Political News

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవలు, ఘర్షణలు లేకుండా తెలుగు వారు ప్రశాంతంగా జీవించాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమస్యలను కలిసి కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఈ సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

కోర్టుల్లో కాకుండా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను మనమే పరిష్కరించుకుందాం అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జల వివాదాలపై స్పందించారు. నీటిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలని తాము భావించడం లేదన్నారు. పంచాయతీ కావాలా నీళ్లు కావాలా అని అడిగితే నీళ్లే కావాలని చెబుతానన్నారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డు పడకూడదని వ్యాఖ్యానించారు. ఏపీ అడ్డు పడుతున్నందుకే కేంద్రం నుంచి నిధులు రావడం లేదన్నారు.

ఆయా ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించలేమని రేవంత్ రెడ్డి చెప్పారు. ఏపీ ప్రభుత్వం చెబుతున్న సాకుల వల్లనే కేంద్రం నీటి ప్రాజెక్టులను అడ్డుకుంటోందన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సహకరించాలని కోరారు. తాము ఏపీతో ఎలాంటి వివాదాలు కోరుకోవడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఉన్న సమస్యలను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణకు పోర్టు సౌకర్యం లేదని, ఏపీలోని కాకినాడ మరియు విశాఖ పోర్టుల సహకారం ఎంతో అవసరమని అన్నారు. ఈ విషయంలో ఏపీ సహకారం అవసరమని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేస్తే తాము పది అడుగులు ముందుకు వస్తామని చెప్పారు.

This post was last modified on January 10, 2026 8:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

8 minutes ago

30 కోట్ల‌తో సీనియ‌ర్ నిర్మాత సాహ‌సం

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ కాలంగా నిర్మాత‌గా ఉన్నారు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు. 90వ ద‌శ‌కంలోనే దివంగ‌త న‌టుడు శోభ‌న్ బాబు…

12 minutes ago

తమిళంలో అదరగొట్టిన చంద్రబాబు

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…

3 hours ago

ముంబై కమ్ బ్యాక్.. ఇది భయంకరమే..

​ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ కు ఒక అలవాటు ఉంది.. అదే 'స్లో స్టార్ట్ అండ్ డెడ్లీ ఫినిష్'. ఈ…

10 hours ago

122 రోజులు… ప్యారడైజ్ కాళ్లకు పరుగులు

నాని ప్యారడైజ్ మీద అంచనాల గురించి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఆగస్ట్ 21 విడుదల కోసం అభిమానులే కాదు మూవీ…

11 hours ago

జీవన్ రెడ్డిపై కేసీఆర్ వరాల జల్లు!

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తో 40 ఏళ్ల బంధాన్ని వీడి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరిన సీనియర్…

11 hours ago