రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాదాపు ఒకే మాట చెప్పుకొని రావడం.. కలసి కూర్చుని చర్చించుకుంటే.. సమస్యలు పరిష్కరించుకోవచ్చన్న దిశగా ఆలోచన చేయడం.. ప్రస్తుతం నెలకొన్న సమస్యల పరిష్కారానికి శుభసంకల్పమేనని అంటున్నారు పరిశీలకులు. ఇరు రాష్ట్రాల మధ్య గత ఆరు మాసాలుగా నీళ్లు నిప్పులుగా మారాయి.
పోలవరం-బనకచర్ల నుంచి నాగార్జున సాగర్వరకు.. అనేక ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ, ఏపీల మధ్య వివాదం కొనసాగుతోంది. గోదావరి నీటిలో మిగులు జలాలను వాడుకుంటే తప్పేంటని ఏపీ, అలా ఎలా వాడతారని తెలంగాణ.. ఇక, నాగార్జున సాగర్లో ఏకమొత్తంగా తెలంగాణ అధిక నీటిని వినియోగించుకుంటోందని ఏపీ ఇలా.. ఏపీ తెలంగాణల మధ్య వివాదాలు మొదలై.. ఇప్పుడు రాజకీయంగా కూడా విమర్శలకు అవకాశం ఇచ్చింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఒకే రోజు.. వేర్వేరు వేదికలపై నుంచి సమస్యలను పరిష్కరించుకునేందుకు చర్చలే మార్గమని ప్రకటించారు. ఇదేసమయంలో ఘర్షణలతో పోయేది తప్ప.. వచ్చేది కూడా లేదని ప్రకటించారు. మరీ ముఖ్యంగా ఈ ప్రతిపాదన విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఒకే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. దీనిని రాజకీయ రగడగా మార్చితే.. ప్రభుత్వాలకు నష్టమని గుర్తించారు. ఈ క్రమంలోనే కూర్చుని చర్చించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.
గతంలోనూ..
అయితే.. ఇలా సీఎంలు చర్చించుకోవడం.. ఇప్పుడే కాదు.. గతంలో కేసీఆర్, జగన్ కూడా రెండు సందర్భాల్లో జల వివాదాలపై చర్చించుకున్నారు. కానీ, ఎక్కడా ఫలితం రాలేదు. ఆశించిన మేరకు కూడా చర్చలు జరగలేదు. కానీ.. దీనికి భిన్నంగా ఇప్పుడు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తే. తప్ప.. ఫలితం వచ్చేలా కనిపించడం లేదన్న చర్చ సాగుతోంది. మరి ఆదిశగా అడుగులు వేస్తారా? లేదా? అనేది చూడాలి.
పట్టు విడుపులు!
+ ప్రధానంగా పట్టువిడుపుల ధోరణి ఉంటే తప్ప.. చర్చలు సఫలం కావు.
+ కానీ.. ఈ దిశగా రాష్ట్రాలు అడుగులు వేస్తాయా? అనేది ప్రశ్న.
+ ఎవరికి వారికి తమ తమ రాష్ట్రాలు ముఖ్యం. ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.
+ దీనికి తోడు.. రాజకీయ కారణాలు కూడా కనిపిస్తున్నాయి.
+ చర్చల్లో ఏ చిన్న తేడా వచ్చినా.. రాజకీయంగా వాడుకునేందుకు ప్రతిపక్షాలు ఉన్నాయి.
+ ఈ నేపథ్యంలో చర్చలకు కూర్చున్నా.. పట్టువిడుపుల ధోరణి ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
This post was last modified on January 10, 2026 4:12 pm
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఉంటున్నాడు తెలుగువాడైన విశాల్. ‘సెండై కోళి’తో తమిళనాట స్టార్ ఇమేజ్…
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ ఏడాదిలో 10 వేలకుపైగా సర్కారీ…
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రిజవిజన్(సర్) ప్రక్రియ దాదాపు రెండు మాసాల పాటు సాగింది. రెండు…
టాలీవుడ్ లో కొన్ని ప్యాన్ ఇండియా సినిమాల సంకట స్థితి అంతా ఇంతా కాదు. విడుదల తేదీ తేల్చకుండా, అభిమానుల…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. ఇటీవలే పుదుచెరి షెడ్యూల్…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత జగన్ దూరం పెడుతున్నారా? తన పార్టీలోని మిగతా నేతలతో ఉన్నంత…