ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విషమ పరీక్షగా మారారా? ట్రంప్ దూకుడు కారణంగా విశ్వగురు మోడీకి ఇబ్బందులు తప్పేలా లేవా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. గత ఏడాది జనవరిలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఒకవైపు శాంతి ప్రవచనాలు చెబుతూనే మరోవైపు ప్రపంచ దేశాలను ఇరకాటంలోకి నెడుతున్నారు.
ఈ క్రమంలోనే గత ఏడాది పాకిస్థాన్లోని ఉగ్ర శిబిరాల కూల్చివేత లక్ష్యంగా జరిగిన ఆపరేషన్ సిందూర్ను తానే ఆపేశానని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇలా ఒక్కసారి రెండు సార్లు కాదు ఇప్పటివరకు పది పదిహేను సార్లు ఇదే వ్యాఖ్య చేశారు. ఇది ప్రధాని మోడీకి తీవ్ర ఇబ్బందికరంగా మారింది.
అంతేకాదు భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ట్రంప్ టారిఫ్లు పెంచేశారు. కొన్ని వస్తువులపై 70 శాతం మరికొన్నింటిపై 50 శాతం వరకు సుంకాలు విధించారు.
ఇలా వరుసగా భారత్ను ఇరుకున పడేసినా మోడీ ఇప్పటివరకు ట్రంప్పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విద్యార్థి వీసాల నుంచి హెచ్ వన్ బీ వీసాల వరకు భారత్కు కోతలు విధించినా మోడీ స్పందించలేదు. అయితే దేశీయంగా చూస్తే ట్రంప్ దూకుడుపై మోడీకి ఎప్పటికప్పుడు సెగ తగులుతూనే ఉంది.
తాజాగా మరోసారి ట్రంప్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మోడీ మంచి వాడేనని చెప్పిన ట్రంప్ ఆయన వైఖరితో తాను సంతృప్తిగా లేనని కుండబద్దలు కొట్టారు.
ఈ నేపథ్యంలో భారత్పై మరింతగా సుంకాల మోత మోగిస్తానంటూ ట్రంప్ చేసిన తాజా ప్రకటన మోడీకి మరిన్ని ఇబ్బందులు తెచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే పెంచిన టారిఫ్ల కారణంగా దేశీయంగా ఆక్వా మరియు వజ్రాల పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు మరిన్ని వస్తువులపై సుంకాలు పెంచితే భారతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
ట్రంప్ వ్యాఖ్యలతో ఇప్పటికే స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…