ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర యోగా, నేచురోపతి విభాగం ప్రభుత్వ సలహాదారుగా ప్రముఖ యోగా, ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును నియమించింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఈ నియామకం క్యాబినెట్ హోదాతో కూడిన పదవి కావడంతో జీతభత్యాలు, ప్రభుత్వ సదుపాయాలు లభించే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఈ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మంతెన, అయితే మొదటి నుంచే నిరాడంబర జీవన విధానాన్ని అనుసరిస్తూ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు.
క్యాబినెట్ హోదాతో వచ్చే ఎలాంటి జీతం, భత్యాలు, ప్రభుత్వ వాహనం, కార్యాలయ సదుపాయాలు, ప్రయాణ టిక్కెట్లు, సిబ్బంది ఖర్చులు వంటి సౌకర్యాలను స్వీకరించబోనని ఆయన స్పష్టం చేశారు.
ప్రజల సొమ్ము తీసుకోవడం తన సిద్ధాంతాలకు విరుద్ధమని, గత 35 ఏళ్లుగా ఎవరి నుంచీ రూపాయి గానీ, బహుమతి గానీ తీసుకోలేదని ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బు ప్రజలదేనని, అలాంటి ధనాన్ని స్వీకరించడం తాను చేసిన పాపంగా భావిస్తానని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ షరతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించినట్లు తెలిపారు.
ఇటీవల ఈ నియామకం గురించి మాట్లాడిన డాక్టర్ మంతెన, తొలుత ఈ పదవిని స్వీకరించడానికి సిద్ధంగా లేనని వెల్లడించారు. వ్యక్తిగత నియమాలకు విరుద్ధమని భావించి, కేవలం వెనకుండి ప్రభుత్వానికి అవసరమైన సలహాలు మాత్రమే ఇస్తానని ప్రతిపాదించినట్లు తెలిపారు.
అయినప్పటికీ ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ముఖ్యమంత్రి అభ్యర్థనను గౌరవిస్తూ సలహాదారుగా కొనసాగేందుకు అంగీకరించినట్లు చెప్పారు. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చకు దారి తీసింది.
This post was last modified on January 26, 2026 2:09 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…