Political News

అసెంబ్లీలో: జగన్ ను ఫాలో అయిన కేసీఆర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ల మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి నుంచి ఒక లెక్క…ఇకపై ఒక లెక్క అని కేసీఆర్ చెప్పడంతో నేటి నుంచి జరగుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని ప్రచారం జరిగింది.

ఆ ప్రచారానికి తగ్గట్లుగానే దాదాపు రెండేళ్ల తర్వాత కేసీఆర్ శాసన సభలో అడుగుపెట్టారు. అయితే, సమావేశాలు మొదలైన 10 నిమిషాలకే కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు.

ఈ రోజు అసెంబ్లీలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న రీతిలో మాటల యుద్ధం ఉంటుందని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా కేసీఆర్ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం పెట్టి సభ మొదలైన10 నిమిషాల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అంతకుముందు, కేసీఆర్ కు రేవంత్ షేక్ హ్యాండ్ ఇచ్చి మర్యాదపూర్వకంగా పలకరించారని తెలుస్తోంది. కేసీఆర్ ఆరోగ్య, యోగక్షేమాలను రేవంత్ అడిగి తెలుసుకున్నారట.

అంతకుముందు సభలో దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మా రెడ్డిలకు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. సభ్యులంతా వారికి సంతాపం తెలిపారు. సంతాప తీర్మానాలు అయిపోయిన వెంటనే కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు.

అయితే, రేపు లేదా ఈ శీతాకాల సమావేశాలు ముగిసేలోపు మరోసారి సభకు కేసీఆర్ వస్తారా? లేక డైరెక్ట్ గా వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా అన్న విషయంపై ఉత్కంఠ ఏర్పడింది. అయితే, అటెండెన్స్ కోసం మాత్రమే అసెంబ్లీకి వచ్చే ట్రెండ్ ను ఏపీ మాజీ సీఎం జగన్ స్టార్ట్ చేశారని, అదే రీతిలో జగన్ ను కేసీఆర్ ఫాలో అయ్యారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

This post was last modified on December 29, 2025 11:32 am

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

14 minutes ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

1 hour ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

1 hour ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

3 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

4 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

5 hours ago