సొంత పార్టీ పెట్టుకుంటానని ప్రకటించిన బీఆర్ ఎస్ మాజీ నాయకురాలు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత.. తన పార్టీకి సంబంధించిన పనిని ప్రారంభించేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇదేసమయంలో పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లాలి.. ఎలాంటి అడుగులు వేయాలి… ప్రజల నాడి ఎలా ఉంది? అనే అంశాలపై రాజకీయ మాజీ వ్యూహకర్త.. ప్రశాంత్ కిషోర్ నుంచి ఆమె సలహాలు తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు వీరి మధ్యచర్చలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రజల సెంటిమెంటును తన రాజకీయపార్టీకి ప్రధాన పునాదులుగా భావిస్తున్న కవిత.. వాటినే ఇప్పుడు ఆలంబనగా చేసుకుని వ్యూహాత్మక అడుగులు వేసే ప్రయత్నంలో ఉన్నారు. ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయిలో పుంజుకునేలా చేయాలన్నది ఆమె ప్రధాన సంకల్పంగా ఉంది. కానీ, ప్రస్తుతం ఆమె వ్యక్తిగతంగా ఇమేజ్ కంటే కూడా.. కేసీఆర్కుమార్తెగానే గుర్తింపు తెచ్చుకున్నారు.
గ్రామాల్లో అయినా.. నగరాల్లో అయినా.. కవితకు ఉన్న ఏకైక గుర్తింపు కేసీఆర్. ఆయన కుమార్తె గానే తెలంగాణ సమాజం ఆమెను ఆదరిస్తోంది. అయితే.. రేపు పార్టీ పెట్టుకున్నాక కూడా ఇదే గుర్తింపు కొనసాగించాలని ఆమెకోరుకోవడం లేదు. ఇప్పటికే జెండా సహా .. పేరులోనూ కేసీఆర్ను తీసేశారు. తెలంగాణ జాగృతి సంస్థనే పార్టీగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే పీకేతో ఆమె సంప్రదింపులు చేస్తున్నారు. అయితే.. పీకే ఎలాంటి సలహాలు ఇస్తారు.. అనేది చూడాలి.
విఫల నేత!
ఇక, ప్రశాంతి కిషోర్.. వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయన విఫలనాయకుడిగా పేరొందారు. బీహార్లో ఆయన పార్టీ పెట్టి.. పాదయాత్ర చేశారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కనీసంలో కనీసం 50 స్థానాల్లో విజయం దక్కించుకుంటానని చెప్పారు. కానీ, సాధించలేక పోయారు. పైగా.. ఎవరూ డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయారు. ఇలాంటి నేపథ్యంలో విఫల నేతతో కవిత ప్రయాణం అనే చర్చ కూడా సాగుతోంది. ఇది ఏమేరకు ఆమెకు ప్లస్ అవుతుంది? మైనస్ అవుతుంది? అనేది కూడా చూడాలి.
This post was last modified on January 19, 2026 3:02 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…