Political News

అమ‌రావ‌తి.. @ 2025 ..!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి 2025 ఓ మ‌హ‌త్త‌ర సంవ‌త్స‌ర‌మేన‌ని చెప్పాలి. 2014-19 మ‌ధ్య ఏపీ రాజ‌ధానిగా ఏర్పడిన అమ‌రావ‌తి.. త‌ర్వాత వైసీపీ హ‌యాంలో వెనుక‌బ‌డింది. అస‌లు దీనిని లేకుండా చేయాల‌ని.. మూడు రాజ‌ధానుల‌ను తీసుకురావాల‌ని వైసీపీ ప్ర‌య‌త్నించింది. కానీ, రాజ‌ధాని రైతులు మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా గ‌ళం వినిపించారు. ఇక‌, ఈ ఏడాది రాజ‌ధాని ప‌నుల‌ను ప్రారంభించారు. సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా చొర‌వ తీసుకోవ‌డంతో ఈ ప‌నులు తిరిగి గాడిలో పెట్టారు.

42 వేల కోట్ల ప‌నులు..
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి సంబంధించి అటు ఆర్బీఐ నుంచి ఇటు ప్రైవేటు సంస్థ‌ల నుంచి అదేవిధంగా ప్ర‌పంచ బ్యాంకు నుంచి కూడా నిధులు అందాయి. మొత్తం 15 వేల కోట్ల రూపాయ‌ల మేర‌కు ఒక్కొక్క సంస్థ నుంచి రుణాల రూపంలో సేక‌రించారు. అదేవిధంగా ప‌నుల ప్రారంభాన్ని కూడా చేప‌ట్టారు. స్వ‌యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌చ్చి.. రాజ‌ధాని నిర్మాణ ప‌నుల‌కు మ‌రోసారి శంకు స్థాప‌న చేశారు. ఇక‌, రాజ‌ధానిలో నిర్మాణాల‌కు సంబంధించి 42 వేల కోట్ల ప‌నుల‌కు సీఆర్ డీఏ అనుమ‌తులు మంజూరు చేసింది. దీంతో రేయింబ‌వ‌ళ్లు ప‌నులు ముందుకు సాగుతున్నాయి.

పెట్టుబ‌డులు..
రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల్లో ఎలా అయితే.. పెట్టుబ‌డులు ఆక‌ర్షిస్తున్నారో.. అమ‌రావ‌తి రాజ‌ధాని విషయంలోనూ రాష్ట్రం పెట్టుబ‌డుల‌కు పెద్ద‌పీట వేస్తోంది. దీనిలో భాగంగానే రాజ‌ధానిలో పెట్టుబ‌డుల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక‌, ప్ర‌స్తుతం ఉన్న 33 వేల ఎక‌రాల భూముల‌కు అద‌నంగా మ‌రో 44 వేల ఎక‌రాలను స‌మీక‌రించే ప్ర‌క్రియ‌ను కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ ఏడాదే శ్రీకారం చుట్టింది. తొలినాళ్ల‌లో ఇది వివాదం అయినా.. స్వ‌యంగా చంద్ర‌బాబు రైతుల‌తో మాట్లాడి ఒప్పించే ప్ర‌య‌త్నం చేశారు. ఇది కూడా అమ‌రావ‌తి ఉన్న‌తిని ముందుకు తీసుకువెళ్లింది.

ప‌లు సంస్థ‌లు..
అమ‌రావ‌తిలో కేవ‌లం ప్ర‌భుత్వ సంస్థ‌లే కాకుండా.. ఇత‌ర సంస్థ‌లు కూడా ముందుకు వ‌చ్చాయి. వీటిలో ప్ర‌ధానంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అచ్చంగా తిరుమ‌ల‌ను పోలి ఉండే టెంపుల్ నిర్మాణాన్ని ప్రారంభించింది. వాస్త‌వానికి .. వైసీపీ హ‌యాంలో నిలిచిపోయిన ప‌నులు తిరిగి పుంజుకున్నాయి. దీనికి తోడు మ‌రింత విస్త‌రించారు. అదేవిధంగా విద్యాసంస్థ‌ల‌తోపాటు.. హిందూపురం ఎమ్మెల్యే బాల‌య్య చైర్మ‌న్‌గా ఉన్న నంద‌మూరి బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆసుప‌త్రికి కూడా భూమిపూజ జ‌రిగింది.. నిర్మాణాలు చేప‌ట్టింది కూడా ఈ సంవ‌త్స‌ర‌మే కావ‌డం విశేషం.

అదేవిధంగా స్పోర్ట్స్ సిటీలో ప్ర‌ముఖ బ్యాడ్ మింట‌న్ క్రీడాకారుడు… పుల్లెల గోపీచంద్ కూడా.. క్రీడా కేంద్రానికి శంకుస్థాప‌న చేశారు. మొత్తంగా 2025 సంవ‌త్స‌రం అమ‌రావ‌తికి మ‌హ‌ర్ద‌శ ప‌ట్టేలా చేసింద‌న‌డంలో సందేహం లేదు.

This post was last modified on December 27, 2025 1:18 pm

Share

Recent Posts

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

5 hours ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

5 hours ago

శర్వానంద్ రిలీజులకు కొత్త చిక్కుముడి

శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…

5 hours ago

ఊర్మిళను పెళ్లాడిన వర్మ?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…

5 hours ago

భోగాపురం క్రెడిట్ కోసం వైసీపీ తంటాలు…

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఏపీ ప్ర‌జ‌లు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోష‌ల్ మీడియా ఊద‌ర గొడుతోంది. అంతేకాదు.. గ‌త…

6 hours ago

స్పైడర్ మ్యాన్ సక్సెస్… ఏ పాఠం నేర్చుకోవాలి

సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…

7 hours ago