ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎట్టకేలకు ఊరట లభించింది. ఆ కేసులో చెవిరెడ్డికి హైకోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. భాస్కర్ రెడ్డితోపాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.
2025 జూన్ 17న బెంగుళూరులో చెవిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 226 రోజుల తర్వాత చెవిరెడ్డికి బెయిల్ మంజూరైంది.
వైసీపీ హయాంలో ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే పెద్ద లిక్కర్ స్కాం జరిగిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. డిస్టిలరీలు, లిక్కర్ సరఫరా కంపెనీల నుంచి కోట్ల రూపాయలను వైసీపీ నేతలు దండుకున్నారని, ఈ స్కాంలో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి అని కేసు నమోదైంది.
ఇక, కేసిరెడ్డి నుంచి వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోట్ల రూపాయలు అందుకున్నారని, ఆ డబ్బును 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చెవిరెడ్డి ఇచ్చారని సిట్ అభియోగాలు మోపింది. అంతేకాదు, ఈ లిక్కర్ స్కాంకు సూత్రధారి చెవిరెడ్డి అని ఆయనను ఏ-38గా, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఏ-39 నిందితులుగా పేర్కొంది.
This post was last modified on January 29, 2026 12:55 pm
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీట్ల సర్దుబాటు విషయంలో జనసేన నాయకుల కోరికలకు కూటమి పెద్ద టీడీపీ గ్రీన్సిగ్నల్…
స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. మాస్ మహారాజ తమ్ముడు కొడుకు మాధవ్ భూపతిరాజుని హీరోగా పరిచయం చేస్తూ…
‘90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’తో ఆదిత్య హాసన్ పేరు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. చిన్న చిన్న కుటుంబ…
ఇప్పటిదాకా తెలుగు తెరమీద వందలాది నక్సల్స్ సినిమాలు వచ్చాయి కానీ అవన్నీ సీరియస్ బ్యాక్ డ్రాప్ లో సాగేవే. ఎర్ర…
నాని కెరీర్ లోనే అత్యంత భారీ అంచనాలతో రూపొందుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 లేదా…
పాపం గీత - పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. రాజకీయంగా ఆమె ఇక్కడ పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత…