ఇది కేరళ కాదు… ఆంధ్రప్రదేశ్లోని ఆత్రేయపురం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆత్రేయపురంలో పండుగ వాతావరణం నెలకొంది అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. డ్రాగన్ పడవల పోటీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆత్రేయపురం ఉత్సవ ప్రాంగణం ఉత్సాహంతో నిండిపోయింది. పండుగ సంబరాలు స్థానికులకే కాకుండా సందర్శకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
కేరళను తలపించే డ్రాగన్ పడవల పోటీలు ఆత్రేయపురం వేదికగా ఘనంగా నిర్వహించడంతో గ్రామానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన ఈ పడవ పోటీలు ఆత్రేయపురం పేరును రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయిలో చాటాయి. గోదావరి నదిపై ఉచ్చిలి నుంచి తాడిపూడి వంతెన వరకు 1000 మీటర్ల దూరంలో జరిగిన ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి.
మొత్తం 22 జట్లు పోటీపడగా కేరళ (అలెప్పీ), బండారు, కోనసీమ, పల్నాడు–1, కర్నూలు, ఎర్ర కాలువ జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధించాయి. కేరళ తరహా పడవ పోటీలు స్థానికంగా నిర్వహించడంపై నిర్వాహకులతోపాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోటీలు ఆత్రేయపురం ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని వారు పేర్కొన్నారు. లొల్ల లాకుల వద్ద ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్, ఎగ్జిబిషన్లు, ముగ్గుల పోటీలు ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతున్నాయి.
This post was last modified on January 15, 2026 11:16 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…