వైసీపీ శ్రేణులు బీఆర్ఎస్ విజయం కోసం, బీఆర్ఎస్ కార్యకర్తలు వైసీపీ గెలుపు కోసం కోరుకుంటున్నారని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చెప్పారు. ఆ మాటలు ఇరు పార్టీల కేడర్ మనోభావాల్లోనూ ప్రతిఫలిస్తున్నాయేమో అన్న భావనకు తాజాగా చోటుచేసుకున్న ఘటనలు బలాన్నిస్తున్నాయి.
ఇటీవల జగన్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలోని ఆయన నివాసం సమీపంలో కేటీఆర్, కేసీఆర్ చిత్రంతో శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. తాజాగా కేటీఆర్ పర్యటనలోనూ అలాంటి దృశ్యాలే కనిపించాయి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి వద్ద వైసీపీ జెండాలు పట్టుకున్న జగన్ అభిమానులు కేటీఆర్కు స్వాగతం పలుకుతూ జై జగన్… జగన్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు.
కొద్దిరోజుల కిందట బెంగళూరులో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేటీఆర్ భేటీ కావడం అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చకు దారితీసింది. ఇద్దరూ ఒకే ఫ్రేమ్లో చిరునవ్వులతో కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. దీంతో రాబోయే రోజుల్లో తెలుగు రాజకీయాల స్వరూపం ఎలా ఉండబోతోందన్న దానిపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి.
గత ఐదేళ్ల పాటు తెలంగాణలో బీఆర్ఎస్, గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇరు పార్టీల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాయి. ప్రస్తుతం అయితే పరిస్థితి మారింది. ఏపీలో కూటమి ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయి.
ఈ తరుణంలో వైసీపీ, బీఆర్ఎస్ రెండూ ప్రతిపక్షాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న ఇటువంటి పరిణామాలు కేవలం కార్యకర్తల హడావిడి మాత్రమేనా.. లేక ఉమ్మడి ప్రత్యర్థులను ఎదుర్కొనే వ్యూహాత్మక అడుగులలో భాగమా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on January 7, 2026 3:46 pm
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…