ఏపీ రాజధాని అమరావతికి 2025 ఓ మహత్తర సంవత్సరమేనని చెప్పాలి. 2014-19 మధ్య ఏపీ రాజధానిగా ఏర్పడిన అమరావతి.. తర్వాత వైసీపీ హయాంలో వెనుకబడింది. అసలు దీనిని లేకుండా చేయాలని.. మూడు రాజధానులను తీసుకురావాలని వైసీపీ ప్రయత్నించింది. కానీ, రాజధాని రైతులు మూడు రాజధానులకు వ్యతిరేకంగా గళం వినిపించారు. ఇక, ఈ ఏడాది రాజధాని పనులను ప్రారంభించారు. సీఎం చంద్రబాబు స్వయంగా చొరవ తీసుకోవడంతో ఈ పనులు తిరిగి గాడిలో పెట్టారు.
42 వేల కోట్ల పనులు..
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి అటు ఆర్బీఐ నుంచి ఇటు ప్రైవేటు సంస్థల నుంచి అదేవిధంగా ప్రపంచ బ్యాంకు నుంచి కూడా నిధులు అందాయి. మొత్తం 15 వేల కోట్ల రూపాయల మేరకు ఒక్కొక్క సంస్థ నుంచి రుణాల రూపంలో సేకరించారు. అదేవిధంగా పనుల ప్రారంభాన్ని కూడా చేపట్టారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి.. రాజధాని నిర్మాణ పనులకు మరోసారి శంకు స్థాపన చేశారు. ఇక, రాజధానిలో నిర్మాణాలకు సంబంధించి 42 వేల కోట్ల పనులకు సీఆర్ డీఏ అనుమతులు మంజూరు చేసింది. దీంతో రేయింబవళ్లు పనులు ముందుకు సాగుతున్నాయి.
పెట్టుబడులు..
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఎలా అయితే.. పెట్టుబడులు ఆకర్షిస్తున్నారో.. అమరావతి రాజధాని విషయంలోనూ రాష్ట్రం పెట్టుబడులకు పెద్దపీట వేస్తోంది. దీనిలో భాగంగానే రాజధానిలో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక, ప్రస్తుతం ఉన్న 33 వేల ఎకరాల భూములకు అదనంగా మరో 44 వేల ఎకరాలను సమీకరించే ప్రక్రియను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదే శ్రీకారం చుట్టింది. తొలినాళ్లలో ఇది వివాదం అయినా.. స్వయంగా చంద్రబాబు రైతులతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇది కూడా అమరావతి ఉన్నతిని ముందుకు తీసుకువెళ్లింది.
పలు సంస్థలు..
అమరావతిలో కేవలం ప్రభుత్వ సంస్థలే కాకుండా.. ఇతర సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. వీటిలో ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం అచ్చంగా తిరుమలను పోలి ఉండే టెంపుల్ నిర్మాణాన్ని ప్రారంభించింది. వాస్తవానికి .. వైసీపీ హయాంలో నిలిచిపోయిన పనులు తిరిగి పుంజుకున్నాయి. దీనికి తోడు మరింత విస్తరించారు. అదేవిధంగా విద్యాసంస్థలతోపాటు.. హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య చైర్మన్గా ఉన్న నందమూరి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి కూడా భూమిపూజ జరిగింది.. నిర్మాణాలు చేపట్టింది కూడా ఈ సంవత్సరమే కావడం విశేషం.
అదేవిధంగా స్పోర్ట్స్ సిటీలో ప్రముఖ బ్యాడ్ మింటన్ క్రీడాకారుడు… పుల్లెల గోపీచంద్ కూడా.. క్రీడా కేంద్రానికి శంకుస్థాపన చేశారు. మొత్తంగా 2025 సంవత్సరం అమరావతికి మహర్దశ పట్టేలా చేసిందనడంలో సందేహం లేదు.
This post was last modified on December 27, 2025 1:18 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…