తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించుకునే కానుకల హుండీ పరకామణిలో దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. 2021-22 మధ్య కాలంలో రవికుమార్ అనే ఉద్యోగి(కాంట్రాక్టు) 900 డాలర్లను దొంగిలించారు. ఈ విషయం బయటకు వచ్చాక రాజీ చేసుకున్నారు.
దీనిని ప్రశ్నిస్తూ.. తిరుపతికి చెందిన ఓ జర్నలిస్టు.. హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణ జరుగుతోంది. గత విచారణలో పరకామణి లెక్కింపు వ్యవహారంపై తక్షణమే విధానాలు మార్చాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన విచారణలో తిరుమల తిరుపతి దేవస్థానం ఓ నివేదికను కోర్టుకు సమర్పించింది. పరకామణి లెక్కింపు విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నట్టు తెలిపింది. అయితే.. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక ప్రశ్నలు సంధించింది.
తాము చెప్పినట్టుగా మార్పులు చేసేందుకు మీరెందుకు వెనుకాడుతున్నారంటూ.. ప్రశ్నించింది. లెక్కింపు సమయంలో లుంగీలతో భక్తులను అనుమతించేబదులు ప్రత్యామ్నాయ విధానాలు చూడలేరా? అని ప్రశ్నించింది.
అదేవిధంగా నేలపై కూర్చునికాకుండా.. టేబుళ్లు ఏర్పాటు చేసే విధానం పరిశీలించాలని కోరామని.. కానీ దీనిపైనా స్పందించలేదని అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. అదేవిధంగా ఏఐని వినియోగించి లెక్కింపు చేపేట్టే ప్రక్రియపైనా టీటీడీ బోర్డు నిర్ణయం వెల్లడించకపోవడాన్ని కూడా తప్పుబట్టింది.
పరకామణి దొంగతనం కేసులో ప్రమేయం ఇంకెవరెవరికి ఉందని కోర్టు ఆరా తీసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టరాదని.. ప్రతి విషయాన్నీ కూలంకషంగా చర్చించి.. నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పరకామణి కేసు అంటే.. కేవలం ఒకరిద్దరికి సంబంధించిన వ్యవహారం కాదని.. కోట్ల మంది శ్రీవారి భక్తులకు సంబంధించిన కేసుగా హైకోర్టు స్పష్టం చేసింది.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…