తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన శపథం చేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు ఎట్టిపరిస్థితిలోనూ మరోసారి అధికారం దక్కనివ్వనని.. ఇది తన శపథమని స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా కోసిగిలో నిర్వహించిన కాంగ్రెస్ మద్దతు దారులైన సర్పంచ్ల సన్మాన సభకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
వచ్చే ఎన్నికల్లో రెండింట మూడు వంతుల మెజారిటీతో కూడా కాంగ్రెస్ విజయం దక్కించుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 119 స్థానాలకే ఎన్నికలు జరిగితే.. 80 చోట్ల, నియోజకవర్గాల పునర్విభజన జరిగి 153 సీట్లకు పెరిగితే 100 స్థానాల్లో తామే విజయం దక్కించుకుంటామని స్పష్టం చేశారు.
గతం బీఆర్ ఎస్.. భవిష్యత్తు కాంగ్రెస్..
“కేసీఆర్, కేటీఆర్, హరీష్రావ్.. రాసిపెట్టుకోండి. వచ్చే ఎన్నికల్లోనూ మాదే విజయం.“ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబాన్ని `కాల కూట విషం`గా అభివర్ణించారు. ఆ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితిలోనూ అధికారం దరిదాపుల్లోకి కూడా రాకుండా అడ్డుకుంటానని చెప్పారు.
“కొడంగల్ బిడ్డగా.. ఈ గడ్డపై నుంచే శపథం చేస్తున్నా. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం.. కేసీఆర్ కుటుంబానికి అధికారం ఉండదు“ అని రేవంత్ రెడ్డి శపథం చేశారు. బీఆర్ ఎస్, కేసీఆర్ చరిత్ర ఇక, ముగిసిపోయినట్టేనని అన్నారు. ఆ పార్టీకి, ఆ కుటుంబానికి కూడా భవిష్యత్తు ఉండబోదని చెప్పారు. “తెలంగాణ గతం కేసీఆర్.. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్“ అని వ్యాఖ్యానించారు.
కేటీఆర్.. నువ్వెంత?
ఇదేసమయంలో బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పైనా రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. “నేను మైకు ముందుకు రావట్లేదని అంటున్నాడు. దాక్కున్నానని ప్రచారం చేస్తున్నాడు“ అంటూ.. కేటీఆర్పై విమర్శలు గుప్పించారు.“నీలాగా తండ్రి పేరు చెప్పుకొని నేను బతకడం లేదు.“ అని అన్నారు.
నల్లమల నుంచి వచ్చి జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ అయిన తర్వాత ముఖ్యమంత్రిని అయ్యానని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇదేసమయంలో నీస్థాయి ఎంత..? అని కేటీఆర్ను నిలదీశారు. ఏపీలో చదువుకున్న నీకు తెలంగాణ గురించి ఏం తెలుసునని వ్యాఖ్యానించారు. “నీ అవ్వ.. లాగులో తొండలు విడిచి కొడతా బిడ్డా, నా సంగతి మీ నాన్నని అడుగు చెప్తాడు.గాలికి తిరిగే గాలి గాడితో నాకెందుకు అని నేను మంచిగుంటున్నా.” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…