Political News

పాపులేష‌న్ కంట్రోల్ లా.. ఎందుకు ట్రెండవుతోంది?

క‌రోనా దెబ్బ‌కు దేశంలో ఒక ర‌క‌మైన విభ‌జ‌న క‌నిపిస్తున్న మాట వాస్త‌వం. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా హిందువులు, ముస్లింల మ‌ధ్య విభ‌జ‌న చూస్తున్నాం ఇప్పుడు. మోడీ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి విభ‌జ‌న రేఖ క్ర‌మంగా పెద్ద‌ది అవుతుండ‌గా.. క‌రోనా వ్యాప్తిని మ‌రో స్థాయికి తీసుకెళ్లిన మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల ఉదంతం అనంత‌రం పూడ్చ‌లేని అగాథం ఏర్ప‌డింది.

మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లొచ్చిన ముస్లింలు క‌రోనా ప‌రీక్ష‌ల‌కు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం.. వైద్య‌, పోలీసు సిబ్బందిపై దాడులు చేయ‌డం లాంటి ఉదంతాలు వారిపై మిగ‌తా వారిలో ద్వేషాన్ని పెంచాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్ని ఉప‌యోగించుకుని విశృంఖ‌లంగా ప్ర‌వ‌ర్తించే ముస్లింల‌పై అదుపు సాధించే ప్ర‌య‌త్నం మోడీ స‌ర్కారు చేస్తోంద‌న్న విశ్లేష‌ణ‌లు మీడియాలో వ‌స్తున్నాయి.

ఇలాంటి స‌మ‌యంలోనే ఉన్న‌ట్లుండి జ‌నాభా నియంత్ర‌ణ మీదికి కేంద్ర ప్ర‌భుత్వం దృష్టి మ‌ళ్ల‌డం గ‌మ‌నార్హం. క‌రోనా నియంత్ర‌ణ‌లో భాగంగా కేంద్రం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై తాజాగా రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ఓ ప్ర‌సంగం చేశారు. అందులో భాగంగా మ‌న దేశంలో జ‌నాభా నియంత్ర‌ణ‌పై దృష్టిపెట్టాల్సిన అవ‌స‌రాన్ని నొక్కి వ‌క్కాణించారు. ఇప్పుడు ఉన్న‌ట్లుండి జ‌నాభా నియంత్ర‌ణ గురించి రాష్ట్ర‌ప‌తి మాట్లాడ‌టంపై ఆస‌క్తి ఏర్ప‌డింది.

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని ఉటంకిస్తూ బీజేపీ అధికార ప్ర‌తినిధి అశ్విన్ ఉపాధ్యాయ్.. దేశంలో జ‌నాభా నియంత్ర‌ణ లేక‌పోవ‌డం వ‌ల్ల క‌రోనా వ్యాప్తి పెరుగుతుండ‌టం గురించి ప్ర‌స్తావించారు. ప్ర‌పంచంలోని పెద్ద దేశాల్లో అత్య‌ధిక జ‌న‌సాంద్ర‌త ఉన్న దేశం ఇండియానే అని.. మ‌న దేశం కంటే విస్తీర్ణంలో 3 రెట్లున్న అమెరికాలో 33 కోట్ల‌ జ‌నాభా మాత్ర‌మే ఉంద‌ని.. కానీ మ‌న జ‌నాభా 135 కోట్లు దాటిపోయింద‌ని.. ఈ జ‌నాభాకు త‌గ్గ‌ట్లుగా వ‌న‌రులు లేక భ‌విష్య‌త్తు ఆందోళ‌నక‌రంగా ఉండ‌బోతుందని ఆయ‌న‌ పేర్కొన్నారు.

ప్ర‌స్తుత జ‌నాభాకు త‌గ్గ‌ట్లు ఏడాదికి 25 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌న అవ‌స‌ర‌మ‌వుతోంద‌ని.. అది అసాధ్య‌మైన ప‌ని అని.. జ‌నాభా నియంత్ర‌ణ లేకుంటే భ‌విష్య‌త్ త‌రాల‌కు గ‌డ్డు ప‌రిస్థితులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ముస్లింలు అస‌లు జ‌నాభా నియంత్రణ పాటించ‌కుండా ఇబ్బ‌డిముబ్బ‌డిగా పిల్ల‌ల్ని కంటార‌న్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో వారికి కూడా వర్తించేలా పాపులేష‌న్ కంట్రోల్ లా తేవాల‌న్న డిమాండ్ పెరుగుతోంది. ఈ హ్యాష్ ట్యాగ్‌తో పెద్ద ఎత్తున ట్వీట్లు ప‌డుతున్నాయి. పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. ఈ దిశ‌గా మోడీ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌న్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

8 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

11 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

11 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

12 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

12 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

14 hours ago