయారు చేసిన ఈ–సైకిళ్లను కుప్పంలోని యూనిట్లోనే అసెంబ్లింగ్ చేశారు. కేవలం 24 గంటల వ్యవధిలో ఇంత భారీ సంఖ్యలో ఈ–సైకిళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడం ద్వారా గిన్నీస్ వరల్డ్ రికార్డును సైతం సొంతం చేసుకున్నారు. పర్యావరణ హిత ప్రయాణానికి, మహిళలకు ఉపాధి అవకాశాలకు ఈ–సైకిళ్లు దోహదపడతాయని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. అభివృద్ధితో పాటు ప్రకృతిని కాపాడే దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.
This post was last modified on January 31, 2026 3:20 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…