సొంత పార్టీ పెట్టుకుంటానని ప్రకటించిన బీఆర్ ఎస్ మాజీ నాయకురాలు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత.. తన పార్టీకి సంబంధించిన పనిని ప్రారంభించేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇదేసమయంలో పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లాలి.. ఎలాంటి అడుగులు వేయాలి… ప్రజల నాడి ఎలా ఉంది? అనే అంశాలపై రాజకీయ మాజీ వ్యూహకర్త.. ప్రశాంత్ కిషోర్ నుంచి ఆమె సలహాలు తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు వీరి మధ్యచర్చలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రజల సెంటిమెంటును తన రాజకీయపార్టీకి ప్రధాన పునాదులుగా భావిస్తున్న కవిత.. వాటినే ఇప్పుడు ఆలంబనగా చేసుకుని వ్యూహాత్మక అడుగులు వేసే ప్రయత్నంలో ఉన్నారు. ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయిలో పుంజుకునేలా చేయాలన్నది ఆమె ప్రధాన సంకల్పంగా ఉంది. కానీ, ప్రస్తుతం ఆమె వ్యక్తిగతంగా ఇమేజ్ కంటే కూడా.. కేసీఆర్కుమార్తెగానే గుర్తింపు తెచ్చుకున్నారు.
గ్రామాల్లో అయినా.. నగరాల్లో అయినా.. కవితకు ఉన్న ఏకైక గుర్తింపు కేసీఆర్. ఆయన కుమార్తె గానే తెలంగాణ సమాజం ఆమెను ఆదరిస్తోంది. అయితే.. రేపు పార్టీ పెట్టుకున్నాక కూడా ఇదే గుర్తింపు కొనసాగించాలని ఆమెకోరుకోవడం లేదు. ఇప్పటికే జెండా సహా .. పేరులోనూ కేసీఆర్ను తీసేశారు. తెలంగాణ జాగృతి సంస్థనే పార్టీగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే పీకేతో ఆమె సంప్రదింపులు చేస్తున్నారు. అయితే.. పీకే ఎలాంటి సలహాలు ఇస్తారు.. అనేది చూడాలి.
విఫల నేత!
ఇక, ప్రశాంతి కిషోర్.. వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయన విఫలనాయకుడిగా పేరొందారు. బీహార్లో ఆయన పార్టీ పెట్టి.. పాదయాత్ర చేశారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కనీసంలో కనీసం 50 స్థానాల్లో విజయం దక్కించుకుంటానని చెప్పారు. కానీ, సాధించలేక పోయారు. పైగా.. ఎవరూ డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయారు. ఇలాంటి నేపథ్యంలో విఫల నేతతో కవిత ప్రయాణం అనే చర్చ కూడా సాగుతోంది. ఇది ఏమేరకు ఆమెకు ప్లస్ అవుతుంది? మైనస్ అవుతుంది? అనేది కూడా చూడాలి.
This post was last modified on January 19, 2026 3:02 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…