తెలంగాణ శాసన మండలి శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈ సీజన్లో మొత్తం 5 రోజుల పాటు మాత్రమే ఈ సమావేశాలు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) నిర్ణయంతో ఐదు రోజుల పాటు జరిగిన సమావేశాలు మంగళవారం సాయంత్రంతో ముగిసినట్టు చైర్మన్ ప్రకటించారు.
అనంతరం.. నిరవధికంగా మండలిని వాయిదా వేశారు. ఈ ఐదు రోజుల్లో మొత్తం దాదాపు 20 గంటల పాటు మండలి కార్యకలాపాలు సాగాయి. వాస్తవ సమయం 19 గంటల 52 నిమిషాల వరకు మండలి సాగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
అయితే.. ఈ ఐదు రోజుల సమావేశాల్లో బీఆర్ఎస్ మాజీ నాయకురాలు, మండలి సభ్యురాలు కవిత చేసిన ప్రసంగం హైలెట్గా నిలిచింది. అనేక విషయాలను ప్రస్తావిస్తూ.. ఈ నెల 5న సోమవారం ఆమె సుదీర్ఘంగా మండలిలో ప్రసంగించారు.
గత ప్రభుత్వ పాలనపైనా.. బీఆర్ ఎస్ నేతలపైనా.. ఆ పార్టీలో తనకు జరిగిన అన్యాయంపైనా ఇలా.. అనేక విషయాలను కవిత ప్రస్తావించారు. అంతేకాదు.. ఒక దశలో భావోద్వేగానికి కూడా గురై కన్నీరు పెట్టుకున్నారు. ఇక, తాను సొంత పార్టీ పెట్టనున్నట్టు కూడా కవిత ఈ సమావేశాల్లోనే ప్రకటించడం గమనార్హం.
ఇక, శాసన సభలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలకు కొనసాగింపుగా మండలిలోనూ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రధానంగా జల వివాదాలు.. కృష్ణాజలాల అంశంపై శాసన సభలో చోటు చేసుకున్న చర్చే ఇక్కడ కూడా జరిగింది. మొత్తంగా.. ఐదురోజుల మండలి భేటీలో కవిత ప్రసంగమే హైలెట్ కావడం గమనార్హం.
This post was last modified on January 6, 2026 9:59 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…