రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు బయలుదేరారని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. కొందరు రాయలసీమ ఎత్తిపోతల పేరుతో వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
నాకు గొడవలు కాదు.. తెలుగు జాతి ప్రయోజనాలే కావాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం పూర్తి అయితే తెలంగాణ రాష్ట్రం కూడా ఆ నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. వివాదాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అందరికీ చెబుతున్నానని తెలిపారు.
పట్టిసీమ నిర్మించి కృష్ణా డెల్టాలో నీటిని వినియోగించుకుందామంటే వ్యతిరేకించారని, కృష్ణా డెల్టాలో ఇచ్చే నీటిని పొదుపు చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకు తరలించామని చెప్పారు. ఈ ఏడాది రాయలసీమలోని రిజర్వాయర్లలో నీటిని నింపామని వెల్లడించారు.
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు, ప్రస్తుతం రాయలసీమ నీటి కొరతను తీర్చి ఉద్యాన హబ్గా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. అయినా కొందరు నీళ్లు వద్దు.. వివాదాలే కావాలని నానా యాగీ చేస్తున్నారని విమర్శించారు.
రెడ్ హ్యాండెడ్గా దొరికారు
తిరుమలలో మద్యం బాటిళ్ల వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కొండపై ప్రసాదాన్ని కల్తీ చేశారని, కల్తీ నెయ్యి వాడి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని వైసీపీ పాలనను దుయ్యబట్టారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ప్రసాదాన్ని ఎలాంటి కల్తీ లేకుండా పవిత్రంగా తయారు చేస్తున్నామని తెలిపారు. వ్యవస్థలు సక్రమంగా నడుస్తుంటే మళ్లీ కొన్ని వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ కూడా ఇవ్వని వ్యక్తులు తిరుమల కొండపై మద్యం బాటిళ్లు వేసి అపవాదు సృష్టించే ప్రయత్నం చేశారని పరోక్షంగా భూమన కరుణాకర్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. బాటిళ్ల వ్యవహారంలో దొంగలు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రాన్ని గంజాయితో సర్వనాశనం చేశారని, కోవిడ్ సమయంలో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ను వేధించి చంపేశారని విమర్శించారు. అయితే, ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, కోటి రూపాయల పరిహారం అందించామని తెలిపారు.
వైసీపీ చేసిన పాపాలను కడిగేసే ప్రయత్నం చేస్తున్నామని, ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలని చంద్రబాబు అన్నారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
This post was last modified on January 10, 2026 7:45 am
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…