Political News

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవలు, ఘర్షణలు లేకుండా తెలుగు వారు ప్రశాంతంగా జీవించాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమస్యలను కలిసి కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఈ సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

కోర్టుల్లో కాకుండా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను మనమే పరిష్కరించుకుందాం అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జల వివాదాలపై స్పందించారు. నీటిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలని తాము భావించడం లేదన్నారు. పంచాయతీ కావాలా నీళ్లు కావాలా అని అడిగితే నీళ్లే కావాలని చెబుతానన్నారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డు పడకూడదని వ్యాఖ్యానించారు. ఏపీ అడ్డు పడుతున్నందుకే కేంద్రం నుంచి నిధులు రావడం లేదన్నారు.

ఆయా ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించలేమని రేవంత్ రెడ్డి చెప్పారు. ఏపీ ప్రభుత్వం చెబుతున్న సాకుల వల్లనే కేంద్రం నీటి ప్రాజెక్టులను అడ్డుకుంటోందన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సహకరించాలని కోరారు. తాము ఏపీతో ఎలాంటి వివాదాలు కోరుకోవడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఉన్న సమస్యలను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణకు పోర్టు సౌకర్యం లేదని, ఏపీలోని కాకినాడ మరియు విశాఖ పోర్టుల సహకారం ఎంతో అవసరమని అన్నారు. ఈ విషయంలో ఏపీ సహకారం అవసరమని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేస్తే తాము పది అడుగులు ముందుకు వస్తామని చెప్పారు.

Satya

Recent Posts

బాబోయ్.. డిటర్జెంట్‌ పొడితో 2.3 కోట్ల లీటర్ల పాలు తయారు?

 మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…

1 hour ago

ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ‘ది ఒడిస్సీ’

ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…

2 hours ago

‘ఎన్టీఆర్ పేరుతో ప్రెస్ నోట్… సంతకం ఎక్కడ?’

ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేప‌డుతున్న సేవా కార్య‌క్ర‌మాల వ్య‌వ‌హారం ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి…

2 hours ago

అనుకూలమైన తీర్పు కోసం జడ్జి కుర్చీపైనే చేతబడి…!

న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…

3 hours ago

త్రివిక్రమ్ కోసం బ్రేస్‌లెట్ తాకట్టు

సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…

3 hours ago

ఏం పాపం చేశారని… చిన్నారులనూ చిదిమేస్తున్నారు

ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…

3 hours ago