తనను తాను జంతు ప్రేమికుడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించుకున్నారు. అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ జంతు సంరక్షణపై తన అభిమతాన్ని చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు విశాఖపట్నం పర్యటనలో ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు.
పర్యటనలో ఆయన జూ పార్క్లోని నూతన ఎలుగుబంట్ల ఎన్క్లోజర్ను ప్రారంభించారు. ఆ తర్వాత నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎన్క్లోజర్లను సందర్శించి వాటి సంరక్షణ, ఆహారం, పేర్ల వివరాలను జూ క్యూరేటర్ నుండి తెలుసుకున్నారు. ఏనుగులు, జిరాఫీలకు స్వయంగా ఆహారం అందిస్తూ, జంతు సంక్షేమంపై తమ ప్రత్యేకత చూపించారు. సీతాకోక చిలుకలతో పవన్ ఒక చిన్నపిల్లాడిలా ఆడుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ సందర్భంగా తన తల్లి అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా జూ పార్క్లోని రెండు జిరాఫీలను ఏడాదంతా దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. జిరాఫీల సంరక్షణకు కావలసిన మొత్తం ఖర్చును స్వయంగా భరిస్తానని ఆయన తెలిపారు.
పవన్ కళ్యాణ్ జంతు సంరక్షణలో కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం కంబాలకొండ ఎకో పార్క్లో నగర వనం ప్రారంభించి, చెక్క వంతెనపై కనోపీ వాక్ చేశారు. మార్గంలో మొక్కల వివరణలను అధికారులు వివరించారు. ఈ పర్యటన ద్వారా పర్యావరణ పరిరక్షణ, జంతు సంక్షేమం పై ప్రజల అవగాహన పెరుగుతుందని భావిస్తున్నారు.
This post was last modified on January 29, 2026 4:32 pm
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…