కృష్ణా జలాల పంపకం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య వాడీవేడీ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకేమాట మీద ఉన్నారు. జలజగడాలు వద్దని…చర్చలతో సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పారు.
మరోపక్క చంద్రబాబుకు రేవంత్ రెడ్డి కొలువునిచ్చారు. అంతేకాదు, అందుకు సంబంధించిన నియామక పత్రాన్ని కూడా స్వయంగా చంద్రబాబుకు రేవంత్ అందజేశారు. అయితే, ఆ చంద్రబాబు… ఏపీ సీఎం చంద్రబాబు కాదు. ఇటీవల గ్రూప్-3 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఉద్యోగంలో చేరబోతున్న చంద్రబాబు.
గ్రూప్-3లో అర్హత సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు. శిల్పకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అనే అభ్యర్థి పేరును వ్యాఖ్యాత పిలవగానే శిల్పకళావేదికలో నవ్వులు పూచాయి.
రేవంత్ తో పాటు వేదిక మీద ఉన్నా నాయకులంతా చిరునవ్వులు చిందించారు. చంద్రబాబు పేరు పెట్టుకున్న ఓ అభ్యర్థికి నియామక పత్రాన్ని చిరునవ్వుతో రేవంత్ అందించారు. ఆ అభ్యర్థి వెన్ను తట్టి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దానిపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. చంద్రబాబుకు రేవంత్ కొలువు ఇచ్చారని సరదాగా కొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా, రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని రేవంత్ అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, గ్రూప్ 1,2,3 వంటి ఉద్యోగాలను ఒక బాధ్యతతో ఎలాంటి తప్పులు లేకుండా భర్తి చేశామని వెల్లడించారు.
ప్రశ్న పత్రాలను గత ప్రభుత్వం పల్లీ బఠానీల్లా అమ్మిందని, అయినా సరే బీఆర్ఎస్ నేతలకు చీమకుట్టినట్లైనా లేదని ఎద్దేవా చేశారు. యూపీఎస్సీ ని పరిశీలించి టీజీపీఎస్సీ ని ప్రక్షాళన చేశామన్నారు. గ్రూప్-3 నియామక పత్త్రాలు ఇవ్వొద్దని ఎన్నో కుట్రలు చేశారని అన్నారు. అయినా సరే అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని అన్నారు. కోర్టులలో కొట్లాడి ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.
This post was last modified on January 17, 2026 4:13 pm
రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షల నిర్వాహణపై ప్రతిపక్ష వైసీపీ రాద్దాంతం చేస్తున్న విషయం తెలిసిందే. ఆధారాలు లేకుండా…
దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతున్న జననాల రేటు నేపథ్యంలో కుటుంబాల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ…
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదటిసారి కలిసి చేస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’. దీని మీద మంచి…
తమిళ సినిమాలో అగ్ర నటుడిగా వెలుగొందిన నటుడు విజయ్ అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. స్వర్గ సుఖాల జీవితం నుంచి…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఉంటున్నాడు తెలుగువాడైన విశాల్. ‘సెండై కోళి’తో తమిళనాట స్టార్ ఇమేజ్…
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ ఏడాదిలో 10 వేలకుపైగా సర్కారీ…