ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర యోగా, నేచురోపతి విభాగం ప్రభుత్వ సలహాదారుగా ప్రముఖ యోగా, ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును నియమించింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఈ నియామకం క్యాబినెట్ హోదాతో కూడిన పదవి కావడంతో జీతభత్యాలు, ప్రభుత్వ సదుపాయాలు లభించే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఈ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మంతెన, అయితే మొదటి నుంచే నిరాడంబర జీవన విధానాన్ని అనుసరిస్తూ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు.
క్యాబినెట్ హోదాతో వచ్చే ఎలాంటి జీతం, భత్యాలు, ప్రభుత్వ వాహనం, కార్యాలయ సదుపాయాలు, ప్రయాణ టిక్కెట్లు, సిబ్బంది ఖర్చులు వంటి సౌకర్యాలను స్వీకరించబోనని ఆయన స్పష్టం చేశారు.
ప్రజల సొమ్ము తీసుకోవడం తన సిద్ధాంతాలకు విరుద్ధమని, గత 35 ఏళ్లుగా ఎవరి నుంచీ రూపాయి గానీ, బహుమతి గానీ తీసుకోలేదని ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బు ప్రజలదేనని, అలాంటి ధనాన్ని స్వీకరించడం తాను చేసిన పాపంగా భావిస్తానని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ షరతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించినట్లు తెలిపారు.
ఇటీవల ఈ నియామకం గురించి మాట్లాడిన డాక్టర్ మంతెన, తొలుత ఈ పదవిని స్వీకరించడానికి సిద్ధంగా లేనని వెల్లడించారు. వ్యక్తిగత నియమాలకు విరుద్ధమని భావించి, కేవలం వెనకుండి ప్రభుత్వానికి అవసరమైన సలహాలు మాత్రమే ఇస్తానని ప్రతిపాదించినట్లు తెలిపారు.
అయినప్పటికీ ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ముఖ్యమంత్రి అభ్యర్థనను గౌరవిస్తూ సలహాదారుగా కొనసాగేందుకు అంగీకరించినట్లు చెప్పారు. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చకు దారి తీసింది.
This post was last modified on January 26, 2026 2:09 pm
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…