Political News

మంత్రులతో భేటీ… క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం

సింగరేణి బొగ్గు స్కాం ఆరోపణలు, ఆ నేపథ్యంలో మీడియాలో రకరకాల కథనాలు, కాంగ్రెస్ కీలక నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలపై సోషల్ మీడియాలో గుసగుసలు…ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఈ టాపిక్ లపై హాట్ డిబేట్ లు నడుస్తున్నాయి.

ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్న సమయంలో భట్టి విక్రమార్క నివాసంలో ఓ రహస్య భేటీ జరిగిందని పుకార్లు పుట్టాయి. భట్టి ఇంట్లో నలుగురు మంత్రులు రహస్యంగా 3 గంటల పాటు భేటీ అయ్యారని ప్రచారం జరిగింది.

రేవంత్ రెడ్డి బాధిత మంత్రులంతా ఒక్కతాటిపైకి వచ్చారని, రేవంత్ పై కాంగ్రెస్ హై కమాండ్ కు కంప్లయింట్ చేసేందుకు రెడీ అయ్యారని ఊహాగానాలు వచ్చాయి. భట్టి ఇంటికి ఒకే కారులో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లారని, మీడియాలో తమపై వస్తున్న వ్యతిరేక కథనాల వెనుక రేవంత్ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది.

ఈ క్రమంలోనే ఆ భేటీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. సీఎం అందుబాటులో లేకుంటే మంత్రులు భేటీ అయి పలు విషయాలపై చర్చించడం సాధారణ విషయమన్నారు. దానిపై అనవసరమైన రాద్దాంతం అవసరం లేదని చెప్పారు.

ఈ భేటీపై కొందరు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పాలనాపరమైన అంశాలు, మున్సిపల్‌ ఎన్నికల సన్నద్ధతపై మాట్లాడుకున్నామని, దాపరికం ఏమీ లేదని అన్నారు. ఇక, రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు మంత్రులు సమావేశం కావడంలో తప్పేం లేదని తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

This post was last modified on January 27, 2026 7:15 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

విస్మయపరిచే ‘రామ’ పరిచయం

బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…

2 hours ago

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

3 hours ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

7 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

9 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

13 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

14 hours ago