Political News

హాట్ టాపిక్‌: ఏపీ 2025 రాజ‌కీయాలు ఇవే… !

2025 సంవత్సరంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? సాధారణ ప్రజల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ఏ విధంగా స్పందిస్తున్నారు? అనేది ఆసక్తికర విషయం. రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా మారాయి. కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందన్న విషయాన్ని పదేపదే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. తద్వారా కూటమి బలాన్ని తగ్గకుండా అదేవిధంగా ప్రజల్లో జోష్ తగ్గకుండా కూడా చూస్తున్నారు.

కోటమిగా ఉంటేనే విజయం దక్కించుకుంటామని చంద్రబాబు కూడా పార్టీ నాయకులతో చెబుతూ వస్తున్నారు. 2025 రాజకీయాల్లో తీసుకుంటే ఈ పరిణామం ఎక్కువగా కనిపించింది. ఇదే సమయంలో నాయకుల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ కలిసికట్టుగా పని చేయాలన్న సంకేతాలను రెండు పార్టీల నాయకులు బలంగా పంపిస్తున్నారు. మరోవైపు గతానికి భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కూట‌మికి బలాన్ని చేకూర్చే విధంగా బిజెపి నాయకులు ఉండాలని సూచించారు. ఇది ఈ ఏడాది జరిగిన కీలక పరిణామం.

మోడీ చేసిన కీలక ప్రతిపాదన కూటమిలో బలాన్ని పెంచిందని చెప్పాలి. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తరచుగా కూటమి బలంగా ఉంటుందని క్షేత్రస్థాయిలో నాయకులు కలిసి మెలిసి ఉండాలని సూచిస్తున్నారు. ఇక వైసిపి విషయానికి వస్తే ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రభుత్వం త‌మ‌దేన‌ని చెబుతూ వస్తున్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని పార్టీ విజయం ఖాయమని జ‌గ‌న్‌ భరోసా కల్పిస్తున్నారు,

2025 రాజకీయాల్లో ఈ రెండు రాజకీయ వర్గాలు(కూట‌మి-వైసీపీ) కూడా తమ తమ పార్టీ కార్యకర్తలను నాయకుల‌ను కాపాడుకునే దిశగా.. వారిలో ఉత్తేజాన్ని పెంచే దిశగా అడుగులు వేశాయని చెప్పాలి. ఇదే వ్యవహారం సాధారణ ప్రజల్లోనూ చర్చగా మారింది. మొత్తంగా 2025లో రాజకీయాలు పెద్దగా మార్పు అయితే కనిపించలేదు. వైసీపీ అధినేత జగన్ తన వైఖరిని మార్చుకోలేదు. కూటమి ప్రభుత్వానికి కూడా తమ ఐక్యత బలంగా ఉందని చాటి చెప్పుకోవడంలో విజయవంతం సాధించింది.

This post was last modified on December 26, 2025 10:01 am

Share
Show comments
Published by
Kumar
Tags: AP Politics

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

44 minutes ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

3 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

5 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

5 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

7 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

7 hours ago