అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ, నదీ తీర ప్రాంతంలో నగర నిర్మాణం సాధ్యం కాదన్న వ్యాఖ్యలు ప్రజల్లో, ముఖ్యంగా రాజధాని రైతుల్లో ఆగ్రహాన్ని కలిగించాయి. అమరావతి కేవలం భౌగోళిక అంశం కాదని, ప్రజల త్యాగాలు, ఆకాంక్షలతో ముడిపడిన అంశమనే భావనను జగన్ వ్యాఖ్యలు విస్మరించాయన్న విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ వ్యతిరేకత నేపథ్యంలో వైసీపీ నష్ట నివారణ చర్యలకు దిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్ని నాని వంటి నేతలు రంగంలోకి దిగి, జగన్ అమరావతిని ఎప్పుడూ వ్యతిరేకించలేదని వివరణలు ఇచ్చే ప్రయత్నం చేశారు.
జగన్ అమరావతిలో ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారని, పాలనా వికేంద్రీకరణ పేరుతో రాజధానిని తక్కువ చేయలేదని వారు స్పష్టం చేశారు. అయితే ఈ వివరణలు ప్రజల అసంతృప్తిని పూర్తిగా చల్లార్చలేకపోతున్నాయి.
2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ అమరావతి విషయంలో తీసుకున్న నిర్ణయాలు రాజధాని రైతుల్లో ఆగ్రహాన్ని రేపాయి. రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వచ్చినప్పటికీ అప్పట్లో వైసీపీ తన వైఖరిని మార్చలేదు.
2024 ఎన్నికల తర్వాత అమరావతే రాజధాని అన్న మాటలు వైసీపీ నేతల నుంచి వినిపించాయి. అయితే తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. దీంతో వైసిపి.. జగన్ అలా చెప్పలేదంటూ ఎవరు నేర్చుకునే ప్రయత్నం చేస్తుంది.
This post was last modified on January 10, 2026 11:12 pm
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…