వెనిజులాలో అమెరికా చేసిన దాడి ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అక్కడ ప్రభుత్వం మారితే మనకేంటి అని లైట్ తీసుకోకండి. ఈ పరిణామం ఇండియాకు ఒక రకంగా ‘శుభవార్త’ మోసుకొచ్చేలా ఉంది. అక్కడ జరిగే మార్పులు మన స్టాక్ మార్కెట్ కు న్యూట్రల్ గా అనిపించినా, మన ప్రభుత్వ ఆయిల్ కంపెనీలకు మాత్రం కాసుల వర్షం కురిపించే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
అసలు మ్యాటర్ ఏంటంటే.. మన ONGC విదేశ్ లిమిటెడ్ కు వెనిజులా నుంచి రావాల్సిన బకాయిలు చాలానే ఉన్నాయి. అక్కడ అమెరికా ఎంట్రీతో, పెట్రోలియస్ డి వెనిజులా రీస్ట్రక్చరింగ్ జరిగితే.. దాదాపు 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8000 కోట్లు) పెండింగ్ అమౌంట్ రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. 2014 నుంచి డివిడెండ్స్ రూపంలో రావాల్సిన దాదాపు 536 మిలియన్ డాలర్లు అక్కడ ఇరుక్కుపోయాయి. ఇప్పుడు ఆంక్షలు తొలగిపోతే ఆ డబ్బు ఇండియాకు రావడం ఖాయం.
ఇక సామాన్యుడి జేబు విషయానికి వస్తే.. వెనిజులా నుంచి ఆయిల్ సప్లై పెరిగితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ లో ఆయిల్ ధరలు తగ్గడం మన ఎకానమీకి బూస్ట్ ఇస్తుంది. తక్కువ ఆయిల్ ధరలు ఉంటే అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గి, డాలర్ వీక్ అవుతుంది. ఇది మనలాంటి ఎమర్జింగ్ మార్కెట్లకు కలిసొచ్చే అంశం.
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మనం రష్యా ఆయిల్ మీద ఎక్కువగా ఆధారపడ్డాం. ఇప్పుడు వెనిజులా నుంచి ‘హెవీ క్రూడ్ ఆయిల్’ అందుబాటులోకి వస్తే.. మన రిఫైనరీలకు పండగే. ఇది మన ఆయిల్ ఇంపోర్ట్ స్ట్రాటజీని మార్చేసి, రష్యా మీద ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. రిలయన్స్ వంటి కంపెనీలకు కూడా ముడి చమురు సోర్సింగ్ లో ఆప్షన్లు పెరుగుతాయి.
షార్ట్ టర్మ్ లో కొంచెం గందరగోళం ఉన్నా, వెనిజులా ఎపిసోడ్ ఇండియాకు పాజిటివ్ గానే కనిపిస్తోంది. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం సేఫ్ అని నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్ లో ONGC, ఆయిల్ ఇండియా వంటి షేర్ల మీద కన్నేసి ఉంచడం మంచిది. మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నా, సెలెక్టివ్ గా ఇన్వెస్ట్ చేసేవారికి ఇది మంచి టైమ్.
This post was last modified on January 5, 2026 9:49 pm
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…