రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాదాపు ఒకే మాట చెప్పుకొని రావడం.. కలసి కూర్చుని చర్చించుకుంటే.. సమస్యలు పరిష్కరించుకోవచ్చన్న దిశగా ఆలోచన చేయడం.. ప్రస్తుతం నెలకొన్న సమస్యల పరిష్కారానికి శుభసంకల్పమేనని అంటున్నారు పరిశీలకులు. ఇరు రాష్ట్రాల మధ్య గత ఆరు మాసాలుగా నీళ్లు నిప్పులుగా మారాయి.
పోలవరం-బనకచర్ల నుంచి నాగార్జున సాగర్వరకు.. అనేక ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ, ఏపీల మధ్య వివాదం కొనసాగుతోంది. గోదావరి నీటిలో మిగులు జలాలను వాడుకుంటే తప్పేంటని ఏపీ, అలా ఎలా వాడతారని తెలంగాణ.. ఇక, నాగార్జున సాగర్లో ఏకమొత్తంగా తెలంగాణ అధిక నీటిని వినియోగించుకుంటోందని ఏపీ ఇలా.. ఏపీ తెలంగాణల మధ్య వివాదాలు మొదలై.. ఇప్పుడు రాజకీయంగా కూడా విమర్శలకు అవకాశం ఇచ్చింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఒకే రోజు.. వేర్వేరు వేదికలపై నుంచి సమస్యలను పరిష్కరించుకునేందుకు చర్చలే మార్గమని ప్రకటించారు. ఇదేసమయంలో ఘర్షణలతో పోయేది తప్ప.. వచ్చేది కూడా లేదని ప్రకటించారు. మరీ ముఖ్యంగా ఈ ప్రతిపాదన విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఒకే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. దీనిని రాజకీయ రగడగా మార్చితే.. ప్రభుత్వాలకు నష్టమని గుర్తించారు. ఈ క్రమంలోనే కూర్చుని చర్చించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.
గతంలోనూ..
అయితే.. ఇలా సీఎంలు చర్చించుకోవడం.. ఇప్పుడే కాదు.. గతంలో కేసీఆర్, జగన్ కూడా రెండు సందర్భాల్లో జల వివాదాలపై చర్చించుకున్నారు. కానీ, ఎక్కడా ఫలితం రాలేదు. ఆశించిన మేరకు కూడా చర్చలు జరగలేదు. కానీ.. దీనికి భిన్నంగా ఇప్పుడు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తే. తప్ప.. ఫలితం వచ్చేలా కనిపించడం లేదన్న చర్చ సాగుతోంది. మరి ఆదిశగా అడుగులు వేస్తారా? లేదా? అనేది చూడాలి.
పట్టు విడుపులు!
+ ప్రధానంగా పట్టువిడుపుల ధోరణి ఉంటే తప్ప.. చర్చలు సఫలం కావు.
+ కానీ.. ఈ దిశగా రాష్ట్రాలు అడుగులు వేస్తాయా? అనేది ప్రశ్న.
+ ఎవరికి వారికి తమ తమ రాష్ట్రాలు ముఖ్యం. ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.
+ దీనికి తోడు.. రాజకీయ కారణాలు కూడా కనిపిస్తున్నాయి.
+ చర్చల్లో ఏ చిన్న తేడా వచ్చినా.. రాజకీయంగా వాడుకునేందుకు ప్రతిపక్షాలు ఉన్నాయి.
+ ఈ నేపథ్యంలో చర్చలకు కూర్చున్నా.. పట్టువిడుపుల ధోరణి ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
This post was last modified on January 10, 2026 4:12 pm
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…