తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించుకునే కానుకల హుండీ పరకామణిలో దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. 2021-22 మధ్య కాలంలో రవికుమార్ అనే ఉద్యోగి(కాంట్రాక్టు) 900 డాలర్లను దొంగిలించారు. ఈ విషయం బయటకు వచ్చాక రాజీ చేసుకున్నారు.
దీనిని ప్రశ్నిస్తూ.. తిరుపతికి చెందిన ఓ జర్నలిస్టు.. హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణ జరుగుతోంది. గత విచారణలో పరకామణి లెక్కింపు వ్యవహారంపై తక్షణమే విధానాలు మార్చాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన విచారణలో తిరుమల తిరుపతి దేవస్థానం ఓ నివేదికను కోర్టుకు సమర్పించింది. పరకామణి లెక్కింపు విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నట్టు తెలిపింది. అయితే.. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక ప్రశ్నలు సంధించింది.
తాము చెప్పినట్టుగా మార్పులు చేసేందుకు మీరెందుకు వెనుకాడుతున్నారంటూ.. ప్రశ్నించింది. లెక్కింపు సమయంలో లుంగీలతో భక్తులను అనుమతించేబదులు ప్రత్యామ్నాయ విధానాలు చూడలేరా? అని ప్రశ్నించింది.
అదేవిధంగా నేలపై కూర్చునికాకుండా.. టేబుళ్లు ఏర్పాటు చేసే విధానం పరిశీలించాలని కోరామని.. కానీ దీనిపైనా స్పందించలేదని అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. అదేవిధంగా ఏఐని వినియోగించి లెక్కింపు చేపేట్టే ప్రక్రియపైనా టీటీడీ బోర్డు నిర్ణయం వెల్లడించకపోవడాన్ని కూడా తప్పుబట్టింది.
పరకామణి దొంగతనం కేసులో ప్రమేయం ఇంకెవరెవరికి ఉందని కోర్టు ఆరా తీసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టరాదని.. ప్రతి విషయాన్నీ కూలంకషంగా చర్చించి.. నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పరకామణి కేసు అంటే.. కేవలం ఒకరిద్దరికి సంబంధించిన వ్యవహారం కాదని.. కోట్ల మంది శ్రీవారి భక్తులకు సంబంధించిన కేసుగా హైకోర్టు స్పష్టం చేసింది.
This post was last modified on January 6, 2026 2:50 pm
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…
తెలంగాణ ప్రభుత్వం... పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తామని చెబుతున్న హైదరాబాద్లో గన్ కల్చర్ పెరుగుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వ్యక్తిగతంగా…
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న…