నేషనల్ హైవే నిర్మాణంలో 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులకు రాష్ట్రం వేదికగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. బెంగళూరు -కడప- విజయవాడ ఎకనామిక్ కారిడార్లను కలిపే 28.95కి.మీ రహదారిని 24గంటల్లోనే నిర్మించారని తెలిపారు. దీనికోసం 10,675 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్ వాడకం మరో రికార్డు అన్నారు. భారత ప్రభుత్వ, కేంద్ర మంత్రి గడ్కరీ విజన్, ఇంజినీర్లు, కార్మికులు, ఫీల్డ్ టీమ్స్ నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు.
బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ (ఎన్హెచ్–544జి)పై జాతీయ రహదారి ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 24 గంటల వ్యవధిలో ఈ రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది.
ఈ అపూర్వ విజయానికి భారత ప్రభుత్వ దూరదృష్టి, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా సాగుతున్న ప్రపంచ స్థాయి రహదారి మౌలిక వసతుల అభివృద్ధి ప్రధాన కారణమని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే ఇంజినీర్లు, కార్మికులు, ఫీల్డ్ బృందాలు చూపిన అంకితభావం, కృషి ఈ రికార్డులకు బాట వేసిందన్నారు. నిబంధనలకు అనుగుణంగా, ఎన్హెచ్ఏఐ కఠిన నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఈ పనులు పూర్తయ్యాయని తెలిపారు.
ఇదే కారిడార్లోని ప్యాకేజీలు–2, 3లపై జనవరి 11, 2026 నాటికి మరో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
This post was last modified on January 8, 2026 8:44 am
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…