ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎట్టకేలకు ఊరట లభించింది. ఆ కేసులో చెవిరెడ్డికి హైకోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. భాస్కర్ రెడ్డితోపాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.
2025 జూన్ 17న బెంగుళూరులో చెవిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 226 రోజుల తర్వాత చెవిరెడ్డికి బెయిల్ మంజూరైంది.
వైసీపీ హయాంలో ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే పెద్ద లిక్కర్ స్కాం జరిగిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. డిస్టిలరీలు, లిక్కర్ సరఫరా కంపెనీల నుంచి కోట్ల రూపాయలను వైసీపీ నేతలు దండుకున్నారని, ఈ స్కాంలో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి అని కేసు నమోదైంది.
ఇక, కేసిరెడ్డి నుంచి వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోట్ల రూపాయలు అందుకున్నారని, ఆ డబ్బును 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చెవిరెడ్డి ఇచ్చారని సిట్ అభియోగాలు మోపింది. అంతేకాదు, ఈ లిక్కర్ స్కాంకు సూత్రధారి చెవిరెడ్డి అని ఆయనను ఏ-38గా, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఏ-39 నిందితులుగా పేర్కొంది.
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొడాలి నానీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు తాజాగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.…
మనం రావు బహదూర్, నాగబంధం గురించి మాట్లాడుకుంటున్నాం కానీ జూలై 3 అదే తేదీకి బాలీవుడ్ మూవీ అల్ఫా కూడా…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ల క్రేజీ కాంబినేషన్లో సుబ్రహ్మణ్యస్వామి జీవిత కథ ఆధారంగా రాబోతున్న మెగా మూవీ గురించి ఇటీవలే…
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ప్యాన్ ఇండియా మూవీ అనౌన్స్ మెంట్ వచ్చాక అభిమానులతో పాటు సగటు మూవీ లవర్స్ లో…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రావు బహదూర్ ప్రమోషన్లు ఆఖరి స్టేజికి వచ్చేశాయి. ప్రేక్షకుల తీర్పు అందుకునే సమయం…
తెలంగాణ బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని భావిస్తోంది. అయితే.. పైకి…