మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్, ఆయన సోదరుడిని ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 85 రోజులకు పైగా విజయవాడ జైలులో ఉన్న జోగి బ్రదర్స్ కు ఈ రోజు బెయిల్ మంజూరైంది. అనంతరం మీడియాతో మాట్లాడిన జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దమ్ముంటే బెజవాడ దుర్గమ్మ సాక్షిగా సత్య ప్రమాణం చేసేందుకు రావాలని చంద్రబాబు, లోకేశ్ లకు జోగి రమేశ్ మరోసారి సవాల్ విసిరారు. వారం రోజులు టైమ్ ఇస్తున్నానని డెడ్ లైన్ పెట్టారు.
దమ్ముంటే సీబీఐ ఎంక్వైరీ వేయాలని చెప్పానని, లై డిటెక్టర్ పరీక్షలు చేయమని చెప్పానని, తిరుమలలో ప్రమాణం చేస్తానని చెప్పానని అన్నారు. రాక్షసానందం పొందేందుకే తనను అరెస్ట్ చేయించారని, 3 నెలల పాటు మూడు జైళ్లలో తిప్పారని చెప్పారు.
అయినా తాను భయపడబోనని అన్నారు. తనకు సంబంధం లేని కేసులో అన్యాయంగా ఇరికించి అరెస్టు చేశారని, చంద్రబాబు కనుసన్నల్లో సిట్ అధికారులు విచారణ జరిపారని ఆరోపించారు.
రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని, ఇకపై పూర్తిగా ప్రజల్లోనే ఉంటానని అన్నారు. ప్రభుత్వ మోసాలను ఎండగడతానని, లోకేష్ రెడ్ బుక్ కు భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చే వరకూ, జగన్ ను మరోసారి సీఎం చేసేవరకు పోరాడతానని అన్నారు. ఇక్కడ ఆసుపత్రుల్లో మందులు లేక జనం ప్రాణాలు పోతుంటే..వారు దావోస్ వెళ్లి సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు.
This post was last modified on January 24, 2026 7:53 am
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…