Political News

‘ప‌ర‌కామ‌ణి దొంగ‌తనం.. ఏ ఒక్క‌రినీ వ‌ద‌ల‌ద్దు’

తిరుమ‌ల శ్రీవారికి భ‌క్తులు స‌మ‌ర్పించుకునే కానుకల హుండీ ప‌ర‌కామ‌ణిలో దొంగ‌త‌నం జ‌రిగిన విష‌యం తెలిసిందే. 2021-22 మ‌ధ్య కాలంలో ర‌వికుమార్ అనే ఉద్యోగి(కాంట్రాక్టు) 900 డాల‌ర్ల‌ను దొంగిలించారు. ఈ విష‌యం బ‌య‌ట‌కు వచ్చాక రాజీ చేసుకున్నారు.

దీనిని ప్ర‌శ్నిస్తూ.. తిరుప‌తికి చెందిన ఓ జ‌ర్న‌లిస్టు.. హైకోర్టులో కేసు దాఖ‌లు చేశారు. ఈ కేసు విచార‌ణ జ‌రుగుతోంది. గ‌త విచార‌ణలో ప‌ర‌కామ‌ణి లెక్కింపు వ్య‌వ‌హారంపై త‌క్ష‌ణ‌మే విధానాలు మార్చాల‌ని హైకోర్టు ఆదేశించింది.

ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన విచార‌ణ‌లో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఓ నివేదిక‌ను కోర్టుకు స‌మ‌ర్పించింది. ప‌ర‌కామ‌ణి లెక్కింపు విష‌యంలో కొన్ని మార్పులు చేర్పులు చేయ‌నున్న‌ట్టు తెలిపింది. అయితే.. ఈ సంద‌ర్భంగా హైకోర్టు కొన్ని కీల‌క ప్ర‌శ్న‌లు సంధించింది.

తాము చెప్పిన‌ట్టుగా మార్పులు చేసేందుకు మీరెందుకు వెనుకాడుతున్నారంటూ.. ప్ర‌శ్నించింది. లెక్కింపు స‌మ‌యంలో లుంగీల‌తో భ‌క్తుల‌ను అనుమ‌తించేబ‌దులు ప్ర‌త్యామ్నాయ విధానాలు చూడ‌లేరా? అని ప్ర‌శ్నించింది.

అదేవిధంగా నేల‌పై కూర్చునికాకుండా.. టేబుళ్లు ఏర్పాటు చేసే విధానం ప‌రిశీలించాల‌ని కోరామ‌ని.. కానీ దీనిపైనా స్పందించ‌లేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా ఏఐని వినియోగించి లెక్కింపు చేపేట్టే ప్ర‌క్రియ‌పైనా టీటీడీ బోర్డు నిర్ణ‌యం వెల్ల‌డించ‌క‌పోవ‌డాన్ని కూడా త‌ప్పుబ‌ట్టింది.

ప‌ర‌కామ‌ణి దొంగ‌త‌నం కేసులో ప్ర‌మేయం ఇంకెవ‌రెవ‌రికి ఉంద‌ని కోర్టు ఆరా తీసింది. ఈ కేసులో ప్ర‌మేయం ఉన్న ఏ ఒక్క‌రినీ వ‌దిలి పెట్ట‌రాద‌ని.. ప్ర‌తి విష‌యాన్నీ కూలంక‌షంగా చ‌ర్చించి.. నిర్ణ‌యం తీసుకోవాల‌ని సూచించింది. ప‌ర‌కామ‌ణి కేసు అంటే.. కేవ‌లం ఒక‌రిద్ద‌రికి సంబంధించిన వ్య‌వ‌హారం కాద‌ని.. కోట్ల మంది శ్రీవారి భ‌క్తులకు సంబంధించిన కేసుగా హైకోర్టు స్ప‌ష్టం చేసింది.

Kumar

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

2 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

3 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

4 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

4 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

5 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

5 hours ago