Political News

రాజధానికి మువ్వన్నెల శోభ

అమరావతి రాజధాని పరిధిలోని కోర్ క్యాపిటల్ ఏరియాలో తొలిసారిగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పచ్చదనం, సుందర ప్రాంగణాలు, అత్యుత్తమ మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన ఈ ప్రాంతం వేడుకలకు మరింత శోభను ఇచ్చింది. ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించే ఈ వేడుకలు పాల్గొన్న వారందరికీ మరిచిపోలేని అనుభూతిని అందించింది.

ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు, రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు తదితరులు అతిథులుగా పాల్గొననున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిబింబించేలా వివిధ శాఖలకు చెందిన 22 శకటాలను ప్రదర్శించారు. వీటిలో వందేమాతరం – 150 వసంతాలు, జీరో పావర్టీ, నైపుణ్యం–ఉపాధి, నీటి భద్రత, వ్యవసాయ–సాంకేతికత, ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్, శక్తి–ఇంధన ఖర్చు తగ్గింపు, చేనేత–జౌళి, స్వచ్ఛ ఆంధ్ర, డీప్ టెక్ వంటి ఇతివృత్తాలతో శకటాలను రూపొందించారు.

2014లో రాజధానిగా ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు అక్కడ ఈ వేడుకలు నిర్వహించలేకపోయారు. పరిపాలనా మార్పులు, రాజధాని అభివృద్ధిలో జాప్యం, మౌలిక వసతుల లేమి ఇందుకు కారణాలయ్యాయి. ఈ ఏడాది ఇక్కడ గణతంత్ర వేడుకలు నిర్వహించడంతో రాజధాని రైతుల్లో ఆనందం నెలకొంది.

This post was last modified on January 26, 2026 11:45 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఈసారి డీఎస్సీలో వారిపైనే ప్రత్యేక దృష్టి?

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…

44 minutes ago

ఉస్తాద్ బిజినెస్ కెపాసిటీ ఎంత

ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…

3 hours ago

మదనపల్లి ఘటన మరువకముందే… మరో మృగాడు!

మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…

4 hours ago

హౌస్ ఫుల్, బ్లాక్ బస్టర్ అంతా ఉత్తిదేనా?

ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…

4 hours ago

ర్యాలీ పేరుతో అంబటి హడావిడి

రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…

4 hours ago

దురంధర్-2 వాయిదా పడితే..?

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…

4 hours ago