రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే, చాలా సందర్భాల్లో ఒక ప్రభుత్వంలో సగం పూర్తయి పెండింగ్ లో ఉన్న పనులు మరో ప్రభుత్వంలో పూర్తవుతుంటాయి. అటువంటి సందర్భాల్లో ఫలానా పనికి క్రెడిట్ మాదంటే మాదే అని రాజకీయ పార్టీలు క్రెడిట్ కోసం పోటీ పడుతుంటాయి.
తెలంగాణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిల మధ్య ఇదే తరహా క్రెడిట్ వార్ హాట్ టాపిక్ గా మారింది. మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ అండర్ బ్రిడ్జి పనులకు నిధులు తాము తెచ్చామంటే తాము తెచ్చామంటూ ఇరువర్గాల నేతలు బాహాబాహీకి దిగారు.
ఈ క్రమంలోనే ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిల మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపైకి ఒకరు దూసుకు వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితి అదుపుతప్పుతుండడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించివేశారు.
This post was last modified on January 13, 2026 4:31 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం.…
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…