వైసీపీ హయాంలో ప్రజల భూములకు రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటో వేసుకోవడం మొదలు పొలాల రీ సర్వే చేయడం వరకు జగన్ చేసిన పనులకు ప్రజలు తమ భూములు కోల్పోతామేమోనని భయపడ్డారు.
అయితే, కూటమి ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. రైతులు, భూ యజమానుల హక్కుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రైవేట్ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించింది. దాంతోపాటు రాష్ట్రంలోని మరో 4 రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగించబోతున్నామని తెలిపింది. రైతులకు కొత్త సంవత్సర కానుక ఇస్తూ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ ప్రకటన చేశారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
ప్రైవేట్ పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు ఉపేక్షించవద్దని, దానిని సుమోటోగా తీసుకోవాలని ఆదేశించారు. సైనిక, మాజీ సైనిక ఉద్యోగుల, స్వాతంత్య్ర సమరయోధుల భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులు, భూ యాజమానుల హక్కుల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల భూములకు రక్షణ కల్పిస్తామని భరోసానిచ్చారు.
This post was last modified on January 1, 2026 2:57 pm
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…
సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…
దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు రెండు…