బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు తెలంగాణ ఉద్యమ నేతగా, సుదీర్ఘ కాలం బీఆర్ఎస్ కు సేవలందించిన సీనియర్ పొలిటిషియన్ గా తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక, గులాబీ పార్టీ బాస్, మాజీ సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది.
అయితే, రాజకీయ పరిణామాలు, రకరకాల ఆరోపణల నేపథ్యంలోనే ఆయన బీజేపీలో చేరారు. అయితే, బీజేపీ ఎంపీ అయిన ఈటలకు ఆ పార్టీలో తగిన గుర్తింపు లేదని, ఆయన త్వరలోనే పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే మల్కాజ్ గిరిలో జరిగిన ఓ సభలో ఈటల చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మర్రి రాజశేఖర్ రెడ్డి బాస్…అదే మా బాస్ కేసీఆర్ అంటూ ఈటల అనగానే సభా ప్రాంగణమంతా హోరెత్తింది. జై కేసీఆర్.. జై బీఆర్ఎస్ అంటూ జనం నినాదాలు చేశారు.
మల్కాజ్ గిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఈటల ఎంపీ హోదాలో శంకు స్థాపన చేశారు. నియోజకవర్గంలో చేపట్టే పనులన్నింటికీ కేంద్రం నుంచి నిధులను మంజూరు చేయించే ప్రయత్నం చేస్తానని అన్నారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ…రాజశేఖర్ రెడ్డి బాస్…అదే మా బాస్ అంటూ ఈటల ఆ కామెంట్లు చేశారు.
దీంతో, ఈటల వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. మంచి వక్తగా, బ్యాలెన్సెడ్ గా మాట్లాడతారని పేరున్న ఈటల నోట కేసీఆర్ మా బాస్ అని రావడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో, ఈటల బీఆర్ఎస్ లో చేరతారని, అందుకే ఇలా మాట్లాడారు అని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు.
This post was last modified on January 30, 2026 12:36 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…