2025 సంవత్సరంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? సాధారణ ప్రజల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ఏ విధంగా స్పందిస్తున్నారు? అనేది ఆసక్తికర విషయం. రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా మారాయి. కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందన్న విషయాన్ని పదేపదే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. తద్వారా కూటమి బలాన్ని తగ్గకుండా అదేవిధంగా ప్రజల్లో జోష్ తగ్గకుండా కూడా చూస్తున్నారు.
కోటమిగా ఉంటేనే విజయం దక్కించుకుంటామని చంద్రబాబు కూడా పార్టీ నాయకులతో చెబుతూ వస్తున్నారు. 2025 రాజకీయాల్లో తీసుకుంటే ఈ పరిణామం ఎక్కువగా కనిపించింది. ఇదే సమయంలో నాయకుల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ కలిసికట్టుగా పని చేయాలన్న సంకేతాలను రెండు పార్టీల నాయకులు బలంగా పంపిస్తున్నారు. మరోవైపు గతానికి భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కూటమికి బలాన్ని చేకూర్చే విధంగా బిజెపి నాయకులు ఉండాలని సూచించారు. ఇది ఈ ఏడాది జరిగిన కీలక పరిణామం.
మోడీ చేసిన కీలక ప్రతిపాదన కూటమిలో బలాన్ని పెంచిందని చెప్పాలి. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తరచుగా కూటమి బలంగా ఉంటుందని క్షేత్రస్థాయిలో నాయకులు కలిసి మెలిసి ఉండాలని సూచిస్తున్నారు. ఇక వైసిపి విషయానికి వస్తే ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రభుత్వం తమదేనని చెబుతూ వస్తున్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని పార్టీ విజయం ఖాయమని జగన్ భరోసా కల్పిస్తున్నారు,
2025 రాజకీయాల్లో ఈ రెండు రాజకీయ వర్గాలు(కూటమి-వైసీపీ) కూడా తమ తమ పార్టీ కార్యకర్తలను నాయకులను కాపాడుకునే దిశగా.. వారిలో ఉత్తేజాన్ని పెంచే దిశగా అడుగులు వేశాయని చెప్పాలి. ఇదే వ్యవహారం సాధారణ ప్రజల్లోనూ చర్చగా మారింది. మొత్తంగా 2025లో రాజకీయాలు పెద్దగా మార్పు అయితే కనిపించలేదు. వైసీపీ అధినేత జగన్ తన వైఖరిని మార్చుకోలేదు. కూటమి ప్రభుత్వానికి కూడా తమ ఐక్యత బలంగా ఉందని చాటి చెప్పుకోవడంలో విజయవంతం సాధించింది.
This post was last modified on December 26, 2025 10:01 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…