అదేంటి? ఈ వ్యాఖ్యల అంతరార్థం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? ఒకింత ఆశ్చర్యంగా కూడా ఉందా? కానీ.. అధికార పార్టీ వైసీపీలో ఈ వ్యాఖ్యలే హల్చల్ చేస్తున్నాయి. త్వరలోనే సీఎం జగన్ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ చేస్తారని తెలిసిందే. సగం మంది ఇప్పుడున్న వారిని పక్కన పెట్టి.. కొత్తవారికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి జగన్ చెప్పింది కూడా ఇదే. అయితే.. సాధారణంగా .. మంత్రులుగా ఉన్నవారు ఎవరైనా.. తప్పుకొనేందుకు..పదవులు వదులుకునేందుకు ఇష్టపడరు. అవసరమైతే.. వివాదానికైనా దిగుతారు. కుదిరితే బ్రతిమాలుతారు.
కానీ, వైసీపీలో ముగ్గురు నుంచి నలుగురు మంత్రులు తమంతట తామే తప్పుకొనేందుకు రెడీగా ఉన్నార ని అంటున్నారు వైసీపీ సీనియర్లు. అత్యంత రహస్యంగా సాగుతున్న ఈ చర్చ ఆనోటా.. ఈనోటా పడి.. మీడియాకు చేరింది. మంత్రులుగా ఉన్నప్పటికీ.. తమకు పవర్స్ లేవని భావిస్తున్నవారు, తమ నియోజకవర్గంలోనే తమకు విలువ లేకుండా పోతోందని, సీనియర్లు తమపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారని భావిస్తున్న మంత్రులు.. మంత్రిగా ఉన్నా.. ప్రయోజనం లేకుండా పోయింది.. మాకు ఎమ్మెల్యేకు తేడా లేదని వగరుస్తున్నవారు.. ఈ జాబితాలో ఉన్నారని చెప్పుకొంటున్నారు.
విశ్వసనీయ వైసీపీ నేతల సమాచారం మేరకు స్వచ్ఛందంగా పదవులు వదులుకునేందుకు రెడీగా ఉన్న మంత్రుల్లో కడప జిల్లాకు చెందిన కడప ఎమ్మెల్యే, మంత్రి అంజాద్ బాషా, విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి శంకరనారాయణ, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఎమ్మెల్యే, మంత్రి రంగనాథరాజుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరి గోల వారిదే .. అన్నట్టుగా పరిస్థితి ఉందని అంటున్నారు సీనియర్ నాయకులు. నియోజకవర్గాల్లోను, ప్రభుత్వ పాలనలోనూ వీరికి పెద్దగా వాల్యూలేదని కూడా అంటున్నారు. ఏదేమేనా.. వీరు జగన్ అడగడమే పాపం.. వదులుకునేందుకు రెడీ అని చర్చించుకుంటుండడం గమనార్హం.
This post was last modified on December 13, 2020 2:50 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…