Political News

వీళ్ల‌ను ఏం చేయాలి?… చంద్ర‌బాబు విస్మ‌యం!

ఏపీలో అరాచ‌కాలు ఆగ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయిన వారిని ప్ర‌భుత్వం దారిలోకి తీసుకువ‌చ్చింది. ప్ర‌భుత్వంపైనా.. నాయ‌కులు, మంత్రుల‌పైనా నోరు చేసుకున్న వారికి చ‌ట్టం రుచి చూపించి.. స‌రిచేసే ప్ర‌య‌త్నం చేసింది. అయితే.. స‌ర్కారుకు స‌మ‌స్య‌లు రోజు కోరకంగా వ‌స్తున్నాయి.

గతంలో అడ్డు అదుపు లేకుండా.. ఆల‌యాల‌పై దాడులు జ‌రిగిన విష‌యం తెలిసిందే. అంత‌ర్వేది ఆల‌య ర‌థానికినిప్పు పెట్ట‌డంతోపాటు.. విజ‌య‌వాడ దుర్గ‌మ్మ ఆల‌యానికి చెందిన ర‌ధాల‌కు ఉన్న వెండి సింహాల‌ను దొంగించారు.

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని రామ‌తీర్థంలో ఉన్న శ్రీరాముడి విగ్ర‌హం త‌లను ఛేదించారు. ఇక‌, మ‌రిన్ని ఘ‌ట న‌లు కూడా చోటు చేసుకున్నాయి. అయితే.. అప్ప‌ట్లో గత ప్రభుత్వం ఆయా నిందితుల‌పై క‌ఠినంగా వ్య‌వ‌హరింలేద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో ఇలాంటి అరాచ‌కాలు.. ఆగిన‌ట్టే ఆగి.. ఇప్పుడు మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చాయి.

తాజాగా ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో మ‌హాప‌రాథం చోటు చేసుకుంది. దీనిపై సీఎం చంద్ర‌బాబు విస్మ‌యం వ్య‌క్తం చేశారు. వీళ్ల‌ను ఏం చేయాలంటూ.. ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది?

ద్రాక్షారామంలోని ప్ర‌ఖ్యాత భీమేశ్వ‌రాల‌యంలో ఉత్తర గోపురం స‌మీపంలోని సప్తగోదావరి న‌ది ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి ఆల‌యంలో శివ‌ లింగాన్ని కొంద‌రు దుండ‌గులు ధ్వంసం చేశారు. శివ‌లింగాన్ని పెకలించ‌డంతోపాటు.. పాన‌వ‌ట్టాన్ని తీసుకువ‌చ్చి.. స‌మీపంలోని మురుగు కాల్వ‌లో ప‌డేశారు. ఈ ఘ‌ట‌నతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. పోలీసులు రంగంలోకి దిగి.. ఆధారాలు సేకరించారు. గతంలో జ‌రిగిన ఘ‌ట‌న‌లు.. అప్ప‌టి నిందితుల‌పై దృష్టి పెట్టారు.

ఇదిలావుంటే.. ఈ ఘ‌ట‌న విష‌యం తెలిసిన సీఎం చంద్ర‌బాబు వెంట‌నే స్పందించారు. అటు మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, ఇటు అధికారుల‌తోనూ ఆయ‌న మాట్లాడారు. ధ్వంసమైన శివలింగం స్థానంలో మరో లింగాన్ని ప్రతిష్ఠించాల‌ని ఆదేశించ‌డంతో మ‌రో శివ‌లింగాన్ని ప్ర‌తిష్టించారు.

ఇదేస‌మ‌యంలో ఈ దాడికి పాల్ప‌డిన వారు ఎంతటి వారైనా.. చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు. ఇదేస‌మ‌యం లో ఇలాంటి నేరాల‌కు పాల్ప‌డిన వారిని ఏం చేయాల‌న్న దానిపై ఆయ‌న విస్మ‌యం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌ను ప్రేరేపించేలా ఉన్న ఈఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. 

This post was last modified on January 1, 2026 1:00 am

Share

Recent Posts

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

35 minutes ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

1 hour ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

1 hour ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

2 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

4 hours ago

చంద్రబాబు విజనరీ గ్రేట్… దక్షిణాది సీఎంల ప్రశంసలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…

5 hours ago