సోషల్ మీడియా కాలంలో రోడ్డు మీద ఏదైనా దౌర్జన్యం చేసి తప్పించుకోవాలని చూస్తే కష్టమే. ముఖ్యంగా అధికారంలో ఉన్నామన్న పొగరును కింది వాళ్లపై చూపిస్తే.. అది పొరబాటున ఎవరి ఫోన్లో అయినా రికార్డయితే అంతే సంగతులు. ఇలాంటి ఉదంతాలతో పొలిటికల్ కెరీర్లే ముగిసిపోయిన సందర్భాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ ఛైర్పర్సన్ దేవళ్ల రేవతి పరిస్థితి ఇలాగే ఉందిప్పుడు.
ఆమె రెండు రోజుల కిందట గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ దగ్గర హంగామా చేశారు. టోల్ ఫీజు చెల్లించాలని అడిగిన సిబ్బందిపై తన జులుం చూపించారు. కారుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను పక్కకు తీసి పడేసి, తనను అడ్డగించిన సిబ్బందిపై చేయి కూడా చేసుకున్నారు. నన్నే టోల్ కట్టమంటావా అంటూ ఆమె పరుష పదజాలంతో దూషించడం కూడా వీడియోలో రికార్డయింది. ఈ వీడియో సోషల్ మీడియాకు ఎక్కడం, వైరల్ కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. వ్యవహారం జాతీయ మీడియా దృష్టికి కూడా వెళ్లింది.
ఈ ఉదంతం రేవతికి మాత్రమే కాదు.. ప్రభుత్వానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో రేవతి మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గుంటూరులో ఉన్న తన తల్లి బాత్రూంలో పడిపోయి కాలు బెణికిందని, ఆమెను చూసేందుకు హడావుడిగా వెళ్తున్న సమయంలో తనను టోల్ గేట్ సిబ్బంది అడ్డగించడంతో తనకు కోపం వచ్చిందని ఆమె అంది.
తన దగ్గర ఫ్రీ పాస్ ఉందన్నా వాళ్లు ఒప్పుకోలేదని, ఎమర్జెన్సీలో వెళ్తున్న వాహనాలకు దారి ఇవ్వాలన్న జ్ఞానం లేకుండా దురుసుగా ప్రవర్తించడంతోనే తాను అలా ప్రవర్తించాల్సి వచ్చిందని రేవతి వివరించారు. ఒక మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన టోల్ ప్లాజా సిబ్బందిని ఏమీ అనకుండా తన గురించి దుష్ప్రచారం చేయడమేంటని.. టోల్ ప్లాజా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తాను డీజీపీకి ఫిర్యాదు చేస్తానని ఆమె అన్నారు. ఐతే రేవతి ఇచ్చిన వివరణ పట్ల సోషల్ మీడియా జనం ఎంతమాత్రం సంతృప్తి చెందలేదని, ఆమె వివరణ వాస్తవికంగా లేదని.. సదరు పోస్టు కింద కామెంట్లు చూస్తే స్పష్టమవుతోంది.
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…