తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ నాయకుల మాటల దాడి ఆగడం లేదు. రెండు రోజుల కిందట బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. కేటీఆర్.. సీఎం రేవంత్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తుగ్లక్ సీఎం అంటూ వ్యాఖ్యానించారు. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియడం లేదన్నారు. ఇక, తాజాగా అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్రావు కూడా సీఎంపై విరుచుకుపడ్డారు.
`ఔట్ సోర్సింగ్ సీఎం` అంటూ కామెంట్లు చేశారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న మీడియా వార్పై స్పందించిన హరీష్రావు.. అసలు సిసలు కాంగ్రెస్ వాదులకు.. ఔట్ సోర్సింగ్ ముఖ్యమంత్రికి మధ్య తెరవెనుక పంచాయతీ నడుస్తోందని చెప్పారు. ఇందులో భాగంగానే నైనీ బొగ్గుగనుల వ్యవహారం తెరమీదికి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలు తమ కష్టాలు తీర్చమని ఓట్లు వేసి గెలిపిస్తే.. వీరు వాటాల కోసం తన్నుకుంటున్నారని హరీష్రావు అన్నారు.
నైనీ బొగ్గుగనుల వ్యవహారంలో ఏదో జరుగుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అసలు నైనీ బొగ్గుగనుల పై సీబీఐతో విచారణ జరిపించాలని హరీష్రావు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పుడు వాటాలు పంచుకునేందుకు కొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై నిజానిజాలు తేలాలంటే.. సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఔట్ సోర్సింగ్ సీఎంకు.. అసలు సిసలు కాంగ్రెస్ వాదులకు కోల్డ్ వార్ జరుగుతోందని వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే.. నైనీ బొగ్గుగనుల కేటాయింపును నిలిపివేయాలని కేంద్రానికి లేఖ రాసినట్టు.. మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దీనిలో ఎలాంటి వివాదం లేదన్నారు. అయితే.. ఉద్దేశ పూర్వకంగానే తమ మంత్రుల మధ్య వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై సీఎం రేవంత్ కూడా స్పందించారు. తమ మధ్య ఎలాంటివివాదాలు లేవన్నారు. మీడియా సంస్థల మధ్య ఏదైనా పంచాయతీ ఉంటే.. తలుపులు వేసుకుని తన్నుకోవాలని ఎద్దేవా చేశారు.
This post was last modified on January 20, 2026 9:05 am
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…