Political News

‘ప‌ర‌కామ‌ణి దొంగ‌తనం.. ఏ ఒక్క‌రినీ వ‌ద‌ల‌ద్దు’

తిరుమ‌ల శ్రీవారికి భ‌క్తులు స‌మ‌ర్పించుకునే కానుకల హుండీ ప‌ర‌కామ‌ణిలో దొంగ‌త‌నం జ‌రిగిన విష‌యం తెలిసిందే. 2021-22 మ‌ధ్య కాలంలో ర‌వికుమార్ అనే ఉద్యోగి(కాంట్రాక్టు) 900 డాల‌ర్ల‌ను దొంగిలించారు. ఈ విష‌యం బ‌య‌ట‌కు వచ్చాక రాజీ చేసుకున్నారు.

దీనిని ప్ర‌శ్నిస్తూ.. తిరుప‌తికి చెందిన ఓ జ‌ర్న‌లిస్టు.. హైకోర్టులో కేసు దాఖ‌లు చేశారు. ఈ కేసు విచార‌ణ జ‌రుగుతోంది. గ‌త విచార‌ణలో ప‌ర‌కామ‌ణి లెక్కింపు వ్య‌వ‌హారంపై త‌క్ష‌ణ‌మే విధానాలు మార్చాల‌ని హైకోర్టు ఆదేశించింది.

ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన విచార‌ణ‌లో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఓ నివేదిక‌ను కోర్టుకు స‌మ‌ర్పించింది. ప‌ర‌కామ‌ణి లెక్కింపు విష‌యంలో కొన్ని మార్పులు చేర్పులు చేయ‌నున్న‌ట్టు తెలిపింది. అయితే.. ఈ సంద‌ర్భంగా హైకోర్టు కొన్ని కీల‌క ప్ర‌శ్న‌లు సంధించింది.

తాము చెప్పిన‌ట్టుగా మార్పులు చేసేందుకు మీరెందుకు వెనుకాడుతున్నారంటూ.. ప్ర‌శ్నించింది. లెక్కింపు స‌మ‌యంలో లుంగీల‌తో భ‌క్తుల‌ను అనుమ‌తించేబ‌దులు ప్ర‌త్యామ్నాయ విధానాలు చూడ‌లేరా? అని ప్ర‌శ్నించింది.

అదేవిధంగా నేల‌పై కూర్చునికాకుండా.. టేబుళ్లు ఏర్పాటు చేసే విధానం ప‌రిశీలించాల‌ని కోరామ‌ని.. కానీ దీనిపైనా స్పందించ‌లేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా ఏఐని వినియోగించి లెక్కింపు చేపేట్టే ప్ర‌క్రియ‌పైనా టీటీడీ బోర్డు నిర్ణ‌యం వెల్ల‌డించ‌క‌పోవ‌డాన్ని కూడా త‌ప్పుబ‌ట్టింది.

ప‌ర‌కామ‌ణి దొంగ‌త‌నం కేసులో ప్ర‌మేయం ఇంకెవ‌రెవ‌రికి ఉంద‌ని కోర్టు ఆరా తీసింది. ఈ కేసులో ప్ర‌మేయం ఉన్న ఏ ఒక్క‌రినీ వ‌దిలి పెట్ట‌రాద‌ని.. ప్ర‌తి విష‌యాన్నీ కూలంక‌షంగా చ‌ర్చించి.. నిర్ణ‌యం తీసుకోవాల‌ని సూచించింది. ప‌ర‌కామ‌ణి కేసు అంటే.. కేవ‌లం ఒక‌రిద్ద‌రికి సంబంధించిన వ్య‌వ‌హారం కాద‌ని.. కోట్ల మంది శ్రీవారి భ‌క్తులకు సంబంధించిన కేసుగా హైకోర్టు స్ప‌ష్టం చేసింది.

This post was last modified on January 6, 2026 2:50 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

44 minutes ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

3 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

5 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

5 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

7 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

7 hours ago