తనను తాను జంతు ప్రేమికుడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించుకున్నారు. అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ జంతు సంరక్షణపై తన అభిమతాన్ని చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు విశాఖపట్నం పర్యటనలో ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు.
పర్యటనలో ఆయన జూ పార్క్లోని నూతన ఎలుగుబంట్ల ఎన్క్లోజర్ను ప్రారంభించారు. ఆ తర్వాత నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎన్క్లోజర్లను సందర్శించి వాటి సంరక్షణ, ఆహారం, పేర్ల వివరాలను జూ క్యూరేటర్ నుండి తెలుసుకున్నారు. ఏనుగులు, జిరాఫీలకు స్వయంగా ఆహారం అందిస్తూ, జంతు సంక్షేమంపై తమ ప్రత్యేకత చూపించారు. సీతాకోక చిలుకలతో పవన్ ఒక చిన్నపిల్లాడిలా ఆడుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ సందర్భంగా తన తల్లి అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా జూ పార్క్లోని రెండు జిరాఫీలను ఏడాదంతా దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. జిరాఫీల సంరక్షణకు కావలసిన మొత్తం ఖర్చును స్వయంగా భరిస్తానని ఆయన తెలిపారు.
పవన్ కళ్యాణ్ జంతు సంరక్షణలో కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం కంబాలకొండ ఎకో పార్క్లో నగర వనం ప్రారంభించి, చెక్క వంతెనపై కనోపీ వాక్ చేశారు. మార్గంలో మొక్కల వివరణలను అధికారులు వివరించారు. ఈ పర్యటన ద్వారా పర్యావరణ పరిరక్షణ, జంతు సంక్షేమం పై ప్రజల అవగాహన పెరుగుతుందని భావిస్తున్నారు.
This post was last modified on January 29, 2026 4:32 pm
చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…