రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాదాపు ఒకే మాట చెప్పుకొని రావడం.. కలసి కూర్చుని చర్చించుకుంటే.. సమస్యలు పరిష్కరించుకోవచ్చన్న దిశగా ఆలోచన చేయడం.. ప్రస్తుతం నెలకొన్న సమస్యల పరిష్కారానికి శుభసంకల్పమేనని అంటున్నారు పరిశీలకులు. ఇరు రాష్ట్రాల మధ్య గత ఆరు మాసాలుగా నీళ్లు నిప్పులుగా మారాయి.
పోలవరం-బనకచర్ల నుంచి నాగార్జున సాగర్వరకు.. అనేక ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ, ఏపీల మధ్య వివాదం కొనసాగుతోంది. గోదావరి నీటిలో మిగులు జలాలను వాడుకుంటే తప్పేంటని ఏపీ, అలా ఎలా వాడతారని తెలంగాణ.. ఇక, నాగార్జున సాగర్లో ఏకమొత్తంగా తెలంగాణ అధిక నీటిని వినియోగించుకుంటోందని ఏపీ ఇలా.. ఏపీ తెలంగాణల మధ్య వివాదాలు మొదలై.. ఇప్పుడు రాజకీయంగా కూడా విమర్శలకు అవకాశం ఇచ్చింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఒకే రోజు.. వేర్వేరు వేదికలపై నుంచి సమస్యలను పరిష్కరించుకునేందుకు చర్చలే మార్గమని ప్రకటించారు. ఇదేసమయంలో ఘర్షణలతో పోయేది తప్ప.. వచ్చేది కూడా లేదని ప్రకటించారు. మరీ ముఖ్యంగా ఈ ప్రతిపాదన విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఒకే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. దీనిని రాజకీయ రగడగా మార్చితే.. ప్రభుత్వాలకు నష్టమని గుర్తించారు. ఈ క్రమంలోనే కూర్చుని చర్చించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.
గతంలోనూ..
అయితే.. ఇలా సీఎంలు చర్చించుకోవడం.. ఇప్పుడే కాదు.. గతంలో కేసీఆర్, జగన్ కూడా రెండు సందర్భాల్లో జల వివాదాలపై చర్చించుకున్నారు. కానీ, ఎక్కడా ఫలితం రాలేదు. ఆశించిన మేరకు కూడా చర్చలు జరగలేదు. కానీ.. దీనికి భిన్నంగా ఇప్పుడు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తే. తప్ప.. ఫలితం వచ్చేలా కనిపించడం లేదన్న చర్చ సాగుతోంది. మరి ఆదిశగా అడుగులు వేస్తారా? లేదా? అనేది చూడాలి.
పట్టు విడుపులు!
+ ప్రధానంగా పట్టువిడుపుల ధోరణి ఉంటే తప్ప.. చర్చలు సఫలం కావు.
+ కానీ.. ఈ దిశగా రాష్ట్రాలు అడుగులు వేస్తాయా? అనేది ప్రశ్న.
+ ఎవరికి వారికి తమ తమ రాష్ట్రాలు ముఖ్యం. ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.
+ దీనికి తోడు.. రాజకీయ కారణాలు కూడా కనిపిస్తున్నాయి.
+ చర్చల్లో ఏ చిన్న తేడా వచ్చినా.. రాజకీయంగా వాడుకునేందుకు ప్రతిపక్షాలు ఉన్నాయి.
+ ఈ నేపథ్యంలో చర్చలకు కూర్చున్నా.. పట్టువిడుపుల ధోరణి ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
This post was last modified on January 10, 2026 4:12 pm
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…