Political News

అసెంబ్లీలో: జగన్ ను ఫాలో అయిన కేసీఆర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ల మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి నుంచి ఒక లెక్క…ఇకపై ఒక లెక్క అని కేసీఆర్ చెప్పడంతో నేటి నుంచి జరగుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని ప్రచారం జరిగింది.

ఆ ప్రచారానికి తగ్గట్లుగానే దాదాపు రెండేళ్ల తర్వాత కేసీఆర్ శాసన సభలో అడుగుపెట్టారు. అయితే, సమావేశాలు మొదలైన 10 నిమిషాలకే కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు.

ఈ రోజు అసెంబ్లీలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న రీతిలో మాటల యుద్ధం ఉంటుందని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా కేసీఆర్ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం పెట్టి సభ మొదలైన10 నిమిషాల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అంతకుముందు, కేసీఆర్ కు రేవంత్ షేక్ హ్యాండ్ ఇచ్చి మర్యాదపూర్వకంగా పలకరించారని తెలుస్తోంది. కేసీఆర్ ఆరోగ్య, యోగక్షేమాలను రేవంత్ అడిగి తెలుసుకున్నారట.

అంతకుముందు సభలో దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మా రెడ్డిలకు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. సభ్యులంతా వారికి సంతాపం తెలిపారు. సంతాప తీర్మానాలు అయిపోయిన వెంటనే కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు.

అయితే, రేపు లేదా ఈ శీతాకాల సమావేశాలు ముగిసేలోపు మరోసారి సభకు కేసీఆర్ వస్తారా? లేక డైరెక్ట్ గా వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా అన్న విషయంపై ఉత్కంఠ ఏర్పడింది. అయితే, అటెండెన్స్ కోసం మాత్రమే అసెంబ్లీకి వచ్చే ట్రెండ్ ను ఏపీ మాజీ సీఎం జగన్ స్టార్ట్ చేశారని, అదే రీతిలో జగన్ ను కేసీఆర్ ఫాలో అయ్యారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

This post was last modified on December 29, 2025 11:32 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అల్లు హీరో పెళ్లి డేట్.. ఇలా కూడా అనౌన్స్ చేస్తారా?

టాలీవుడ్లో మరో సెలబ్రెటీ పెళ్లికి రంగం సిద్ధమైంది. అల్లు అరవింద్ కొడుకుల్లో అందరి కంటే చిన్నవాడైన శిరీష్ ఒక ఇంటివాడు…

4 minutes ago

రాజమౌళి సినిమా తర్వాత హీరోలే నిర్మాతలు

మాములుగా రాజమౌళితో స్టార్ హీరోలు సినిమా చేస్తే ఆ తర్వాత మూవీ డిజాస్టర్ అవుతుందనే సెంటిమెంట్ కొన్ని సంవత్సరాల పాటు…

19 minutes ago

మళ్లీ ఈ బ్రేకేంటి రాజాసాబ్?

ప్రభాస్ కొత్త సినిమా ‘రాజాసాబ్’ ఈ ఏడాది వేసవిలోనే విడుదల కావాల్సింది. కానీ ఏడాది చివరికి వాయిదా వేశారు. అయితే…

1 hour ago

అందాల అరకు హౌస్ ఫుల్

తూర్పు కనుమల నడుమ ప్రకృతి సోయగాలతో విరజిల్లుతున్న అరకు వ్యాలీ వరుస సెలవులు, ఇయర్ ఎండ్ వేడుకల నేపథ్యంలో పర్యాటకులతో…

1 hour ago

మూడో ప్ర‌పంచ యుద్ధం త‌ప్ప‌దు: బాబా వాంగా భ‌విష్య‌వాణి

బాబా వాంగా.. అంత‌ర్జాతీయంగా పేరున్న సిద్ధాంతి. భ‌విష్య‌వాణిని వినిపించ‌డంలో సుప్ర‌సిద్ధురాలు. పూర్తిగా అంధురాలైన బాబా వాంగాకు ప్ర‌పంచ స్థాయిలో ఫాలోయింగ్…

3 hours ago

రేవంత్ గ్రాఫ్.. 2025లో కీల‌క ఘ‌ట్టాలు

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా.. బాధ్య‌త‌లు చేప‌ట్టిన రేవంత్ రెడ్డి.. ఈ ఏడాది కీల‌క ఘ‌ట్టాల‌తో త‌న గ్రాఫ్‌ను పెంచుకున్నారు. ముఖ్యంగా నాలుగు…

5 hours ago