రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే, చాలా సందర్భాల్లో ఒక ప్రభుత్వంలో సగం పూర్తయి పెండింగ్ లో ఉన్న పనులు మరో ప్రభుత్వంలో పూర్తవుతుంటాయి. అటువంటి సందర్భాల్లో ఫలానా పనికి క్రెడిట్ మాదంటే మాదే అని రాజకీయ పార్టీలు క్రెడిట్ కోసం పోటీ పడుతుంటాయి.
తెలంగాణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిల మధ్య ఇదే తరహా క్రెడిట్ వార్ హాట్ టాపిక్ గా మారింది. మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ అండర్ బ్రిడ్జి పనులకు నిధులు తాము తెచ్చామంటే తాము తెచ్చామంటూ ఇరువర్గాల నేతలు బాహాబాహీకి దిగారు.
ఈ క్రమంలోనే ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిల మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపైకి ఒకరు దూసుకు వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితి అదుపుతప్పుతుండడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించివేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…
మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…