Political News

కేటీఆర్ పర్యటనలో ‘జై జగన్.. జై కేసీఆర్’

వైసీపీ శ్రేణులు బీఆర్ఎస్ విజయం కోసం, బీఆర్ఎస్ కార్యకర్తలు వైసీపీ గెలుపు కోసం కోరుకుంటున్నారని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చెప్పారు. ఆ మాటలు ఇరు పార్టీల కేడర్ మనోభావాల్లోనూ ప్రతిఫలిస్తున్నాయేమో అన్న భావనకు తాజాగా చోటుచేసుకున్న ఘటనలు బలాన్నిస్తున్నాయి.

ఇటీవల జగన్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలోని ఆయన నివాసం సమీపంలో కేటీఆర్, కేసీఆర్ చిత్రంతో శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. తాజాగా కేటీఆర్ పర్యటనలోనూ అలాంటి దృశ్యాలే కనిపించాయి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి వద్ద వైసీపీ జెండాలు పట్టుకున్న జగన్ అభిమానులు కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ జై జగన్… జగన్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు.

కొద్దిరోజుల కిందట బెంగళూరులో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేటీఆర్ భేటీ కావడం అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చకు దారితీసింది. ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో చిరునవ్వులతో కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. దీంతో రాబోయే రోజుల్లో తెలుగు రాజకీయాల స్వరూపం ఎలా ఉండబోతోందన్న దానిపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి.

గత ఐదేళ్ల పాటు తెలంగాణలో బీఆర్ఎస్, గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇరు పార్టీల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాయి. ప్రస్తుతం అయితే పరిస్థితి మారింది. ఏపీలో కూటమి ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయి.

ఈ తరుణంలో వైసీపీ, బీఆర్ఎస్ రెండూ ప్రతిపక్షాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న ఇటువంటి పరిణామాలు కేవలం కార్యకర్తల హడావిడి మాత్రమేనా.. లేక ఉమ్మడి ప్రత్యర్థులను ఎదుర్కొనే వ్యూహాత్మక అడుగులలో భాగమా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

This post was last modified on January 7, 2026 3:46 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సింహాన్ని దాచకుండా మంచి పని చేశారు

మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…

1 hour ago

చరణ్ యష్ అనుకుంటే సత్యదేవ్ వస్తున్నాడు

వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…

2 hours ago

సాయిపల్లవికి ‘ఒక రోజు’ షాక్ ఇస్తుందా

చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…

4 hours ago

టీడీపీ మహిళా ఎమ్మెల్యే పీఏగా ట్రాన్స్ జెండర్..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…

5 hours ago

జేడీ వదులుకున్న కల్ట్ బ్లాక్‌బస్టర్

ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…

6 hours ago

దేవి 2… రాజుగారికి పెద్ద ఛాలెంజ్

ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…

6 hours ago