Political News

మోడీకి ట్రంప్ విషమ పరీక్ష

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విషమ పరీక్షగా మారారా? ట్రంప్ దూకుడు కారణంగా విశ్వగురు మోడీకి ఇబ్బందులు తప్పేలా లేవా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. గత ఏడాది జనవరిలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఒకవైపు శాంతి ప్రవచనాలు చెబుతూనే మరోవైపు ప్రపంచ దేశాలను ఇరకాటంలోకి నెడుతున్నారు.

ఈ క్రమంలోనే గత ఏడాది పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాల కూల్చివేత లక్ష్యంగా జరిగిన ఆపరేషన్ సిందూర్‌ను తానే ఆపేశానని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇలా ఒక్కసారి రెండు సార్లు కాదు ఇప్పటివరకు పది పదిహేను సార్లు ఇదే వ్యాఖ్య చేశారు. ఇది ప్రధాని మోడీకి తీవ్ర ఇబ్బందికరంగా మారింది.

అంతేకాదు భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ట్రంప్ టారిఫ్‌లు పెంచేశారు. కొన్ని వస్తువులపై 70 శాతం మరికొన్నింటిపై 50 శాతం వరకు సుంకాలు విధించారు.

ఇలా వరుసగా భారత్‌ను ఇరుకున పడేసినా మోడీ ఇప్పటివరకు ట్రంప్‌పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విద్యార్థి వీసాల నుంచి హెచ్ వన్ బీ వీసాల వరకు భారత్‌కు కోతలు విధించినా మోడీ స్పందించలేదు. అయితే దేశీయంగా చూస్తే ట్రంప్ దూకుడుపై మోడీకి ఎప్పటికప్పుడు సెగ తగులుతూనే ఉంది.

తాజాగా మరోసారి ట్రంప్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మోడీ మంచి వాడేనని చెప్పిన ట్రంప్ ఆయన వైఖరితో తాను సంతృప్తిగా లేనని కుండబద్దలు కొట్టారు.

ఈ నేపథ్యంలో భారత్‌పై మరింతగా సుంకాల మోత మోగిస్తానంటూ ట్రంప్ చేసిన తాజా ప్రకటన మోడీకి మరిన్ని ఇబ్బందులు తెచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే పెంచిన టారిఫ్‌ల కారణంగా దేశీయంగా ఆక్వా మరియు వజ్రాల పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు మరిన్ని వస్తువులపై సుంకాలు పెంచితే భారతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

ట్రంప్ వ్యాఖ్యలతో ఇప్పటికే స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

This post was last modified on January 5, 2026 2:27 pm

Share
Show comments
Published by
Satya
Tags: ModiTrump

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

1 hour ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

2 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

2 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

4 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

5 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

6 hours ago