Political News

టోల్ గేట్ వివాదం.. ఆవిడ గారి వివరణ ఇది

సోషల్ మీడియా కాలంలో రోడ్డు మీద ఏదైనా దౌర్జన్యం చేసి తప్పించుకోవాలని చూస్తే కష్టమే. ముఖ్యంగా అధికారంలో ఉన్నామన్న పొగరును కింది వాళ్లపై చూపిస్తే.. అది పొరబాటున ఎవరి ఫోన్లో అయినా రికార్డయితే అంతే సంగతులు. ఇలాంటి ఉదంతాలతో పొలిటికల్ కెరీర్లే ముగిసిపోయిన సందర్భాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ దేవళ్ల రేవతి పరిస్థితి ఇలాగే ఉందిప్పుడు.

ఆమె రెండు రోజుల కిందట గుంటూరు జిల్లా కాజా టోల్‌గేట్‌ దగ్గర హంగామా చేశారు. టోల్‌ ఫీజు చెల్లించాలని అడిగిన సిబ్బందిపై తన జులుం చూపించారు. కారుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను పక్కకు తీసి పడేసి, తనను అడ్డగించిన సిబ్బందిపై చేయి కూడా చేసుకున్నారు. నన్నే టోల్ కట్టమంటావా అంటూ ఆమె పరుష పదజాలంతో దూషించడం కూడా వీడియోలో రికార్డయింది. ఈ వీడియో సోషల్ మీడియాకు ఎక్కడం, వైరల్ కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. వ్యవహారం జాతీయ మీడియా దృష్టికి కూడా వెళ్లింది.

ఈ ఉదంతం రేవతికి మాత్రమే కాదు.. ప్రభుత్వానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో రేవతి మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గుంటూరులో ఉన్న తన తల్లి బాత్రూంలో పడిపోయి కాలు బెణికిందని, ఆమెను చూసేందుకు హడావుడిగా వెళ్తున్న సమయంలో తనను టోల్ గేట్ సిబ్బంది అడ్డగించడంతో తనకు కోపం వచ్చిందని ఆమె అంది.

తన దగ్గర ఫ్రీ పాస్ ఉందన్నా వాళ్లు ఒప్పుకోలేదని, ఎమర్జెన్సీలో వెళ్తున్న వాహనాలకు దారి ఇవ్వాలన్న జ్ఞానం లేకుండా దురుసుగా ప్రవర్తించడంతోనే తాను అలా ప్రవర్తించాల్సి వచ్చిందని రేవతి వివరించారు. ఒక మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన టోల్ ప్లాజా సిబ్బందిని ఏమీ అనకుండా తన గురించి దుష్ప్రచారం చేయడమేంటని.. టోల్ ప్లాజా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తాను డీజీపీకి ఫిర్యాదు చేస్తానని ఆమె అన్నారు. ఐతే రేవతి ఇచ్చిన వివరణ పట్ల సోషల్ మీడియా జనం ఎంతమాత్రం సంతృప్తి చెందలేదని, ఆమె వివరణ వాస్తవికంగా లేదని.. సదరు పోస్టు కింద కామెంట్లు చూస్తే స్పష్టమవుతోంది.

This post was last modified on December 11, 2020 2:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

34 minutes ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

49 minutes ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

2 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

4 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

4 hours ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

4 hours ago