అసలే సంక్రాంతి పోటీ తీవ్రంగా ఉంది. ఒకటి రెండు కాదు ఏకంగా అరడజను సినిమాలు పోటీలో ఉండటం వల్ల ప్రమోషన్ల పరంగా ఎవరికి వారు నువ్వా నేనానే రీతిలో ప్లాన్ చేసుకుంటున్నారు. రాజా సాబ్ హైదరాబాద్ లో ఈవెంట్ చేస్తే మన శంకరవరప్రసాద్ గారు గుంటూరు వెళ్లి మెగా విక్టరీ సాంగ్ లాంచ్ చేసుకున్నారు.
అనగనగా ఒక రాజు భాగ్యనగరం నుంచి భీమవరం దాకా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడికి దూసుకెళ్ళిపోతున్నాడు. భర్త మహాశయులకు విజ్ఞప్తి ఇంత హడావిడి చేయకపోయినా ఉన్నంతలో రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ, పాటలు వదులుతూ సోషల్ మీడియాలో ఏదో ఒక సౌండ్ ఉండేలా చూసుకుంటోంది.
ఇక పండగ బరిలో అందరికంటే లాస్ట్ వస్తున్న నారి నారి నడుమ మురారి కొంచెం మౌనం, ఎక్కువ శబ్దం తరహాలో నెమ్మదిగా వెళ్తోంది. అయిదు రోజుల ముందు రచయిత భాను భోగవరపుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తర్వాత మళ్ళీ ఏ అప్డేట్ లేదు. ఆ పోస్టర్ లో కూడా విడుదల తేదీ లేకపోవడం గమనించాల్సిన విషయం.
ఇంతకు ముందు జనవరి 14 సాయంత్రం ప్రీమియర్లతో విడుదల ఉంటుందని టైం, ముహూర్తంతో సహా ప్రకటించిన టీమ్ ఇప్పుడీ తేదీని మాయం చేయడం వెనుక మర్మం ఏమిటో అంతు చిక్కడం లేదు. పబ్లిసిటీలో ఇలా అయిదేసి రోజులు గ్యాప్ ఇవ్వడం ఎంత మాత్రం సేఫ్ కాదు.
సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన నారి నారి నడుమ మురారిలో సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. కాకతాళీయంగా రవితేజ మూవీతో పాటు ఇందులోనూ డబుల్ హీరోయిన్ల మధ్య నలిగిపోయే సింగల్ హీరో ఫార్ములా ఉండటం అసలు ట్విస్ట్.
పండగ బరిలో ఉండటం ఫిక్స్ అనుకుంటే మాత్రం శర్వానంద్ బృందం ఇంకేదో స్పెషల్ అనిపించేది చేయాలి. కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా కాంపిటీషన్ ని మరీ తక్కువంచనా వేయకూడదు. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చారు.
This post was last modified on December 31, 2025 1:02 pm
సాధారణంగా.. ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు వస్తాయి. కానీ.. ఏపీ విషయాన్ని గమనిస్తే.. 2025లో మెజారిటీ పార్ట్ అంతా కూడా.. పెట్టుబడుల…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ను రెచ్చగొట్టాలని కొన్ని శక్తులు చూస్తున్నాయని టీడీపీ సీనియర్ నేత,…
నూతన సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ.. 2025కు వీడ్కోలు చెబుతూ.. నిర్వహించుకునే కార్యక్రమాల్లో మందు బాబులు రెచ్చిపోవడం ఖాయం. ముఖ్యంగా…
శివరాజ్ కుమార్ కన్నడలో సీనియర్ స్టార్ హీరో అయినప్పటికీ మనకు ఎక్కువ కనెక్ట్ కావడం మొదలయ్యింది జైలర్ తర్వాతే. రామ్…
ఏపీలో జనవరి నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఒక రోజు ముందుగానే అమలు చేసింది.…
ఈ ఏడాది మొత్తం రాష్ట్రంలోని ప్రభుత్వ పాలనను గమనిస్తే మంత్రి నారా లోకేష్ కేంద్రంగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకరకంగా…