Political News

జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్

తనను తాను జంతు ప్రేమికుడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించుకున్నారు. అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ జంతు సంరక్షణపై తన అభిమతాన్ని చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు విశాఖపట్నం పర్యటనలో ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు.

పర్యటనలో ఆయన జూ పార్క్‌లోని నూతన ఎలుగుబంట్ల ఎన్‌క్లోజర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎన్‌క్లోజర్లను సందర్శించి వాటి సంరక్షణ, ఆహారం, పేర్ల వివరాలను జూ క్యూరేటర్ నుండి తెలుసుకున్నారు. ఏనుగులు, జిరాఫీలకు స్వయంగా ఆహారం అందిస్తూ, జంతు సంక్షేమంపై తమ ప్రత్యేకత చూపించారు. సీతాకోక చిలుకలతో పవన్ ఒక చిన్నపిల్లాడిలా ఆడుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ సందర్భంగా తన తల్లి అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా జూ పార్క్‌లోని రెండు జిరాఫీలను ఏడాదంతా దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. జిరాఫీల సంరక్షణకు కావలసిన మొత్తం ఖర్చును స్వయంగా భరిస్తానని ఆయన తెలిపారు.

పవన్ కళ్యాణ్ జంతు సంరక్షణలో కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం కంబాలకొండ ఎకో పార్క్‌లో నగర వనం ప్రారంభించి, చెక్క వంతెనపై కనోపీ వాక్ చేశారు. మార్గంలో మొక్కల వివరణలను అధికారులు వివరించారు. ఈ పర్యటన ద్వారా పర్యావరణ పరిరక్షణ, జంతు సంక్షేమం పై ప్రజల అవగాహన పెరుగుతుందని భావిస్తున్నారు.

This post was last modified on January 29, 2026 4:32 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

40 seconds ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

32 minutes ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

1 hour ago

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

2 hours ago

ఫస్ట్ టైమ్.. అసెంబ్లీలో చే’నేత’ స్టాళ్లు

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప‌లు ఆసక్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ స‌మావేశాల‌కు విద్యార్థుల‌ను అనుమ‌తిస్తున్నారు. స‌మావేశాల‌ను వారు ప్ర‌త్య‌క్షంగా…

2 hours ago

ఈసారి డీఎస్సీలో వారిపైనే ప్రత్యేక దృష్టి?

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…

3 hours ago