మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్, ఆయన సోదరుడిని ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 85 రోజులకు పైగా విజయవాడ జైలులో ఉన్న జోగి బ్రదర్స్ కు ఈ రోజు బెయిల్ మంజూరైంది. అనంతరం మీడియాతో మాట్లాడిన జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దమ్ముంటే బెజవాడ దుర్గమ్మ సాక్షిగా సత్య ప్రమాణం చేసేందుకు రావాలని చంద్రబాబు, లోకేశ్ లకు జోగి రమేశ్ మరోసారి సవాల్ విసిరారు. వారం రోజులు టైమ్ ఇస్తున్నానని డెడ్ లైన్ పెట్టారు.
దమ్ముంటే సీబీఐ ఎంక్వైరీ వేయాలని చెప్పానని, లై డిటెక్టర్ పరీక్షలు చేయమని చెప్పానని, తిరుమలలో ప్రమాణం చేస్తానని చెప్పానని అన్నారు. రాక్షసానందం పొందేందుకే తనను అరెస్ట్ చేయించారని, 3 నెలల పాటు మూడు జైళ్లలో తిప్పారని చెప్పారు.
అయినా తాను భయపడబోనని అన్నారు. తనకు సంబంధం లేని కేసులో అన్యాయంగా ఇరికించి అరెస్టు చేశారని, చంద్రబాబు కనుసన్నల్లో సిట్ అధికారులు విచారణ జరిపారని ఆరోపించారు.
రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని, ఇకపై పూర్తిగా ప్రజల్లోనే ఉంటానని అన్నారు. ప్రభుత్వ మోసాలను ఎండగడతానని, లోకేష్ రెడ్ బుక్ కు భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చే వరకూ, జగన్ ను మరోసారి సీఎం చేసేవరకు పోరాడతానని అన్నారు. ఇక్కడ ఆసుపత్రుల్లో మందులు లేక జనం ప్రాణాలు పోతుంటే..వారు దావోస్ వెళ్లి సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు.
This post was last modified on January 24, 2026 7:53 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత అత్యంత ఆసక్తి రేకెత్తించిన చిత్రాల్లో ‘విశ్వంభర’ ఒకటి. ‘బింబిసార’ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన…
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదం.. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారని.. జంతువుల కొవ్వు సహా ఇతర…
మలయాళ లెజెండరీ నటుడు మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం. 90వ దశకంలోనే ఆయన స్వాతికిరణం లాంటి కల్ట్…
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా బీఆర్ ఎస్ ముఖ్య నాయకుడు, మాజీ మంత్రి…
ఏపీలో జగన్ పరిపాలనా కాలంలో చేసిన అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని సీఎం చంద్రబాబు…
న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి అదరగొట్టింది. రాయ్పూర్లోని షహీద్…