Political News

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవలు, ఘర్షణలు లేకుండా తెలుగు వారు ప్రశాంతంగా జీవించాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమస్యలను కలిసి కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఈ సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

కోర్టుల్లో కాకుండా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను మనమే పరిష్కరించుకుందాం అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జల వివాదాలపై స్పందించారు. నీటిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలని తాము భావించడం లేదన్నారు. పంచాయతీ కావాలా నీళ్లు కావాలా అని అడిగితే నీళ్లే కావాలని చెబుతానన్నారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డు పడకూడదని వ్యాఖ్యానించారు. ఏపీ అడ్డు పడుతున్నందుకే కేంద్రం నుంచి నిధులు రావడం లేదన్నారు.

ఆయా ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించలేమని రేవంత్ రెడ్డి చెప్పారు. ఏపీ ప్రభుత్వం చెబుతున్న సాకుల వల్లనే కేంద్రం నీటి ప్రాజెక్టులను అడ్డుకుంటోందన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సహకరించాలని కోరారు. తాము ఏపీతో ఎలాంటి వివాదాలు కోరుకోవడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఉన్న సమస్యలను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణకు పోర్టు సౌకర్యం లేదని, ఏపీలోని కాకినాడ మరియు విశాఖ పోర్టుల సహకారం ఎంతో అవసరమని అన్నారు. ఈ విషయంలో ఏపీ సహకారం అవసరమని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేస్తే తాము పది అడుగులు ముందుకు వస్తామని చెప్పారు.

This post was last modified on January 10, 2026 8:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

4 minutes ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

5 hours ago

మోడీపై సీనియర్ నటుడి ఊహించ‌ని ఎలివేషన్

సినిమా వాళ్ల‌కు రాజ‌కీయ ఆస‌క్తులు, అభిమానాలు ఉండ‌డం కొత్త కాదు. అందులో త‌ప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజ‌కీయాల…

5 hours ago

సినిమా జాతకాన్ని ఎన్నికలు మార్చేశాయి

మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…

5 hours ago

ఒక్క ట్రైలర్… వందల కోట్ల బరువు

ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి…

5 hours ago

వీరభద్రుడు చాలా మాస్ ఉన్నాడు

సూర్య వీరభద్రుడు ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. తమిళనాడులో రాజకీయ వాతావరణం వల్ల రిలీజ్ చేయాలా వద్దాని రెండు…

6 hours ago