తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను కూడా ఈ కేసులో విచారణ జరిపేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు… కేసీఆర్ పీఏకు నోటీసులిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే, వయసు దృష్ట్యా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణకు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని సిట్ అధికారులు తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వారు పోలీస్ స్టేషన్ కు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన అవసరం లేదని సీఆర్పీసీ 160 చట్టంలో ఉందని, కాబట్టి కేసీఆర్ కోరుకున్న చోట విచారణ జరుపుతామని సిట్ అధికారులు తెలిపారు.
అయితే, ఆ ప్రదేశం హైదరాబాద్ నగర పరిధిలో ఉండాలని పేర్కొంది. కేసీఆర్ ఎక్కడ విచారణ జరగాలని కోరుకుంటున్నారో అన్న విషయాన్ని తమకు ముందస్తుగా తెలియజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరబాద్ నగర పరిధిలో అని అన్నారు కాబట్టి నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరిగే అవకాశముంది.
This post was last modified on January 29, 2026 1:53 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…