Political News

రాజధాని రైతులు కోరుకున్నట్టు వాస్తు ప్రకారమే..

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతుల విష‌యంలో మ‌రోసారి సీఎం చంద్ర‌బాబు త‌న మ‌న‌సు చాటుకున్నారు. రైతుల నుంచి వ‌చ్చిన అభ్యంత‌రాల‌ను ఆయ‌న ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. దీనిలో భాగంగా రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో వీధి శూల ఉన్న 112 ప్లాట్లకు ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపునకు అంగీకరించారు. నిజానికి ఈ స‌మ‌స్య పై గ‌తంలో రైతుల నుంచిపెద్ద ఎత్తున ఫిర్యాదులు, విన్న‌పాలు వ‌చ్చాయి. వీటిని తాజాగా సీఎం చంద్ర‌బాబు ప‌రిష్క‌రించారు.

మంగ‌ళ‌వారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సీఆర్డీఏ 57వ అథారిటీ సమావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎవ‌రైనా స‌రే.. వాస్తు ప్ర‌కార‌మే చూసుకుంటార‌ని.. రైతులు కోరిన‌దానిలో త‌ప్పేమీ లేద‌ని వ్యాఖ్యానించారు. వారికి సంతోషంగా భూములు ఇవ్వాల‌ని సూచించారు.

దీంతో 112 ఫ్లాట్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా మ‌రోచోట ఫ్లాట్ల‌ను కేటాయించాల‌ని అధికారులు నిర్ణ‌యించారు. ఇక‌, ఇదేస‌మ‌యంలో మ‌రో కీల‌క స‌మ‌స్య‌పై కూడా సీఎం చంద్ర‌బాబు చ‌ర్చించారు. రాజధాని లో భూమిలేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్లను ఆ కుటుంబంలో మైనర్లయిన అనాథలకు వర్తింప చేయాల‌ని సూచించారు. ఈ విధానాన్ని త‌క్ష‌ణ‌మే అమ‌లు చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు తేల్చి చెప్పారు.

రైతుల‌ను ప్రియార్టీగా తీసుకుని ముందుకు సాగాల‌న్నారు. అదేవిధంగా రాజధాని ప్రాంతంలోని కృష్ణా నదీ తీరాన్ని మెరీనా బీచ్‌(చెన్నైలో)గా అభివృద్ధి చేయాలనే ప్రతిపాద నలకు కూడా సీఎం చంద్ర‌బాబు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో ప‌ర్యాట‌క హ‌బ్‌లు  ఏర్పాటు చేస్తున్నామ‌ని.. ఇదేస‌మ‌యంలో రాజ‌ధాని ప్రాంతంలో అందుబాటులో ఉన్న కృష్ణాన‌దిని కూడా ప‌ర్యాట‌క ప్రాంతంగా అభివృద్ధి చేయాల‌ని సూచించారు. దీనిలో భాగంగా వాటర్ ఫ్రంట్, జెట్టీలు, టూరిజం లీజర్ బోట్లు, ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్ స్కేప్‌ పనులను చేప‌ట్ట‌నున్నారు.

This post was last modified on January 6, 2026 9:21 pm

Share

Recent Posts

మ‌ళ్లీ తాప్సి మీద ప‌డ్డ కంగ‌న‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన కంగ‌నా ర‌నౌత్‌.. ప‌రిశ్ర‌మ‌లో ఒక స్థాయి అందుకున్న ద‌గ్గ‌ర్నుంచి తాను ప‌ని చేసే ఇండ‌స్ట్రీలోనే…

50 minutes ago

అర్థరహిత సర్వేలతో లాభం లేదు జగన్

రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…

1 hour ago

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…

2 hours ago

స్థానిక ఎన్నిక‌ల్లో… జ‌న‌సేన త్రిముఖ వ్యూహం..!

స్థానిక ఎన్నికల‌పై జ‌న‌సేన త్రిముఖ వ్యూహాన్ని అనుస‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..…

4 hours ago

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…

5 hours ago

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…

13 hours ago