జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ం పై వచ్చిన లైంగిక ఆరోపణల వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. జనసేనపై వైసీపీ నేతలు మాటల దాడికి దిగారు. బాధిత మహిళ స్వయంగా వచ్చి తనను బెదిరించి లోబరుచుకున్నాడు అని ఆరోపణలు చేస్తున్నప్పటికీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదు అని వైసీపీ మహిళా నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే అరవ శ్రీధర్ పై జనసేన చర్యలు తీసుకుంది. ఆ ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు జనసేన కార్యక్రమాలకు అరవ శ్రీధర్ దూరంగా ఉండాలని ఆదేశించింది.
ఆ ఆరోపణలపై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన రాష్ట్ర కమిటీ ఓ లేఖ విడుదల చేసింది. అరవ శ్రీధర్ పై మీడియాలో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని నిర్ణయించింది.
టి.శివశంకర్, శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి, టి.సి.వరుణ్ లతో ముగ్గురు సభ్యుల కమిటీ వేశామని తెలిపింది. అంతేకాదు, 7 రోజుల్లోగా కమిటీ ముందు అరవ శ్రీధర్ హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆ ఆరోపణలపై విచారణ జరిపిన తర్వాత పార్టీకి కమిటీ నివేదిక అందిస్తుందని వెల్లడించింది. ఇక, ఆ నివేదిక పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే వరకూ అరవ శ్రీధర్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది
This post was last modified on January 28, 2026 1:17 pm
తాను మరో పాదయాత్ర చేయబోతున్నానని ఏపీ మాజీ సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ పరస్పరం బాక్సాఫీస్ వద్ద తలపడిన సందర్భాలు బోలెడున్నాయి కానీ ఒకే బ్యాక్…
మహారాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత అజిత్ పవార్.. ఈ రోజు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రైవేట్ జెట్…
తమిళ స్టార్ హీరో ధనుష్ ఇప్పటికీ చూడ్డానికి కుర్రాడిలాగే ఉంటాడు. చక్కగా ప్రేమకథలూ చేసుకుంటున్నాడు. కానీ అతడికి టీనేజీలో ఉన్న…
యాంకర్ స్రవంతి చొక్కారపు బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో షోలు, ఇంటర్వ్యూలతో అలరించిన ఆమె ఇప్పుడు…
జనసేన నేత, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ప్రభుత్వ మహిళా ఉద్యోగి లైంగిక ఆరోపణలు చేసిన వైనం హాట్…