ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్రంగా ఊహించని ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. పైకి ఇది ఎంతో ఆకర్షణీయంగానే ఉన్నప్పటికీ…లోలోపల ప్రమాదకరమైన స్కీం కావడం గమనార్హం. ఇంకా చెప్పాలంటే స్కీం పేరుతో జరుగుతున్న స్కాం.
లాక్ డౌన్ కారణంగా నిరుపేదలకు ఎటువంటి పనులు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకునేందుకు కేంద్రం రాష్ట్రీయ శిక్షిత్ బెరోజ్గార్ యోజన పేరుతో భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిందంటూ ఓ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ పథకం రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమేనని, వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొంటున్నారు. అయితే, ఇది పెద్ద స్కాం.
సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం ప్రకారం, రేషన్ కార్డు కలిగి ఉన్న రోజువారీ కూలీలు, రైతులు, నిరుద్యోగ యువతకు నేరుగా అకౌంట్ లో రూ.50 వేలు డిపాజిట్ చేయబోతోందని, అయితే 40 వేల మందికి మాత్రమే ఈ పథకం అమలు చేయబోతోందని, ముందుగా ఆర్ఎస్బీవై వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకున్న వారికే ఈ చాన్స్ అంటూ వాట్సాప్, సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. అయితే, ఇదంతా ఓ స్కామ్. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది.
పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఏర్పాటు చేసిన ఓ వేదిక ద్వారా, కేంద్రం రూ.50 వేల ఆర్థిక సాయం చేసేందుకు ఎటువంటి స్కీమ్ ప్రారంభించలేదని స్పష్టం చేసింది. ఇలాంటి మెసేజ్లను నమ్మొద్దని, ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది ఫేక్ మెసేజ్ అని స్పష్టం చేసింది. అందులో చెప్పినట్టుగా ఎటువంటి వెబ్ సైట్లలోనూ వ్యక్తిగత వివరాల నమోదు గానీ, ఫీజు చెల్లింపులు కానీ చేయొద్దని సూచించింది. ఒకవేళ వివరాలు ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది.
కొన్ని కార్యక్రమాల వేళ.. కొన్ని అంశాలకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారీ…
తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు మీ…
గత వారం రోజులకు పైగా తిరుగుతున్న లీకులకు అధికారిక ముద్ర పడిపోయింది. టాక్సిక్ జూన్ 4 నుంచి వాయిదా వేస్తున్నట్టు…
నవ్యాంద్రప్రదేశ్ లో అధికార కూటమి రథ సారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుదవారం నుంచి నవ శకం మొదలు…
లెనిన్ గురించి అప్డేట్స్ లేక అసహనానికి గురవుతున్న అభిమానులకు ఊరట కలిగిస్తూ నాగార్జున ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్…
ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘గాయపడ్డ సింహం’. డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ తరుణ్ భాస్కర్…