ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర యోగా, నేచురోపతి విభాగం ప్రభుత్వ సలహాదారుగా ప్రముఖ యోగా, ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును నియమించింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఈ నియామకం క్యాబినెట్ హోదాతో కూడిన పదవి కావడంతో జీతభత్యాలు, ప్రభుత్వ సదుపాయాలు లభించే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఈ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మంతెన, అయితే మొదటి నుంచే నిరాడంబర జీవన విధానాన్ని అనుసరిస్తూ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు.
క్యాబినెట్ హోదాతో వచ్చే ఎలాంటి జీతం, భత్యాలు, ప్రభుత్వ వాహనం, కార్యాలయ సదుపాయాలు, ప్రయాణ టిక్కెట్లు, సిబ్బంది ఖర్చులు వంటి సౌకర్యాలను స్వీకరించబోనని ఆయన స్పష్టం చేశారు.
ప్రజల సొమ్ము తీసుకోవడం తన సిద్ధాంతాలకు విరుద్ధమని, గత 35 ఏళ్లుగా ఎవరి నుంచీ రూపాయి గానీ, బహుమతి గానీ తీసుకోలేదని ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బు ప్రజలదేనని, అలాంటి ధనాన్ని స్వీకరించడం తాను చేసిన పాపంగా భావిస్తానని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ షరతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించినట్లు తెలిపారు.
ఇటీవల ఈ నియామకం గురించి మాట్లాడిన డాక్టర్ మంతెన, తొలుత ఈ పదవిని స్వీకరించడానికి సిద్ధంగా లేనని వెల్లడించారు. వ్యక్తిగత నియమాలకు విరుద్ధమని భావించి, కేవలం వెనకుండి ప్రభుత్వానికి అవసరమైన సలహాలు మాత్రమే ఇస్తానని ప్రతిపాదించినట్లు తెలిపారు.
అయినప్పటికీ ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ముఖ్యమంత్రి అభ్యర్థనను గౌరవిస్తూ సలహాదారుగా కొనసాగేందుకు అంగీకరించినట్లు చెప్పారు. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చకు దారి తీసింది.
గోదావరి జిల్లాల రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తీర్పు ఇస్తే రాష్ట్రంలో…
ఒక సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ అంటే సాధారణంగా క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. అందుకే పుష్ప 2, కెజిఎఫ్ 2,…
తెలంగాణలో జనసేన అధినేత పవన్కల్యాణ్.. ఈ నెల 2న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి…
దర్శకుడు సురేందర్ రెడ్డి పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. కారణం పవన్ కళ్యాణ్ అంగీకారం వస్తే సినిమా మొదలుపెట్టాలి. ఈ…
ఏపీలో ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆసక్తికరం. శుక్రవారం(జూన్…
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…