ఇది కేరళ కాదు… ఆంధ్రప్రదేశ్లోని ఆత్రేయపురం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆత్రేయపురంలో పండుగ వాతావరణం నెలకొంది అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. డ్రాగన్ పడవల పోటీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆత్రేయపురం ఉత్సవ ప్రాంగణం ఉత్సాహంతో నిండిపోయింది. పండుగ సంబరాలు స్థానికులకే కాకుండా సందర్శకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
కేరళను తలపించే డ్రాగన్ పడవల పోటీలు ఆత్రేయపురం వేదికగా ఘనంగా నిర్వహించడంతో గ్రామానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన ఈ పడవ పోటీలు ఆత్రేయపురం పేరును రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయిలో చాటాయి. గోదావరి నదిపై ఉచ్చిలి నుంచి తాడిపూడి వంతెన వరకు 1000 మీటర్ల దూరంలో జరిగిన ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి.
మొత్తం 22 జట్లు పోటీపడగా కేరళ (అలెప్పీ), బండారు, కోనసీమ, పల్నాడు–1, కర్నూలు, ఎర్ర కాలువ జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధించాయి. కేరళ తరహా పడవ పోటీలు స్థానికంగా నిర్వహించడంపై నిర్వాహకులతోపాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోటీలు ఆత్రేయపురం ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని వారు పేర్కొన్నారు. లొల్ల లాకుల వద్ద ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్, ఎగ్జిబిషన్లు, ముగ్గుల పోటీలు ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతున్నాయి.
This post was last modified on January 15, 2026 11:16 am
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…