Political News

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు బయలుదేరారని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. కొందరు రాయలసీమ ఎత్తిపోతల పేరుతో వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

నాకు గొడవలు కాదు.. తెలుగు జాతి ప్రయోజనాలే కావాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం పూర్తి అయితే తెలంగాణ రాష్ట్రం కూడా ఆ నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. వివాదాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అందరికీ చెబుతున్నానని తెలిపారు.

పట్టిసీమ నిర్మించి కృష్ణా డెల్టాలో నీటిని వినియోగించుకుందామంటే వ్యతిరేకించారని, కృష్ణా డెల్టాలో ఇచ్చే నీటిని పొదుపు చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకు తరలించామని చెప్పారు. ఈ ఏడాది రాయలసీమలోని రిజర్వాయర్లలో నీటిని నింపామని వెల్లడించారు.

తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు, ప్రస్తుతం రాయలసీమ నీటి కొరతను తీర్చి ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. అయినా కొందరు నీళ్లు వద్దు.. వివాదాలే కావాలని నానా యాగీ చేస్తున్నారని విమర్శించారు.

రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు

తిరుమలలో మద్యం బాటిళ్ల వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కొండపై ప్రసాదాన్ని కల్తీ చేశారని, కల్తీ నెయ్యి వాడి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని వైసీపీ పాలనను దుయ్యబట్టారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ప్రసాదాన్ని ఎలాంటి కల్తీ లేకుండా పవిత్రంగా తయారు చేస్తున్నామని తెలిపారు. వ్యవస్థలు సక్రమంగా నడుస్తుంటే మళ్లీ కొన్ని వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ కూడా ఇవ్వని వ్యక్తులు తిరుమల కొండపై మద్యం బాటిళ్లు వేసి అపవాదు సృష్టించే ప్రయత్నం చేశారని పరోక్షంగా భూమన కరుణాకర్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. బాటిళ్ల వ్యవహారంలో దొంగలు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని చంద్రబాబు అన్నారు.

రాష్ట్రాన్ని గంజాయితో సర్వనాశనం చేశారని, కోవిడ్ సమయంలో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్‌ను వేధించి చంపేశారని విమర్శించారు. అయితే, ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, కోటి రూపాయల పరిహారం అందించామని తెలిపారు.

వైసీపీ చేసిన పాపాలను కడిగేసే ప్రయత్నం చేస్తున్నామని, ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలని చంద్రబాబు అన్నారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

This post was last modified on January 10, 2026 7:45 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

3 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

3 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

5 hours ago