Political News

రాజధాని రైతులు కోరుకున్నట్టు వాస్తు ప్రకారమే..

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతుల విష‌యంలో మ‌రోసారి సీఎం చంద్ర‌బాబు త‌న మ‌న‌సు చాటుకున్నారు. రైతుల నుంచి వ‌చ్చిన అభ్యంత‌రాల‌ను ఆయ‌న ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. దీనిలో భాగంగా రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో వీధి శూల ఉన్న 112 ప్లాట్లకు ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపునకు అంగీకరించారు. నిజానికి ఈ స‌మ‌స్య పై గ‌తంలో రైతుల నుంచిపెద్ద ఎత్తున ఫిర్యాదులు, విన్న‌పాలు వ‌చ్చాయి. వీటిని తాజాగా సీఎం చంద్ర‌బాబు ప‌రిష్క‌రించారు.

మంగ‌ళ‌వారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సీఆర్డీఏ 57వ అథారిటీ సమావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎవ‌రైనా స‌రే.. వాస్తు ప్ర‌కార‌మే చూసుకుంటార‌ని.. రైతులు కోరిన‌దానిలో త‌ప్పేమీ లేద‌ని వ్యాఖ్యానించారు. వారికి సంతోషంగా భూములు ఇవ్వాల‌ని సూచించారు.

దీంతో 112 ఫ్లాట్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా మ‌రోచోట ఫ్లాట్ల‌ను కేటాయించాల‌ని అధికారులు నిర్ణ‌యించారు. ఇక‌, ఇదేస‌మ‌యంలో మ‌రో కీల‌క స‌మ‌స్య‌పై కూడా సీఎం చంద్ర‌బాబు చ‌ర్చించారు. రాజధాని లో భూమిలేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్లను ఆ కుటుంబంలో మైనర్లయిన అనాథలకు వర్తింప చేయాల‌ని సూచించారు. ఈ విధానాన్ని త‌క్ష‌ణ‌మే అమ‌లు చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు తేల్చి చెప్పారు.

రైతుల‌ను ప్రియార్టీగా తీసుకుని ముందుకు సాగాల‌న్నారు. అదేవిధంగా రాజధాని ప్రాంతంలోని కృష్ణా నదీ తీరాన్ని మెరీనా బీచ్‌(చెన్నైలో)గా అభివృద్ధి చేయాలనే ప్రతిపాద నలకు కూడా సీఎం చంద్ర‌బాబు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో ప‌ర్యాట‌క హ‌బ్‌లు  ఏర్పాటు చేస్తున్నామ‌ని.. ఇదేస‌మ‌యంలో రాజ‌ధాని ప్రాంతంలో అందుబాటులో ఉన్న కృష్ణాన‌దిని కూడా ప‌ర్యాట‌క ప్రాంతంగా అభివృద్ధి చేయాల‌ని సూచించారు. దీనిలో భాగంగా వాటర్ ఫ్రంట్, జెట్టీలు, టూరిజం లీజర్ బోట్లు, ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్ స్కేప్‌ పనులను చేప‌ట్ట‌నున్నారు.

This post was last modified on January 6, 2026 9:21 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

7 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

8 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

8 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

10 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

10 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

12 hours ago