Political News

బాబు గారి మూడు కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం అక్కడి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 5,555 ఈ–సైకిళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసింది.

ఈ కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురంలోని తన నివాసం నుంచి తూంసీలో నిర్వహించిన ప్రజావేదిక వరకు అంటే దాదాపు 3 కిలోమీటర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లబ్ధిదారులతో కలిసి ఈ–సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి సైకిల్‌పై ముందుండి నడిపిన ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది.

ఇ–మోటరాడ్ సంస్థ తయారు చేసిన ఈ–సైకిళ్లను కుప్పంలోని యూనిట్‌లోనే అసెంబ్లింగ్ చేశారు. కేవలం 24 గంటల వ్యవధిలో ఇంత భారీ సంఖ్యలో ఈ–సైకిళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడం ద్వారా గిన్నీస్ వరల్డ్ రికార్డును సైతం సొంతం చేసుకున్నారు. పర్యావరణ హిత ప్రయాణానికి, మహిళలకు ఉపాధి అవకాశాలకు ఈ–సైకిళ్లు దోహదపడతాయని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. అభివృద్ధితో పాటు ప్రకృతిని కాపాడే దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

Kumar

Recent Posts

అనుకున్నట్లే జరిగింది.. రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్!

అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…

53 minutes ago

బుచ్చిబాబు మీద నమ్మకం ఎంత ఉందంటే

మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…

53 minutes ago

మెగా సినిమాల మీదే యువి భారం

మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…

57 minutes ago

పీఏ అక్ర‌మాలు… గట్టిగా వినిపిస్తున్న జగన్ పేరు

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు.. రాష్ట్రంలో జ‌రిగిన అనేక అక్ర‌మాల‌పై ప్ర‌స్తుత ప్ర‌భుత్వం విచార‌ణ చేస్తున్న…

2 hours ago

తెలుగు దుకాణంలో డబ్బింగ్ వ్యాపారం

వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా…

3 hours ago

కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై…

4 hours ago