ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్ పేజీపై నిలిచారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల సృష్టికి కేంద్రబిందువుగా మారిన లోకేష్ను మ్యాగజైన్ ‘చీఫ్ జాబ్ క్రియేటర్’గా అభివర్ణించింది.
స్టాన్ఫోర్డ్, కార్నెగీ మెలన్ వంటి ప్రపంచ స్థాయి సంస్థల్లో శిక్షణ పొందిన నారా లోకేష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ను కార్యరూపంలోకి తీసుకొచ్చే దిశగా వేగవంతమైన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారని పేర్కొంది. పరిశ్రమలతో సమన్వయం, విధానపరమైన సంస్కరణలు, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను ఇన్వెస్టర్లకు ప్రథమ గమ్యంగా మార్చుతున్నారని మ్యాగజైన్ తెలిపింది.
ఇదే కాకుండా, గతంలో ప్రముఖ జాతీయ పత్రిక బిజినెస్ స్టాండర్డ్ కూడా నారా లోకేష్ను ‘జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్’గా అభివర్ణించింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఏపీ–రిలయన్స్ ఒప్పందం కేవలం 30 రోజుల్లోనే రూ.65 వేల కోట్ల పెట్టుబడిని సాధించిన నేపథ్యంలో, లోకేష్తో ఆ పత్రిక ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్గా ఆయన పోషిస్తున్న పాత్రను ప్రశంసిస్తూ, పెట్టుబడులు మరియు ఉపాధి లక్ష్యంగా రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొంది.
మొత్తంగా, నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, ఆర్థిక పునరుజ్జీవనం మరియు ఉద్యోగాలే కేంద్రబిందువుగా మారుతున్నాయని జాతీయ మీడియా స్పష్టం చేస్తోంది.
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…