బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన పాలనను `మాఫియా`తో పోల్చారు. “ఇది ప్రజాపాలన కాదు.. పక్కా మాఫియా పాలన“ అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు. గత కేసీఆర్ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేందుకు కాంగ్రెస్ నాయకులు చేయని ప్రయత్నం లేదని వ్యాఖ్యానించారు. గత 2023 ఎన్నికల ముందు.. బహుళార్థ సాథక ప్రాజెక్టు అయిన.. కాళేశ్వరంపై బాంబులు వేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అందుకే.. అది దెబ్బతిందన్న అనుమానాలు కూడా ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. ఇక, ఇప్పుడు ఇసుక మాఫియా చెలరేగిపోతోందని విమర్శించారు. చెక్ డ్యాముల మీద జిలెటిన్ స్టిక్స్ వేస్తున్నారని ఆరోపించారు. “ఇది మానవ నిర్మిత విధ్వంసం“ అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ‘వాటర్ మ్యాన్’ గా పేరొందిన రాజేంద్రసింగ్ కూడా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని.. ప్రాజెక్టులను నాశనం చేస్తున్నారని చెబుతున్నారని తెలిపారు. అయినా.. ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉందన్నారు.
ఇసుక తవ్వకాల కోసం.. ప్రాజెక్టులపై రంధ్రాలు చేసి.. జిలెటిన్ స్టిక్స్ను పెట్టి పేల్చారని కేటీఆర్ ఆరోపిం చారు. ఇసుకను దోచుకోవడానికి అడ్డుగా ఉన్నాయని.. కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముతో చేపట్టిన చెక్డ్యామ్లను పేల్చేస్తున్నారని తెలిపారు. “భూగర్భ జలాలు పెరగాలని మేం చెక్డ్యామ్లు కడితే.. వాటిని కూల్చివేసి పొలాలను ఎడారిగా మారుస్తున్నారు.“ అని ఆరోపించారు. ఈ పరిణామాలను చూస్తూ ఊరుకునేది లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికితగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
This post was last modified on December 23, 2025 3:45 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…