ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవలు, ఘర్షణలు లేకుండా తెలుగు వారు ప్రశాంతంగా జీవించాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమస్యలను కలిసి కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఈ సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
కోర్టుల్లో కాకుండా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను మనమే పరిష్కరించుకుందాం అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జల వివాదాలపై స్పందించారు. నీటిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలని తాము భావించడం లేదన్నారు. పంచాయతీ కావాలా నీళ్లు కావాలా అని అడిగితే నీళ్లే కావాలని చెబుతానన్నారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డు పడకూడదని వ్యాఖ్యానించారు. ఏపీ అడ్డు పడుతున్నందుకే కేంద్రం నుంచి నిధులు రావడం లేదన్నారు.
ఆయా ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించలేమని రేవంత్ రెడ్డి చెప్పారు. ఏపీ ప్రభుత్వం చెబుతున్న సాకుల వల్లనే కేంద్రం నీటి ప్రాజెక్టులను అడ్డుకుంటోందన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సహకరించాలని కోరారు. తాము ఏపీతో ఎలాంటి వివాదాలు కోరుకోవడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఉన్న సమస్యలను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణకు పోర్టు సౌకర్యం లేదని, ఏపీలోని కాకినాడ మరియు విశాఖ పోర్టుల సహకారం ఎంతో అవసరమని అన్నారు. ఈ విషయంలో ఏపీ సహకారం అవసరమని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేస్తే తాము పది అడుగులు ముందుకు వస్తామని చెప్పారు.
This post was last modified on January 10, 2026 8:44 am
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…
న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…
ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…
తిరుమలపై మరో దుష్ప్రచారం జరగడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కారణం ఎవరు? ఎక్కడ నుంచి జరిగింది?…
ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జగన్.. దానికి తగిన విధంగా పనిచే స్తున్నారా? అనేది…
తనపై వైసీపీ నాయకులు సహా.. ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…