సొంత పార్టీ పెట్టుకుంటానని ప్రకటించిన బీఆర్ ఎస్ మాజీ నాయకురాలు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత.. తన పార్టీకి సంబంధించిన పనిని ప్రారంభించేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇదేసమయంలో పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లాలి.. ఎలాంటి అడుగులు వేయాలి… ప్రజల నాడి ఎలా ఉంది? అనే అంశాలపై రాజకీయ మాజీ వ్యూహకర్త.. ప్రశాంత్ కిషోర్ నుంచి ఆమె సలహాలు తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు వీరి మధ్యచర్చలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రజల సెంటిమెంటును తన రాజకీయపార్టీకి ప్రధాన పునాదులుగా భావిస్తున్న కవిత.. వాటినే ఇప్పుడు ఆలంబనగా చేసుకుని వ్యూహాత్మక అడుగులు వేసే ప్రయత్నంలో ఉన్నారు. ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయిలో పుంజుకునేలా చేయాలన్నది ఆమె ప్రధాన సంకల్పంగా ఉంది. కానీ, ప్రస్తుతం ఆమె వ్యక్తిగతంగా ఇమేజ్ కంటే కూడా.. కేసీఆర్కుమార్తెగానే గుర్తింపు తెచ్చుకున్నారు.
గ్రామాల్లో అయినా.. నగరాల్లో అయినా.. కవితకు ఉన్న ఏకైక గుర్తింపు కేసీఆర్. ఆయన కుమార్తె గానే తెలంగాణ సమాజం ఆమెను ఆదరిస్తోంది. అయితే.. రేపు పార్టీ పెట్టుకున్నాక కూడా ఇదే గుర్తింపు కొనసాగించాలని ఆమెకోరుకోవడం లేదు. ఇప్పటికే జెండా సహా .. పేరులోనూ కేసీఆర్ను తీసేశారు. తెలంగాణ జాగృతి సంస్థనే పార్టీగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే పీకేతో ఆమె సంప్రదింపులు చేస్తున్నారు. అయితే.. పీకే ఎలాంటి సలహాలు ఇస్తారు.. అనేది చూడాలి.
విఫల నేత!
ఇక, ప్రశాంతి కిషోర్.. వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయన విఫలనాయకుడిగా పేరొందారు. బీహార్లో ఆయన పార్టీ పెట్టి.. పాదయాత్ర చేశారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కనీసంలో కనీసం 50 స్థానాల్లో విజయం దక్కించుకుంటానని చెప్పారు. కానీ, సాధించలేక పోయారు. పైగా.. ఎవరూ డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయారు. ఇలాంటి నేపథ్యంలో విఫల నేతతో కవిత ప్రయాణం అనే చర్చ కూడా సాగుతోంది. ఇది ఏమేరకు ఆమెకు ప్లస్ అవుతుంది? మైనస్ అవుతుంది? అనేది కూడా చూడాలి.
This post was last modified on January 19, 2026 3:02 pm
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…