ప్రపంచాన్ని కనుసైగతో కమాండ్ చేసే అగ్రరాజ్యం అమెరికాను దారుణంగా దెబ్బ తీసింది కంటికి కనిపించని కరోనా వైరస్. సంపన్నదేశంలా చెప్పుకునే ఆ దేశానికి దిమ్మ తిరిగే షాకివ్వటమే కాదు.. సరైన దెబ్బ తగిలితే అగ్రరాజ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న విషయం కోవిడ్ 19 ఎపిసోడ్ తో ప్రపంచానికి అర్థమైపోయింది. యావత్ దేశాన్ని లాక్ డౌన్ చేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరించిన తీరుకు అమెరికా భారీ మూల్యాన్ని చెల్లించిందని చెప్పక తప్పదు.
మిగిలిన దేశాలతో పోలిస్తే.. అమెరికా అర్థిక వ్యవస్థ మాత్రమే కాదు.. అక్కడి ప్రజల జీవనవిధానం భిన్నంగా ఉంటుంది. మరింత అర్థమయ్యేలా చెప్పాలంటే వ్యక్తిగత ఆర్థిక క్రమశిక్షణ విషయంలో అమెరికన్లు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. మనకు మాదిరి ఆస్తులు పోగు వేసుకోవటానికి పెద్దగా ఇష్టపడరు.
సంపాదించిన మొత్తాన్ని ఖర్చు చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి అలవాటున్న వేళ.. ఊహించని రీతిలో కరోనా లాంటి వైరస్ విరుచుకుపడితే పరిస్థితి ఎలా మారుతుందో అమెరికన్లకు ఇప్పుడు భాగా అర్థమవుతోంది.
అధికారిక లెక్కల ప్రకారం అమెరికాలో మూడు కోట్ల మంది నిరుద్యోగ ప్రయోజనం కోసం దరఖాస్తు చేసుకోవటం చూస్తే.. కరోనాకారణంగా పోయిన ఉద్యోగాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థమవుతుంది. కరోనాకారణంగా పలు కంపెనీలు శాశ్వితంగా మూతపడగా.. మరికొన్ని కంపెనీల్లో ఉద్యోగులపై పెద్ద ఎత్తున వేటు వేశాయి. దీంతో.. పలువురు అమెరికన్ల జీవితాలు రోడ్డున పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారం కరోనా కారణంగా కోట్లాది మంది ఉద్యోగాలు పోయాయి.
పదకొండు లక్షల మందికి కరోనా సోకగా.. 66వేల మంది కరోనా కారణంగా మరణించారు. ఇదిలా ఉంటే.. తాజాగా తమ ఇంటి అద్దెల్ని చెల్లించలేమంటూ న్యూయార్కు వాసులు పలువురు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేయటం గమనార్హం. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో.. విలాసవంతమైన మహానగరంగా పేర్కొనే న్యూయార్కు సిటీలో ఉండటం అంటే మాటలు కాదు. అలాంటి సంపన్నులు సైతం ఇప్పుడు హాహాకారాలు చేస్తున్నారు.
ఏ నెలకు ఆ నెల వచ్చే మొత్తాన్ని పూర్తిగా వాడేయటం.. భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా లెక్కలోకి తీసుకొని ఖర్చు చేసే అలవాటున్న అమెరికన్లకు.. కరోనాలాంటి ఉత్పాతాలు భారీగా దెబ్బ తీస్తాయి. ఈ విషయంలో భారతీయుల పరిస్థితి చాలా బెటర్ అని చెప్పక తప్పదు. మే ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే కార్మిక దినోత్సవం కరోనా దెబ్బకు అందరూ కామ్ గా ఉండిపోయారు.
ఇందుకు భిన్నంగా అమెరికన్లు మాత్రం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేపట్టారు. నో మనీ.. నో రెంట్ అంటూ వారు తమ అద్దెల్ని ప్రభుత్వం రద్దు చేయాలని కోరుతున్నారు. నిరసనకారులు చేస్తున్న నిరసలనకు ప్రతిపక్ష డెమొక్రాట్లు సైతం మద్దతు పలుకుతున్నారు. ఉద్యోగుల హక్కుల్ని ప్రభుత్వం కాపాడాలని.. తమను ఆర్థికంగా ఆదుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండటం చూస్తే.. కరోనా ఎంత భారీగా దెబ్బ తీసిందో ఇట్టే అర్థం కాక మానదు.
This post was last modified on May 3, 2020 12:19 pm
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…