ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. తాను ఇప్పటి వరకు ఒక్క సెలవు కూడా పెట్టలేదన్నారు. ఒకవేళ ఏదైనా రోజు సెలవు తీసుకోవాలని అనుకున్నా.. ఏదో ఒక పని వస్తోందని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ క్రమంలో కేవలం మంత్రులు, ఉన్నతాధికారులు మాత్రమే లక్ష్యాన్ని చేరుకోలేరని చెప్పారు.
10 లక్షల మందికిపైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ లక్ష్య సాధనలో ముందుకు రావాలని ఆయన సూచించారు. తాజాగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 డైరీ ఆవిష్కరణలో కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగులకు అన్ని విధాలా సహకరిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. అందుకే.. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా విడతల వారీగా ఉద్యోగులకు ఇస్తున్నామని చెప్పారు.
నేను నచ్చకపోయినా..
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల్లో కొందరికి తానంటే నచ్చకపోవచ్చని అన్నారు. అయినప్పటికీ.. మీరు రాష్ట్రం కోసం.. ప్రజల కోసం పని చేస్తున్నారని గుర్తించాలని సూచించారు. గతంలో నెలలో జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని.. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయి.. నెల నెలా 1నే వేతనం వచ్చేలా చేశామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కోటి రూపాయల బీమా కల్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్రంలో పన్నులు, సిస్తుల వసూళ్లపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. అప్పుడు ఆర్థికంగా రాష్ట్రం పుంజుకుంటుందన్నారు.
ఉద్యోగులకు బొనాంజా..
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ.. సంక్రాంతి బొనాంజా ప్రకటించింది. కరువు భత్యం(డీఏ)ను 30.03 శాతం నుంచి 33.67 శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 జూలై 1 నుంచి పెంచిన డీఏ అమలు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో డీఏ 3.64 శాతం చొప్పున పెరిగినట్టు అయింది. 40 వేల రూపాయల మూల వేతనం తీసుకునే వారికి.. సుమారు 1400 రూపాయల వేతనం పెరగనుంది.
This post was last modified on January 12, 2026 9:19 pm
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…