Political News

వాహ్.. వీర మహిళా కానిస్టేబుల్ తో హోం మంత్రి లంచ్

నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఉంటారు. విధి నిర్వహణలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా పనిచేసి ఇటు ప్రజల..అటు ప్రభుత్వ మన్ననలు పొందుతుంటారు. ఇక, మరికొందరైతే తాము విధి నిర్వహణలో లేకపోయినా పరిస్థితిని బట్టి విధులు నిర్వర్తించి ప్రత్యేకమైన ప్రశంసలతో పాటు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు.

మహిళా కానిస్టేబుల్ జయశాంతి ఆ కోవలోకే వస్తారు. అందుకే, ఆమెను ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత చీరసారెలతో ప్రత్యేకంగా సత్కరించారు. అంతేకాదు, ఆమెతో కలిసి భోజనం చేశారు.

సంక్రాంతి సమయంలో కాకినాడ కెనాల్ రోడ్డులో చంటిబిడ్డను ఎత్తుకొని మరీ ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన జయశాంతి డ్యూటీలో లేకపోయినా చంటిబిడ్డను ఎత్తుకొని మరీ ట్రాఫిక్ క్లియర్ చేశారు.

ఐదారు కిలోమీటర్ల మేర జామ్ అయిన ట్రాఫిక్ ను క్లియర్ చేసే క్రమంలో అంబులెన్స్ కు దారి ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న హోం మినిస్టర్ అనిత… జయశాంతిని ఫోన్ లో అభినందించారు.

ఆ సమయంలో అనితను కలవాలని ఉందంటూ మనసులో మాట చెప్పారు జయశాంతి. దీంతో, ఈ రోజు విజయవాడ క్యాంప్ కార్యాలయంలో జయశాంతిని అనిత సత్కరించారు. జయశాంతితో కలిసి భోజనం కూడా చేశారు.

అంతేకాదు, జయశాంతికి బొట్టు పెట్టి చీరసారెలతో సాగనంపారు. ఆమె భర్తకు కూడా నూతన వస్త్రాలను బహూకరించారు. ఈ విషయాన్ని స్వయంగా అనిత తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మన రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి పోలీసు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అనిత చెప్పారు.

This post was last modified on January 22, 2026 4:23 pm

Share
Show comments
Published by
Kumar
Tags: anitha

Recent Posts

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

24 minutes ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

55 minutes ago

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

2 hours ago

ఈసారి డీఎస్సీలో వారిపైనే ప్రత్యేక దృష్టి?

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…

2 hours ago

ఉస్తాద్ బిజినెస్ కెపాసిటీ ఎంత

ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…

5 hours ago

మదనపల్లి ఘటన మరువకముందే… మరో మృగాడు!

మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…

5 hours ago