Political News

ఫాంహౌస్ లో తండ్రికొడుకులు.. ఏకాంత చర్చలు?

దేశంలో మరే ముఖ్యమంత్రికి లేని ప్రత్యేకత తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సొంతం. సెక్రటేరియట్ కు వెళ్లకుండా.. పాలనా రథాన్ని అయితే పామ్ హౌస్ లేదంటే ప్రగతిభవన్ ద్వారా నడిపిస్తున్న వైనంపై తరచూ చర్చకు వస్తూ ఉంటుంది. అయినప్పటికీ.. ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోరు గులాబీ బాస్.

ఎవరైనా ధైర్యం చేసి అడిగితే.. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే సెక్రటేరియట్. ఆ మాత్రం తెలీదా? అంటూ ఆయన చేసే వ్యంగ్య వ్యాఖ్య ప్రశ్న అడిగిన పాత్రికేయుడికి చురుకు తగలటమే కాదు.. తోటి మిత్రులంతా పెద్ద పెట్టున నవ్వే పరిస్థితి. అందుకే.. ఆయన్ను ప్రశ్నించే కన్నా.. మౌనంగా ఉండటమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంటుంది.

ఇదిలా ఉంటే.. కేసీఆర్ లో మరో ప్రత్యేకత.. ఆయన ఎప్పుడు ప్రగతిభవన్ లో ఉంటారో.. మరెప్పుడు ఫాంహౌస్ లో ఉంటారన్నది చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే సమాచారం అందుతుంటుంది. అయితే.. రోటీన్ కు భిన్నమైన సీన్ ఒకటి తాజాగా చోటు చేసుకుంది. మూడు రోజుల ఢిల్లీ పర్యటనను పూర్తి చేసుకొని ఢిల్లీకి వచ్చిన కేసీఆర్.. ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్ లో రివ్యూ సమావేశాన్ని నిర్వహించటం తెలిసిందే. అనంతరం ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లారు.

ఎప్పుడూ జరిగే రోటీన్ సీనే కదా అనేయటానికి లేదు. ఎందుకంటే.. ఈసారి కాస్త భిన్నమైన పరిస్థితి. ఫామ్ హౌస్ కు కేసీఆర్ వెళ్లిన తర్వాత.. మంత్రి కేటీఆర్ కూడా బయలుదేరి వెళ్లారు. అక్కడ తండ్రి కమ్ సీఎం అయిన కేసీఆర్ తో ఏకాంత భేటీ అయినట్లుగా సమాచారం. తండ్రికొడుకుల మధ్య సుదీర్ఘ సమావేశం సాగినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తన ఢిల్లీ పర్యటన వివరాల్ని కేటీఆర్ కు చెప్పటంతో పాటు.. పార్టీలో అనుసరించాల్సిన విధానాలపైనా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా తండ్రీ కొడుకు ఏకాంత భేటీ టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసినట్లుగా చెప్పక తప్పదు.

Satya

Recent Posts

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

2 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

2 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

5 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

7 hours ago