ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎట్టకేలకు ఊరట లభించింది. ఆ కేసులో చెవిరెడ్డికి హైకోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. భాస్కర్ రెడ్డితోపాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.
2025 జూన్ 17న బెంగుళూరులో చెవిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 226 రోజుల తర్వాత చెవిరెడ్డికి బెయిల్ మంజూరైంది.
వైసీపీ హయాంలో ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే పెద్ద లిక్కర్ స్కాం జరిగిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. డిస్టిలరీలు, లిక్కర్ సరఫరా కంపెనీల నుంచి కోట్ల రూపాయలను వైసీపీ నేతలు దండుకున్నారని, ఈ స్కాంలో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి అని కేసు నమోదైంది.
ఇక, కేసిరెడ్డి నుంచి వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోట్ల రూపాయలు అందుకున్నారని, ఆ డబ్బును 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చెవిరెడ్డి ఇచ్చారని సిట్ అభియోగాలు మోపింది. అంతేకాదు, ఈ లిక్కర్ స్కాంకు సూత్రధారి చెవిరెడ్డి అని ఆయనను ఏ-38గా, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఏ-39 నిందితులుగా పేర్కొంది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పరిస్థితి ఏమవుతుంది? అనేది ఆసక్తిగా మారింది. మధ్యప్రదేశ్ నుంచి…
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తో నెంబర్ వన్ స్థానం ఎంజాయ్ చేసిన హీరోయిన్ పూజా హగ్దేకు సక్సెస్…
ఒక దిగ్గజంసెలవు తీసుకున్నారు. తమిళ సినీ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పి తెలుగులోనూ అశేష అభిమానులను సొంతం చేసుకున్న దర్శకులు…
వర్షాకాలం ఇంకా ప్రారంభం కానే లేదు. అప్పుడే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్…
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…