Political News

పాపులేష‌న్ కంట్రోల్ లా.. ఎందుకు ట్రెండవుతోంది?

క‌రోనా దెబ్బ‌కు దేశంలో ఒక ర‌క‌మైన విభ‌జ‌న క‌నిపిస్తున్న మాట వాస్త‌వం. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా హిందువులు, ముస్లింల మ‌ధ్య విభ‌జ‌న చూస్తున్నాం ఇప్పుడు. మోడీ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి విభ‌జ‌న రేఖ క్ర‌మంగా పెద్ద‌ది అవుతుండ‌గా.. క‌రోనా వ్యాప్తిని మ‌రో స్థాయికి తీసుకెళ్లిన మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల ఉదంతం అనంత‌రం పూడ్చ‌లేని అగాథం ఏర్ప‌డింది.

మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లొచ్చిన ముస్లింలు క‌రోనా ప‌రీక్ష‌ల‌కు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం.. వైద్య‌, పోలీసు సిబ్బందిపై దాడులు చేయ‌డం లాంటి ఉదంతాలు వారిపై మిగ‌తా వారిలో ద్వేషాన్ని పెంచాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్ని ఉప‌యోగించుకుని విశృంఖ‌లంగా ప్ర‌వ‌ర్తించే ముస్లింల‌పై అదుపు సాధించే ప్ర‌య‌త్నం మోడీ స‌ర్కారు చేస్తోంద‌న్న విశ్లేష‌ణ‌లు మీడియాలో వ‌స్తున్నాయి.

ఇలాంటి స‌మ‌యంలోనే ఉన్న‌ట్లుండి జ‌నాభా నియంత్ర‌ణ మీదికి కేంద్ర ప్ర‌భుత్వం దృష్టి మ‌ళ్ల‌డం గ‌మ‌నార్హం. క‌రోనా నియంత్ర‌ణ‌లో భాగంగా కేంద్రం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై తాజాగా రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ఓ ప్ర‌సంగం చేశారు. అందులో భాగంగా మ‌న దేశంలో జ‌నాభా నియంత్ర‌ణ‌పై దృష్టిపెట్టాల్సిన అవ‌స‌రాన్ని నొక్కి వ‌క్కాణించారు. ఇప్పుడు ఉన్న‌ట్లుండి జ‌నాభా నియంత్ర‌ణ గురించి రాష్ట్ర‌ప‌తి మాట్లాడ‌టంపై ఆస‌క్తి ఏర్ప‌డింది.

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని ఉటంకిస్తూ బీజేపీ అధికార ప్ర‌తినిధి అశ్విన్ ఉపాధ్యాయ్.. దేశంలో జ‌నాభా నియంత్ర‌ణ లేక‌పోవ‌డం వ‌ల్ల క‌రోనా వ్యాప్తి పెరుగుతుండ‌టం గురించి ప్ర‌స్తావించారు. ప్ర‌పంచంలోని పెద్ద దేశాల్లో అత్య‌ధిక జ‌న‌సాంద్ర‌త ఉన్న దేశం ఇండియానే అని.. మ‌న దేశం కంటే విస్తీర్ణంలో 3 రెట్లున్న అమెరికాలో 33 కోట్ల‌ జ‌నాభా మాత్ర‌మే ఉంద‌ని.. కానీ మ‌న జ‌నాభా 135 కోట్లు దాటిపోయింద‌ని.. ఈ జ‌నాభాకు త‌గ్గ‌ట్లుగా వ‌న‌రులు లేక భ‌విష్య‌త్తు ఆందోళ‌నక‌రంగా ఉండ‌బోతుందని ఆయ‌న‌ పేర్కొన్నారు.

ప్ర‌స్తుత జ‌నాభాకు త‌గ్గ‌ట్లు ఏడాదికి 25 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌న అవ‌స‌ర‌మ‌వుతోంద‌ని.. అది అసాధ్య‌మైన ప‌ని అని.. జ‌నాభా నియంత్ర‌ణ లేకుంటే భ‌విష్య‌త్ త‌రాల‌కు గ‌డ్డు ప‌రిస్థితులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ముస్లింలు అస‌లు జ‌నాభా నియంత్రణ పాటించ‌కుండా ఇబ్బ‌డిముబ్బ‌డిగా పిల్ల‌ల్ని కంటార‌న్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో వారికి కూడా వర్తించేలా పాపులేష‌న్ కంట్రోల్ లా తేవాల‌న్న డిమాండ్ పెరుగుతోంది. ఈ హ్యాష్ ట్యాగ్‌తో పెద్ద ఎత్తున ట్వీట్లు ప‌డుతున్నాయి. పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. ఈ దిశ‌గా మోడీ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌న్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

Share

Recent Posts

చాట్‌ GPT ఆస్ట్రా 6… భయపడుతున్న యువత

AI వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన GPT-6 ఆస్ట్రా ఆ భయాన్ని మరో…

42 minutes ago

ఒరాంగుటాన్లు… దేశాలు దాటి ఇక్కడికెలా వచ్చాయో..?

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో అటవీ ప్రాంత ఐదు పిల్ల ఒరాంగుటాన్లు కనిపించడం కలకలం రేపింది. బడపై గ్రామం సమీపంలోని రణకథ…

57 minutes ago

ఫౌజీ తప్పుకుంటే… స్పిరిట్ ఏం చేస్తుంది

భయపడినట్టే జరిగేలా ఉంది. డిసెంబర్ 3 అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీని ఫౌజీ వదులుకునేలా ఉంది. ఇంకా షూటింగ్ జరుగుతూ…

1 hour ago

AIతో ఈ దశాబ్దంలోనే మానవాళికి ముప్పు?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజువారీ…

2 hours ago

‘ఎన్నికల్లో చంపడానికైనా… చావడానికైనా సిద్ధం!’

ఏపీలో స్థానిక ఎన్నికల హడావుడి మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండున్నరేళ్ళ తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అధికార,…

2 hours ago

రావణుడితో కాదు గాడ్జిల్లాతో యుద్ధం చేయాలి

అదేంటి రాముడు యుద్ధం చేయాల్సింది రావణుడితో కదా, మరి గాడ్జిల్లాతో ఏంటని ఆశ్చర్యపోకండి. విషయం వేరే ఉంది. నవంబర్ 6…

2 hours ago