ప్రజా క్షేత్రంలో ఒకసారైనా..గెలిచిన నాయకులు బీజేపీలో చాలా మందే ఉన్నారు. కామినేని శ్రీనివాసరావు, కంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజు.. ఇలా అనేక మంది ఉన్నారు. ఇక, ఎన్నో సార్లు.. కమలం తరఫున బరిలోకి దిగి కూడా ఒక్కసారి కూడా విజయం సాధించని నాయకులు ఇంతకు రెండు రెట్లు ఉన్నారు. అయితే.. గతంలో గెలిచి, ప్రజానాడిని అంతో ఇంతో పట్టుకున్న నాయకులు గడప దాటడం లేదు. కానీ, నిరంతరం ఓడిన నాయకులు కూడా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఇదే ఇప్పుడు బీజేపీలో మేధావి వర్గాన్ని కలవరపరుస్తోంది.
ఓడిపోయినంత మాత్రాన వారిలో నాయకత్వ లక్షణాలు లేవని ఎవరూ అనరు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు.. దూకుడుగా ఉన్నారు.. ఉండాలి కూడా! ఈ కోవలోనే జీవీఎల్ నరసింహారావు(రాజ్యసభ ఎంపీ), విష్ణువర్థన్ రెడ్డి, సోము వీర్రాజు(ఎమ్మెల్సీ) వంటివారి దూకుడును ఎవరూ కాదనడంలో లేదు. రాజకీయం గా నిత్యంవీరు మీడియాలో కనిపిస్తున్నారు. ప్రభుత్వంపైనా ప్రతిపక్షంపైనా విమర్శలు చేస్తున్నారు. అయితే.. వీరు ఆశించిన రేంజ్లో ప్రజాభిమానాన్ని సంపాయించుకోలేక పోవడమే ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది. వీరు ఏం మాట్లాడినా.. ప్రజల నుంచి పెదవి విరుపులే కనిపిస్తున్నాయ.
అలా కాకుండా.. అప్పుడో.. ఎప్పుడో.. ఒక్కసారైన గెలిచిన నాయకులు బయటకు వస్తే.. కొంత ప్రజలు బీజేపీ వైపు చూసే అవకాశం ఉంటుందనేది మేధావి వర్గం మాట. సామాజిక వర్గాలను పక్కన పెడితే.. గెలిచిన నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు రావడం లేదు. పార్టీ తరఫున, ప్రజా సమస్యల తరఫున వాయిస్ వినిపించడమే మానేశారు. విశాఖ ఉత్తరం మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వంటి వారు వచ్చినా.. ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియని ఓ సందిగ్థ పరిస్థితి! ఇక, కామినేని వంటి కీలక నేత.. గడప దాటడం లేదు. గోకరాజు ఎక్కడ ఉన్నారో.. కూడా తెలియడం లేదు. దీంతో బీజేపీలో ఒక విధమైన శూన్యత ఆవరించిందని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా వీరు ముందుకు వస్తే.. పార్టీ పుంజుకుంటుందని సూచిస్తున్నారు. మరి ఎప్పుడు వస్తారో.. చూడాలి.
This post was last modified on December 16, 2020 12:04 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…