తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించుకునే కానుకల హుండీ పరకామణిలో దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. 2021-22 మధ్య కాలంలో రవికుమార్ అనే ఉద్యోగి(కాంట్రాక్టు) 900 డాలర్లను దొంగిలించారు. ఈ విషయం బయటకు వచ్చాక రాజీ చేసుకున్నారు.
దీనిని ప్రశ్నిస్తూ.. తిరుపతికి చెందిన ఓ జర్నలిస్టు.. హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణ జరుగుతోంది. గత విచారణలో పరకామణి లెక్కింపు వ్యవహారంపై తక్షణమే విధానాలు మార్చాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన విచారణలో తిరుమల తిరుపతి దేవస్థానం ఓ నివేదికను కోర్టుకు సమర్పించింది. పరకామణి లెక్కింపు విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నట్టు తెలిపింది. అయితే.. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక ప్రశ్నలు సంధించింది.
తాము చెప్పినట్టుగా మార్పులు చేసేందుకు మీరెందుకు వెనుకాడుతున్నారంటూ.. ప్రశ్నించింది. లెక్కింపు సమయంలో లుంగీలతో భక్తులను అనుమతించేబదులు ప్రత్యామ్నాయ విధానాలు చూడలేరా? అని ప్రశ్నించింది.
అదేవిధంగా నేలపై కూర్చునికాకుండా.. టేబుళ్లు ఏర్పాటు చేసే విధానం పరిశీలించాలని కోరామని.. కానీ దీనిపైనా స్పందించలేదని అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. అదేవిధంగా ఏఐని వినియోగించి లెక్కింపు చేపేట్టే ప్రక్రియపైనా టీటీడీ బోర్డు నిర్ణయం వెల్లడించకపోవడాన్ని కూడా తప్పుబట్టింది.
పరకామణి దొంగతనం కేసులో ప్రమేయం ఇంకెవరెవరికి ఉందని కోర్టు ఆరా తీసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టరాదని.. ప్రతి విషయాన్నీ కూలంకషంగా చర్చించి.. నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పరకామణి కేసు అంటే.. కేవలం ఒకరిద్దరికి సంబంధించిన వ్యవహారం కాదని.. కోట్ల మంది శ్రీవారి భక్తులకు సంబంధించిన కేసుగా హైకోర్టు స్పష్టం చేసింది.
This post was last modified on January 6, 2026 2:50 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…