Political News

రెడ్డ‌మ్మ వ‌ర్సెస్ క‌ళావ‌తి.. మంత్రి పీఠం ఎవ‌రికి? వైసీపీ డిబేట్‌

జ‌గ‌న్ కేబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణకు ముహూర్తం ద‌గ్గ‌ర ప‌డుతోంది. మ‌రో ప‌ది మాసాల్లోనే మంత్రి వ‌ర్గంలోని స‌గం మందిని మార్చేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో కొంద‌రు ఇప్ప‌టికే మంత్రి వ‌ర్గ రేసులో దూకుడుగా ముందున్నారు. అయితే.. ఎలాంటి ప్ర‌య‌త్నాలూ లేకుండానే కొంద‌రి పేర్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారిలో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేర్లు.. శ్రీకాకుళం జిల్లా పాత‌ప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఇదే జిల్లాకు చెందిన పాల‌కొండ ఎమ్మెల్యే విశ్వ‌స‌రాయి క‌ళావ‌తి. వీరిద్ద‌రూ కూడా వైఎస్ కుటుంబానికి స‌న్నిహితులే. మ‌రీ ముఖ్యంగా క‌ళావ‌తి వ‌రుస విజ‌యాల‌తో దూకుడుగా ఉన్నారు.

పార్టీ ప‌రంగా మంచి పేరు కూడా క‌ళావ‌తికి ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇద్ద‌రూ సౌమ్యులు, వివాద ర‌హితులే కావ‌డం గ‌మ‌నార్హం. వీరిలో పాల‌కొండ ఎమ్మెల్యే ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హించ‌డంతోపాటు.. జ‌గ‌న్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించే నాయ‌కురాలిగా ఎప్ప‌టి నుంచో పేరు తెచ్చుకున్నారు. 2014లో విజ‌యం సాధించిన క‌ళావ‌తికి.. టీడీపీ నుంచి తొలుత ఆహ్వానం అందింది. ఈ విష‌యాన్ని ఆమె అప్ప‌ట్లో స‌భ‌లోనే చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ కోసం.. పార్టీ కోసం.. తాను వైసీపీని వీడేది లేద‌ని చెప్పుకొచ్చారు. పార్టీ గెలుపులోనూ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. జ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యంలో సమాంత‌రంగా తాను కూడా పాద‌యాత్ర చేశారు.

ఇక‌, రెడ్డి శాంతి కూడా పాత‌ప‌ట్నంలో వైసీపీ పునాదులు బ‌ల‌ప‌రుస్తున్నారు. ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చిన నిదుల‌తో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేస్తున్నారు. అయితే.. క‌ళావ‌తి సీనియ‌ర్ కావ‌డం.. గ‌త ఏడాది ప్ర‌భుత్వం ఏర్పాటు స‌మ‌యంలోనే ఆమె త‌న‌కు కేబినెట్లో చోటు ద‌క్కుతుంద‌ని ఆశించ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇప్పుడు ఇద్ద‌రికీ అవ‌కాశం ఇస్తారా? లేక ఒక‌రికే స‌రిపెడ‌తారా? అనేది ఆస‌క్తిగా మారింది. ఈ జిల్లా నుంచి ఇప్ప‌టికే ఇద్ద‌రు మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌, మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజులు కొన‌సాగుతున్నారు. వీరిని అలాగే ఉంచుతార‌ని ప్ర‌చారంలో ఉంది.

ఇక‌, ఎస్టీ కోటాలో విజ‌యనగ‌రం జిల్లా కురుపాం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పుష్ప శ్రీవాణిని ప‌క్క‌న పెట్టి.. ఆ స్తానంలో క‌ళావ‌తికి అవ‌కాశం ఇచ్చే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంద‌ని అంటున్నారు. అయితే.. తాను బ‌ల‌మైన పాత‌ప‌ట్నంలో వైసీపీ జెండా పాతాన‌ని .. త‌న‌కు గుర్తింపు ఇవ్వ‌డం ద్వారా టీడీపీకి మ‌రింత చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని రెడ్డి శాంతి డిమాండ్‌గా వినిపిస్తోంది. ఇలా ఎలా చూసుకున్నా.. వీరిద్ద‌రిలో ఎక్కువ మార్కులు క‌ళావ‌తికే ప‌డుతున్నాయి క‌నుక ఆమెకే కేబినెట్లో చోటు ద‌క్కుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on December 10, 2020 3:24 pm

Share

Recent Posts

కల్ట్ మూవీ… ఏదో అనుకుంటే

కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…

5 hours ago

డీలిమిటేషన్ బిల్లు లేన‌ట్టేనా?

దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభించి .. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఆశ‌లు ప్ర‌స్తుత స‌మావేశాల్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం…

7 hours ago

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

8 hours ago

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

8 hours ago

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…

8 hours ago

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

9 hours ago