రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు బయలుదేరారని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. కొందరు రాయలసీమ ఎత్తిపోతల పేరుతో వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
నాకు గొడవలు కాదు.. తెలుగు జాతి ప్రయోజనాలే కావాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం పూర్తి అయితే తెలంగాణ రాష్ట్రం కూడా ఆ నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. వివాదాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అందరికీ చెబుతున్నానని తెలిపారు.
పట్టిసీమ నిర్మించి కృష్ణా డెల్టాలో నీటిని వినియోగించుకుందామంటే వ్యతిరేకించారని, కృష్ణా డెల్టాలో ఇచ్చే నీటిని పొదుపు చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకు తరలించామని చెప్పారు. ఈ ఏడాది రాయలసీమలోని రిజర్వాయర్లలో నీటిని నింపామని వెల్లడించారు.
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు, ప్రస్తుతం రాయలసీమ నీటి కొరతను తీర్చి ఉద్యాన హబ్గా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. అయినా కొందరు నీళ్లు వద్దు.. వివాదాలే కావాలని నానా యాగీ చేస్తున్నారని విమర్శించారు.
రెడ్ హ్యాండెడ్గా దొరికారు
తిరుమలలో మద్యం బాటిళ్ల వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కొండపై ప్రసాదాన్ని కల్తీ చేశారని, కల్తీ నెయ్యి వాడి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని వైసీపీ పాలనను దుయ్యబట్టారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ప్రసాదాన్ని ఎలాంటి కల్తీ లేకుండా పవిత్రంగా తయారు చేస్తున్నామని తెలిపారు. వ్యవస్థలు సక్రమంగా నడుస్తుంటే మళ్లీ కొన్ని వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ కూడా ఇవ్వని వ్యక్తులు తిరుమల కొండపై మద్యం బాటిళ్లు వేసి అపవాదు సృష్టించే ప్రయత్నం చేశారని పరోక్షంగా భూమన కరుణాకర్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. బాటిళ్ల వ్యవహారంలో దొంగలు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రాన్ని గంజాయితో సర్వనాశనం చేశారని, కోవిడ్ సమయంలో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ను వేధించి చంపేశారని విమర్శించారు. అయితే, ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, కోటి రూపాయల పరిహారం అందించామని తెలిపారు.
వైసీపీ చేసిన పాపాలను కడిగేసే ప్రయత్నం చేస్తున్నామని, ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలని చంద్రబాబు అన్నారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
This post was last modified on January 10, 2026 7:45 am
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే తమిళ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయిపై కేసు నమోదైంది. ఎక్స్లో ఆమె చేసిన…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆనంద్ దేవరకొండని సక్సెస్ వరించడానికి టైం అయితే పట్టింది. బేబీ…