Political News

ఆ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

వైసీపీ హయాంలో ప్రజల భూములకు రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటో వేసుకోవడం మొదలు పొలాల రీ సర్వే చేయడం వరకు జగన్ చేసిన పనులకు ప్రజలు తమ భూములు కోల్పోతామేమోనని భయపడ్డారు.

అయితే, కూటమి ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. రైతులు, భూ యజమానుల హక్కుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రైవేట్ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించింది. దాంతోపాటు రాష్ట్రంలోని మరో 4 రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగించబోతున్నామని తెలిపింది. రైతులకు కొత్త సంవత్సర కానుక ఇస్తూ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ ప్రకటన చేశారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

ప్రైవేట్ పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు ఉపేక్షించవద్దని, దానిని సుమోటోగా తీసుకోవాలని ఆదేశించారు. సైనిక, మాజీ సైనిక ఉద్యోగుల, స్వాతంత్య్ర సమరయోధుల భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులు, భూ యాజమానుల హక్కుల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల భూములకు రక్షణ కల్పిస్తామని భరోసానిచ్చారు.

This post was last modified on January 1, 2026 2:57 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

54 minutes ago

మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…

3 hours ago

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

5 hours ago

అఖిల్ అభిమానులు ఈసారి ఒప్పుకోరు

షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…

6 hours ago

చెప్పుతెగుద్ది… సీత‌క్క బ్లాస్ట్‌!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న నాయ‌కురాలు.. గిరిజ‌న నేత సీత‌క్క‌(అన‌సూయ‌) ఒక్క‌సారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…

6 hours ago

మహిళల వీడియోలతో చెలగాటం… ఏఎస్సై సస్పెండ్

పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…

6 hours ago