జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ం పై వచ్చిన లైంగిక ఆరోపణల వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. జనసేనపై వైసీపీ నేతలు మాటల దాడికి దిగారు. బాధిత మహిళ స్వయంగా వచ్చి తనను బెదిరించి లోబరుచుకున్నాడు అని ఆరోపణలు చేస్తున్నప్పటికీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదు అని వైసీపీ మహిళా నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే అరవ శ్రీధర్ పై జనసేన చర్యలు తీసుకుంది. ఆ ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు జనసేన కార్యక్రమాలకు అరవ శ్రీధర్ దూరంగా ఉండాలని ఆదేశించింది.
ఆ ఆరోపణలపై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన రాష్ట్ర కమిటీ ఓ లేఖ విడుదల చేసింది. అరవ శ్రీధర్ పై మీడియాలో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని నిర్ణయించింది.
టి.శివశంకర్, శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి, టి.సి.వరుణ్ లతో ముగ్గురు సభ్యుల కమిటీ వేశామని తెలిపింది. అంతేకాదు, 7 రోజుల్లోగా కమిటీ ముందు అరవ శ్రీధర్ హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆ ఆరోపణలపై విచారణ జరిపిన తర్వాత పార్టీకి కమిటీ నివేదిక అందిస్తుందని వెల్లడించింది. ఇక, ఆ నివేదిక పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే వరకూ అరవ శ్రీధర్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది
This post was last modified on January 28, 2026 1:17 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…