ఏపీ రాజధాని అమరావతి రైతుల విషయంలో మరోసారి సీఎం చంద్రబాబు తన మనసు చాటుకున్నారు. రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను ఆయన పరిష్కరించే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో వీధి శూల ఉన్న 112 ప్లాట్లకు ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపునకు అంగీకరించారు. నిజానికి ఈ సమస్య పై గతంలో రైతుల నుంచిపెద్ద ఎత్తున ఫిర్యాదులు, విన్నపాలు వచ్చాయి. వీటిని తాజాగా సీఎం చంద్రబాబు పరిష్కరించారు.
మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సీఆర్డీఏ 57వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎవరైనా సరే.. వాస్తు ప్రకారమే చూసుకుంటారని.. రైతులు కోరినదానిలో తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. వారికి సంతోషంగా భూములు ఇవ్వాలని సూచించారు.
దీంతో 112 ఫ్లాట్లకు ప్రత్యామ్నాయంగా మరోచోట ఫ్లాట్లను కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. ఇక, ఇదేసమయంలో మరో కీలక సమస్యపై కూడా సీఎం చంద్రబాబు చర్చించారు. రాజధాని లో భూమిలేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్లను ఆ కుటుంబంలో మైనర్లయిన అనాథలకు వర్తింప చేయాలని సూచించారు. ఈ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు.
రైతులను ప్రియార్టీగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. అదేవిధంగా రాజధాని ప్రాంతంలోని కృష్ణా నదీ తీరాన్ని మెరీనా బీచ్(చెన్నైలో)గా అభివృద్ధి చేయాలనే ప్రతిపాద నలకు కూడా సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక హబ్లు ఏర్పాటు చేస్తున్నామని.. ఇదేసమయంలో రాజధాని ప్రాంతంలో అందుబాటులో ఉన్న కృష్ణానదిని కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సూచించారు. దీనిలో భాగంగా వాటర్ ఫ్రంట్, జెట్టీలు, టూరిజం లీజర్ బోట్లు, ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్ స్కేప్ పనులను చేపట్టనున్నారు.
This post was last modified on January 6, 2026 9:21 pm
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.…
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి నాయకుడు ప్రముఖ పారిశ్రామికవేత్త సుజనా చౌదరి ఆదర్శంగా…
ఎల్లుండి విడుదల కాబోతున్న రాజా సాబ్ మన దగ్గర సౌండ్ చేయడంలో ఆశ్చర్యం లేదు కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా…
తనపై వచ్చిన అసత్య కథనంపై ఏపీ మంత్రి నారా లోకేష్ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. విశాఖలోని 12వ అదనపు జిల్లా…
దళపతి విజయ్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది. ఆయన కెరీర్ లోనే చివరి సినిమాగా…
మన శంకరవరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ మేనియాలో మునిగిపోయి పట్టించుకోవడం లేదు కానీ అప్పుడెప్పుడో స్టార్ట్ అయ్యి, ఎప్పుడో అయిపోయిన…