ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఆధ్మాత్మిక చింతన ఎక్కువన్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించిన పవన్ ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో కూడా సనాతన ధర్మ సంబంధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
ఈ క్రమంలోనే నాందేడ్ లో సచ్ ఖండ్ గురుద్వారాను పవన్ నేడు సందర్శించారు. ప్రముఖ సిక్కు గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ ఆత్మార్పణ దినోత్సవ వేడుకల్లో పవన్ పాల్గొన్నారు.
గురుద్వారాను సందర్శించిన పవన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంప్రదాయబద్ధంగా సిక్కుల తలపాగా చుట్టిన పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ లా కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పవన్ వెంట మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాజ్యసభ సభ్యుడు అశోక్ చవాన్ ఉన్నారు. అనంతరం, శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా సమాధి మందిరంలో కాసేపు గడిపారు. ఉత్తరాదిలో కూడా పవన్ ను చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు.
This post was last modified on January 25, 2026 10:42 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…