Political News

శుభ సంక‌ల్పం: రెండు రాష్ట్రాల మ‌ధ్య కొత్త స్నేహం!

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల నేప‌థ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు దాదాపు ఒకే మాట చెప్పుకొని రావ‌డం.. క‌ల‌సి కూర్చుని చ‌ర్చించుకుంటే.. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవచ్చన్న దిశ‌గా ఆలోచ‌న చేయ‌డం.. ప్ర‌స్తుతం నెల‌కొన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి శుభ‌సంక‌ల్ప‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇరు రాష్ట్రాల మ‌ధ్య గ‌త ఆరు మాసాలుగా నీళ్లు నిప్పులుగా మారాయి.

పోల‌వ‌రం-బ‌న‌క‌చ‌ర్ల నుంచి నాగార్జున సాగ‌ర్‌వ‌ర‌కు.. అనేక ప్రాజెక్టుల విష‌యంలో తెలంగాణ‌, ఏపీల మ‌ధ్య వివాదం కొన‌సాగుతోంది. గోదావ‌రి నీటిలో మిగులు జ‌లాల‌ను వాడుకుంటే త‌ప్పేంట‌ని ఏపీ, అలా ఎలా వాడ‌తార‌ని తెలంగాణ‌.. ఇక‌, నాగార్జున సాగ‌ర్‌లో ఏక‌మొత్తంగా తెలంగాణ అధిక నీటిని వినియోగించుకుంటోంద‌ని ఏపీ ఇలా.. ఏపీ తెలంగాణ‌ల మ‌ధ్య వివాదాలు మొద‌లై.. ఇప్పుడు రాజ‌కీయంగా కూడా విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇచ్చింది.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు.. ఒకే రోజు.. వేర్వేరు వేదిక‌ల‌పై నుంచి స‌మ‌స్య‌ల‌ను పరిష్క‌రించుకునేందుకు చ‌ర్చ‌లే మార్గ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఇదేస‌మ‌యంలో ఘ‌ర్ష‌ణ‌ల‌తో పోయేది త‌ప్ప‌.. వ‌చ్చేది కూడా లేద‌ని ప్ర‌క‌టించారు. మ‌రీ ముఖ్యంగా ఈ ప్ర‌తిపాద‌న విష‌యంలో ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఒకే అభిప్రాయం కూడా వ్య‌క్త‌మైంది. దీనిని రాజకీయ ర‌గ‌డ‌గా మార్చితే.. ప్ర‌భుత్వాల‌కు న‌ష్ట‌మ‌ని గుర్తించారు. ఈ క్ర‌మంలోనే కూర్చుని చ‌ర్చించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

గ‌తంలోనూ..

అయితే.. ఇలా సీఎంలు చ‌ర్చించుకోవ‌డం.. ఇప్పుడే కాదు.. గ‌తంలో కేసీఆర్‌, జ‌గ‌న్ కూడా రెండు సంద‌ర్భాల్లో జ‌ల వివాదాల‌పై చ‌ర్చించుకున్నారు. కానీ, ఎక్క‌డా ఫ‌లితం రాలేదు. ఆశించిన మేర‌కు కూడా చ‌ర్చ‌లు జ‌ర‌గ‌లేదు. కానీ.. దీనికి భిన్నంగా ఇప్పుడు చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డి ప్ర‌య‌త్నాలు చేస్తే. త‌ప్ప‌.. ఫ‌లితం వ‌చ్చేలా క‌నిపించ‌డం లేద‌న్న చ‌ర్చ సాగుతోంది. మ‌రి ఆదిశ‌గా అడుగులు వేస్తారా?  లేదా? అనేది చూడాలి.

ప‌ట్టు విడుపులు!

+ ప్ర‌ధానంగా ప‌ట్టువిడుపుల ధోర‌ణి ఉంటే త‌ప్ప‌.. చ‌ర్చ‌లు స‌ఫ‌లం కావు.
+ కానీ.. ఈ దిశ‌గా రాష్ట్రాలు అడుగులు వేస్తాయా? అనేది ప్ర‌శ్న‌.
+  ఎవ‌రికి వారికి త‌మ త‌మ రాష్ట్రాలు ముఖ్యం. ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నారు.
+ దీనికి తోడు.. రాజ‌కీయ కార‌ణాలు కూడా క‌నిపిస్తున్నాయి.
+ చ‌ర్చ‌ల్లో ఏ చిన్న తేడా వ‌చ్చినా.. రాజకీయంగా వాడుకునేందుకు ప్ర‌తిప‌క్షాలు ఉన్నాయి.
+ ఈ నేప‌థ్యంలో చ‌ర్చ‌ల‌కు కూర్చున్నా.. ప‌ట్టువిడుపుల ధోర‌ణి ముఖ్య‌మని నిపుణులు చెబుతున్నారు.

Kumar

Recent Posts

అనుకున్నట్లే జరిగింది.. రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్!

అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…

1 hour ago

బుచ్చిబాబు మీద నమ్మకం ఎంత ఉందంటే

మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…

1 hour ago

మెగా సినిమాల మీదే యువి భారం

మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…

1 hour ago

పీఏ అక్ర‌మాలు… గట్టిగా వినిపిస్తున్న జగన్ పేరు

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు.. రాష్ట్రంలో జ‌రిగిన అనేక అక్ర‌మాల‌పై ప్ర‌స్తుత ప్ర‌భుత్వం విచార‌ణ చేస్తున్న…

2 hours ago

తెలుగు దుకాణంలో డబ్బింగ్ వ్యాపారం

వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా…

3 hours ago

కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై…

4 hours ago